Chandrababu: తెదేపా-జనసేన తొలి జాబితాపై ముఖ్యనేతలతో చంద్రబాబు భేటీ

తెలుగుదేశం, జనసేన పార్టీల తరఫున శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా శనివారం విడుదల కానున్న నేపథ్యంలో తెదేపా ముఖ్యనేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు.

Published : 24 Feb 2024 09:32 IST

అమరావతి: తెలుగుదేశం, జనసేన పార్టీల తరఫున శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా శనివారం విడుదల కానున్న నేపథ్యంలో తెదేపా ముఖ్యనేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, యనమల రామకృష్ణుడు, నక్కా ఆనంద్‌బాబు, గొట్టిపాటి రవి, అనగానితో సమావేశమయ్యారు. తెదేపా-జనసేన కూటమి అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్న నేపథ్యంలో ఇరు పార్టీల నేతల్లో ఉత్కంఠ నెలకొంది. జాబితాలో ఎవరెవరి పేర్లు ఉంటాయనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఒకే వేదికపై నుంచి అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని