TDP: ‘పిన్నెల్లి పైశాచికం’ పేరుతో పుస్తకం విడుదల చేసిన తెదేపా

వైకాపాకు చెందిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలపై తెదేపా పుస్తకం విడుదల చేసింది. ‘పిన్నెల్లి పైశాచికం’ పేరుతో ఆ పార్టీ రూపొందించిన పుస్తకాన్ని నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, బుద్ధా వెంకన్న, అశోక్‌బాబు తదితరులు విడుదల చేశారు.

Published : 29 May 2024 14:24 IST

అమరావతి: వైకాపాకు చెందిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలపై తెదేపా పుస్తకం విడుదల చేసింది. ‘పిన్నెల్లి పైశాచికం’ పేరుతో ఆ పార్టీ రూపొందించిన పుస్తకాన్ని నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, బుద్ధా వెంకన్న, అశోక్‌బాబు తదితరులు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాచర్ల నియోజకవర్గంలో వైకాపా మారణహోమం సృష్టించిందని ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలో ఫ్యాక్షనిజం నామరూపాల్లేకుండా పోయిందని.. వైకాపా ప్రభుత్వం వచ్చాక ఈవీఎంలు కూడా ధ్వంసం చేసే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలతో మాచర్ల ప్రజలు విసిగిపోయారన్నారు. ప్రజల్లో చైతన్యం వచ్చినందునే ఆయన పారిపోయే పరిస్థితి తలెత్తిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పిన్నెల్లిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని నేతలు తెలిపారు.

పిన్నెల్లిపై తెదేపా పుస్తకం కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని