Rekha Nayak: కాంగ్రెస్‌ టికెట్‌కు ఎమ్మెల్యే రేఖా నాయక్‌ దరఖాస్తు

భారాసకు చెందిన ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్‌ టికెట్‌ కోసం ఆమె దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు గాంధీభవన్‌లో రేఖానాయక్‌ పీఏ దరఖాస్తు అందజేశారు. 

Updated : 22 Aug 2023 15:17 IST

హైదరాబాద్‌: భారాసకు చెందిన ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్‌ టికెట్‌ కోసం ఆమె దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు గాంధీభవన్‌లో రేఖానాయక్‌ పీఏ దరఖాస్తు అందజేశారు.

సోమవారం భారాస అధినేత, సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఖానాపూర్‌ టికెట్‌ను భూక్యా జాన్సన్‌కు భారాస కేటాయించింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రేఖానాయక్‌ భర్త, టీజీవో జిల్లా అధ్యక్షుడు అజ్మీరా శ్యాంనాయక్‌ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. త్వరలోనే రేఖా నాయక్‌ కూడా హస్తం పార్టీలో చేరే అవకాశముంది. 

ఈ సందర్భంగా ఖానాపూర్‌లో రేఖానాయక్‌ మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు తనతోనే ఉన్నారని చెప్పారు. తన జీవితం ప్రజలకే అంకితం చేయాలనే కోరికతో రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఎవరు మోసం చేసినా భగవంతుడు మోసం చేయడనే నమ్మకం తనకుందని చెప్పారు. ఖానాపూర్‌ నుంచి తాను పోటీలో ఉండటం ఖాయమని ఆమె స్పష్టం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని