‘వందేళ్లయినా భాజపాకి అధికారం దక్కదు’
మహారాష్ట్రలో అధికారంలో ఉన్న ‘మహా వికాస్ అఘాడీ కూటమి’లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఒక భాగం. అయితే, శనివారం ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్తో మహారాష్ట్ర భాజపా అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడణవీస్ భేటీ కావడం చర్చనీయాంశమైంది. కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమే అని ఫడ్ణవీస్ వివరణ ఇచ్చినా.. రాష్ట్రంలో మరో కూటమి
శరద్ పవార్, ఫడణవీస్ భేటీపై సంజయ్ రౌత్ స్పందన
ముంబయి: మహారాష్ట్రలో అధికారంలో ఉన్న ‘మహా వికాస్ అఘాడీ కూటమి’లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కీలకమైన రాజకీయపక్షం. అయితే, శనివారం ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్తో మహారాష్ట్ర ప్రతిపక్ష నేత, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, దేవేంద్ర ఫడణవీస్ భేటీ కావడం చర్చనీయాంశమైంది. కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమే అని ఫడణవీస్ వివరణ ఇచ్చినా.. రాష్ట్రంలో మరో కూటమి ఏర్పడే అవకాశాలు ఉన్నాయంటూ ఊహగానాలు వెల్లువెత్తాయి. కాగా.. వారిద్దరి భేటీపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తాజాగా స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి సమావేశాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని తెలిపారు. అలాగే, దేవేంద్ర ఫడణవీస్కు చురకలంటించారు.
‘‘ఆ భేటీలో మంచి ప్రతిపక్ష నేత ఎలా ఉండాలి అనే విషయంపై ఫడ్ణవీస్కు శరద్పవార్ సలహాలు ఇచ్చి ఉండొచ్చు. ఫడణవీస్ ఇలాంటి పనులే చేస్తే (భేటీని ఉద్దేశించి) ప్రతిపక్ష భాజపా వందేళ్లయినా మహారాష్ట్రలో అధికారంలోకి రాదు. ఆపరేషన్ కమలం గురించి మర్చిపోండి. అది మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో అసాధ్యం. అయినా, ప్రతి భేటీని రాజకీయ కోణంలో ఎందుకు చూస్తారు? రాష్ట్ర, ప్రజా ప్రయోజనాల విషయంలో ప్రతిపక్ష నేతగా తన పాత్ర గురించి ఫడణవీస్ ఆ సమావేశంలో చర్చించి ఉండొచ్చు’’అని సంజయ్ రౌత్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నా
‘నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నా.. ఉండాలనుకుంటున్నా’ అని సినీనటుడు చిరంజీవి వ్యాఖ్యానించారు. పద్మవిభూషణ్ పురస్కారం అందుకుని దిల్లీ నుంచి శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్న ఆయన బేగంపేట విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. -
జనసేనకు వంగ లక్ష్మణ్గౌడ్ రాజీనామా
జనసేన తెలంగాణ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంగ లక్ష్మణ్గౌడ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. శుక్రవారం తాజ్కృష్ణలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపా దాస్మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.