NCP: ‘ఎన్నికల ప్రచారంలో ఆయన పేరు, ఫొటో వాడకండి’
అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఎన్నికల ప్రచారంలో శరద్ పవార్ ఫొటో, పేరు ఉపయోగించడంపై సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
దిల్లీ: ఎన్సీపీ ఎన్నికల ప్రచారంలో శరద్ పవార్ (Sharad Pawar) పేరు, ఫొటో ఉపయోగించవద్దని అజిత్ పవార్ (Ajit Pawar) వర్గానికి సుప్రీంకోర్టు (Supreme Court) సూచించింది. ఇందుకు హామీ ఇవ్వాలని కోరింది. లేనిపక్షంలో అజిత్ వర్గానికి వ్యతిరేకంగా ఆదేశాలు ఇస్తామని హెచ్చరించింది. రాబోయే ఎన్నికల్లో తన పేరు, ఫొటోను అజిత్ వర్గం ఉపయోగించకుండా ఆదేశాలివ్వాలని శరద్ పవార్ దాఖలు చేసిన పిటిషన్పై గురువారం సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది.
‘‘మీకున్న ప్రజాదరణపై నమ్మకం ఉన్నప్పుడు మీ ఫొటోనే ఉపయోగించండి. ఇకపై శరద్ పవార్ ఫొటో ఉపయోగించొద్దని మీ కార్యకర్తలకు చెప్పండి. మీరు ఆ పని చేయలేకపోతే.. మేం ఆదేశాలు ఇస్తాం’’అని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీనిపై మార్చి 19లోగా స్పందన తెలియజేయాలని అజిత్ పవార్ వర్గాన్ని ఆదేశించింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో యశ్వంతరావ్ చౌహాన్ పేరు, ఫొటోలు ఉపయోగించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.
‘మా దగ్గర డబ్బు లేదు’: లోక్సభ ఎన్నికల వేళ ఖర్గే వ్యాఖ్యలు
అజిత్ పవార్ గతేడాది ఎన్సీపీ నుంచి చీలి భాజపా- శిందే సారథ్యంలోని ప్రభుత్వంలో చేరడంతో పార్టీలో సంక్షోభం తలెత్తింది. దీంతో పార్టీ ఎవరిదనే విషయంలో ఇరు వర్గాల మధ్య నెలకొన్న వివాదాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల పరిష్కరించింది. అజిత్ పవార్ నేతృత్వంలోని వర్గాన్నే అసలైన ఎన్సీపీగా గుర్తించి.. ఆ పార్టీ జెండా, ఎన్నికల గుర్తును కూడా వారికే కేటాయించింది. ఎన్సీపీకి 53 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. అజిత్ వర్గం చీలిక తర్వాత శరద్ పవార్ పార్టీపై క్రమంగా నియంత్రణ కోల్పోతూ వచ్చారు. ప్రస్తుతం ఆయన వెంట 12 మంది ఎమ్మెల్యేలే ఉన్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ కాంగ్రెస్లో చేరిక అంశం వివాదాస్పదమైంది. -
నేతన్నలూ.. ఆత్మహత్యలు చేసుకోవద్దు
నేతన్నలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ (టీపీసీసీ-ఇఎంసీ) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ భాజపా రెండో విడత కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.