Chandrababu: వైకాపా హయాంలో బాగుపడింది ఆ ఐదుగురే: చంద్రబాబు

సీఎం జగన్‌.. శవ రాజకీయాల్లో ఆరితేరారని, రివర్స్‌ పాలనతో రాష్ట్రాన్ని నాశనం చేశారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.

Updated : 12 Apr 2024 22:20 IST

రేపల్లె: సీఎం జగన్‌.. శవ రాజకీయాల్లో ఆరితేరారని, రివర్స్‌ పాలనతో రాష్ట్రాన్ని నాశనం చేశారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. వైకాపా ప్రభుత్వ హయాంలో జగన్‌, విజయసాయిరెడ్డి, సజ్జల, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డే బాగుపడ్డారని ధ్వజమెత్తారు. జగన్‌ చేసేవి శవ రాజకీయాలని, తాను చేసేవి ప్రజా రాజకీయాలన్నారు. బాపట్ల జిల్లా రేపల్లెలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన  ప్రసంగించారు. ఒక్క ఛాన్స్‌ అని వచ్చిన జగన్‌ ప్రజలను మోసం చేశారని విమర్శించారు. పదవిని బాధ్యతగా తీసుకొని తాను పని చేస్తే.. జగన్ సొంత వ్యాపారాలకు అధికారాన్ని వాడుకున్నారని దుయ్యబట్టారు.

‘‘పోలవరం ప్రాజెక్టును గోదావరిలో కలిపేశారు. జగన్‌ వచ్చాక అమరావతిని నాశనం చేశారు. అన్ని రంగాలను పూర్తిగా ధ్వంసం చేశారు. తుపాను బాధితులను వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు. కాల్వల నిర్వహణ కూడా చేయకుండా పంటలను ముంచేశారు. అధికారంలోకి వచ్చాక వాన్‌పిక్‌ను పునరుద్ధరించి నిజాంపట్నం ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం’’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు