Srinivas Goud: శ్రీనివాస్‌గౌడ్‌ ఎన్నికల అఫిడవిట్‌ టాంపరింగ్‌ వివాదం.. పిటిషనర్‌కు నోటీసులు

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఎన్నికల అఫిడవిట్‌ టాంపరింగ్‌ వివాదంలో నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో ఇవాళ మరోసారి విచారణ జరిగింది.

Published : 23 Aug 2023 15:46 IST

హైదరాబాద్‌: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఎన్నికల అఫిడవిట్‌ టాంపరింగ్‌ వివాదంపై నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో ఇవాళ మరోసారి విచారణ జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఫిర్యాదుదారుడు రాఘవేంద్రరాజుకు మిస్టేక్‌ ఆఫ్‌ ఫ్యాక్ట్స్‌ కింద ఈ నెల 19న మహబూబ్‌నగర్‌ పోలీసులు నోటీసుల జారీ చేశారు. నోటీసులపై వారంలోపు కోర్టులో సమాధానం చెప్పాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, పోలీసులు ఇచ్చిన నోటీసులను పిటిషనర్‌ రాఘవేంద్రరాజు కోర్టులో సవాల్‌ చేస్తూ ప్రొటెస్ట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. పోలీసులు మంత్రిని ఉద్దేశపూర్వకంగా తప్పించే ప్రయత్నం చేస్తున్నారంటూ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషన్‌పై విచారణ జరిపిన ప్రజాప్రతినిధుల కోర్టు తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఎన్నికల అఫిడవిట్‌ టాంపరింగ్‌ వివాదంపై గతంలో దాఖలైన పిటిషన్‌పై విచారణ చేసిన నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు.. శ్రీనివాస్‌గౌడ్‌, పలువురు అధికారులపై కేసు నమోదు చేయాలని మహబూబ్‌నగర్‌ పోలీసులను ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాలను పాటించలేదని.. వారిపై మహబూబ్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేయలేదని పిటిషనర్ రాఘవేంద్ర రాజు మరోసారి కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఆగస్టు 11న ప్రజాప్రతినిధుల కోర్టు మరోసారి విచారణ చేసింది. వాదనలు విన్న ధర్మాసనం.. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెంటనే సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సహా 11 మందిపై కేసు నమోదు చేశారు. శ్రీనివాస్‌ గౌడ్‌, పలువురు ఎన్నికల అధికారులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని