Srikrishnadevarayulu: నా కాల్‌ డేటా చూసుకోండి.. విచారణకు సిద్ధం: లావు శ్రీకృష్ణదేవరాయులు

పల్నాడులో జరిగిన అల్లర్లను తానే సృష్టించినట్లు వైకాపా నేతలు విష ప్రచారం చేస్తున్నారని లావు శ్రీకృష్ణదేవరాయులు ఆగ్రహం వ్యక్తంచేశారు. 

Published : 20 May 2024 19:22 IST

అమరావతి: పల్నాడులో జరిగిన అల్లర్లను తానే సృష్టించినట్లు వైకాపా నేతలు విష ప్రచారం చేస్తున్నారని నరసరావుపేట తెదేపా ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ బిందు మాధవ్‌తో తమ కుటుంబానికి బంధుత్వం ఉందని కట్టుకథలు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్‌ కుమార్‌ మీనాను కలిసి ఫిర్యాదు చేశారు. హింసాత్మక ఘటనలపై అన్ని కోణాల్లో విచారణ జరిపి నిగ్గు తేల్చాలన్నారు. అవసరమైతే తన కాల్‌ డేటాను పరిశీలించాలని.. విచారణకు తాను సిద్ధమని స్పష్టంచేశారు.

ఓటమి భయంతో కొత్త కుట్రలు: వర్ల

ఓటమి భయంతోనే వైకాపా నేతలు కొత్త కుట్రలు చేస్తున్నారని తెదేపా సీనియర్‌ నేత వర్ల రామయ్య ఆరోపించారు. వైకాపా నేత మన్విత్‌ కృష్ణారెడ్డి తెదేపా నేత గెటప్‌తో సోషల్‌ మీడియాలో తెదేపాపై దుష్ప్రచారం చేస్తున్నారని డీఐజీ సెంథిల్‌ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. మన్విత్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని