Revanth reddy: సీఎం నిర్ణయం.. జంట నగరాలపై అణువిస్పోటం: రేవంత్ రెడ్డి
జీవో 111 రద్దు చేస్తే కేసీఆర్ తీసుకున్న నిర్ణయం జంట నగరాలపై అణువిస్ఫోటం లాంటిదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ తన బినామీలు, బంధువర్గాలకు రూ. లక్షల కోట్ల ఆస్తులు కట్టబెట్టడమే హైదరాబాద్లో 111 జీవో రద్దు లక్ష్యమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం జంట నగరాల పర్యావరణంపై అణువిస్పోటం లాంటిదని, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తాగునీటి సమస్య పేరు చెప్పి.. కేసీఆర్ సమస్యను చిన్నదిగా చేసి చూపిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బినామీ చట్టాన్ని వర్తింపజేసి వాస్తవాలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎవరెవరికి భూములు కేటాయించారన్న అంశంపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిజనిర్ధారణ కమిటీ వేస్తామని రేవంత్ ప్రకటించారు. ‘‘ 111 జీవో నిర్ణయం వెనుక రూ.లక్షల కోట్ల కుంభకోణం ఉంది. మొత్తం భూములను పేదల నుంచి కొనుగోలు చేశాక ఇప్పుడు జీవో రద్దు చేశారు. కేసీఆర్ బంధుగణం, బినామీ చేతుల్లోనే 80 శాతం భూములు ఉన్నాయి. కేసీఆర్ పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతున్నారు. బినామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం పటిష్ఠంగా అమలు చేయాలి. జంటనగరాలను కాపాడాలన్న చిత్తశుద్ధి ఉంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ఏజెన్సీలకు ఫిర్యాదు చేయాలి’’ అని రేవంత్రెడ్డి అన్నారు.
కర్ణాటక తీర్పే తెలంగాణలోనూ..
కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలంతా సమష్టిగా కృషి చేస్తే కర్ణాటక తీర్పే తెలంగాణలోనూ వస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కోవర్టులెవరూ లేరన్న ఆయన.. ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. పార్టీ, ప్రజల కోసం పది మెట్లు దిగడానికైనా తాను సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో రేవంత్ రెడ్డి అధ్యక్షతన పీసీసీ విస్త్రృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే హాజరయ్యారు. పీసీసీ కార్యవర్గంతోపాటు, డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల ఛైర్మన్లు, పీసీసీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ... అధికారం ఉందని విర్రవీగిన మోదీకి కర్ణాటక ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. కర్ణాటక ప్రజలను అభినందిస్తూ.. దీనికి కారణమైన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక, సిద్ధరామయ్య, డీకే శివకుమార్ను అభినందిస్తూ ఏకవాక్య తీర్మానం చేశారు. యూత్ డిక్లరేషన్ను భవిష్యత్ కార్యాచరణగా ముందుకు తీసుకెళ్లాలన్న రేవంత్రెడ్డి.. పేదల పక్షాన నిలవాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా.. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా జరపాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ క్రియాశీల పాత్రను మరోసారి ప్రజలకు గుర్తు చేయాలని రేవంత్ దిశా నిర్దేశం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండియా కూటమి విషయంలో దీదీ వ్యాఖ్యలు నమ్మలేం: అధీర్ రంజన్
ఇండియా కూటమికి వెలుపలి నుంచే తమ మద్దతు ఇస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను నమ్మలేమని కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ ఆరోపించారు. -
రెండు ప్రభుత్వాల తప్పిదాల వల్లే రైతులకు నష్టం: కొండా విశ్వేశ్వర్రెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతరాహిత్యంగా వ్యవహరిస్తోందని, ఆరు గ్యారెంటీలు అసాధ్యమైన హామీలని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. -
వైకాపా నేత ఇంట్లో పెట్రోల్ బాంబుల కలకలం
ఏపీలోని పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో పెట్రోల్ బాంబులు కలకలం రేపుతున్నాయి. తాజాగా మరో వైకాపా నేత ఇంట్లో 29 పెట్రోల్ బాంబులు బయటపడ్డాయి. -
ఈ-ఆఫీస్ మూసివేతపై అనుమానాలు.. గవర్నర్కు చంద్రబాబు లేఖ
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్కు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ-ఆఫీస్ అప్గ్రేడ్ వ్యవహారం నిలిపివేయాలని కోరారు. -
ఆ విషయంలో ప్రధాని అవివేకంగా ఆలోచిస్తున్నారు: శరద్ పవార్
ప్రధాని నరేంద్ర మోదీపై ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ విమర్శలు గుప్పించారు. -
నాపై అనర్హత వేటు కక్షపూరిత చర్య: జంగా కృష్ణమూర్తి
ఎమ్మెల్సీగా ఉన్న తనపై అనర్హత వేటు వేయడం కక్షపూరిత చర్య అని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి ఆరోపించారు. -
తెదేపా నేత కొనకళ్ల నారాయణకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
కృష్ణా జిల్లా తెదేపా అధ్యక్షుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ అస్వస్థతకు గురయ్యారు. -
ప్రశ్నించే గొంతుకను గెలిపించాలి
నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. -
కుల గణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి
రాష్ట్రంలో కుల గణన ప్రక్రియ చేపట్టిన తర్వాత బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య బుధవారం లేఖ రాశారు. -
సీఎం సొంతూరు ఉన్న నియోజకవర్గంలో భారాస నేతలపై దాడులు
రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, సీఎం రేవంత్రెడ్డి సొంతూరు ఉన్న అచ్చంపేట నియోజకవర్గంలో భారాస నేతలపై జరుగుతున్న దాడులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆ పార్టీ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. -
వైఫల్యాలను అంగీకరించకుండా ఉద్యోగులపై అభాండాలా?
కరెంటు కోతల విషయంలో సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను అంగీకరించకుండా.. ప్రతిపక్షాలు, విద్యుత్తు ఉద్యోగులపై అభాండాలు మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. -
దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వకపోవడం అన్యాయం
దొడ్డు వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వకపోవడం రైతులకు తీవ్ర అన్యాయం చేయడమేనని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
మాలీవాల్పై దాడి.. విచారణ జరిపించాలి
ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్పై జరిగిన దాడిపై భాజపా ఆందోలన వ్యక్తం చేసింది. ఈ దాడిపై సమగ్ర విచారణ జరపాలంటూ భాజపా నాయకులు, మహిళా మోర్చా సభ్యులు బుధవారం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ముందు నిరసనకు దిగారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్.. వైష్ణవీ చైతన్య ఏమన్నారంటే?
-
ఇండియా కూటమి విషయంలో దీదీ వ్యాఖ్యలు నమ్మలేం: అధీర్ రంజన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
లైంగిక వేధింపుల కేసు.. డీఎంహెచ్వో అరెస్టు
-
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర
-
తెలంగాణలో ఏసీబీకి చిక్కిన ముగ్గురు అధికారులు