BJP: కర్ణాటక ఎన్నికల ప్రచారానికి తెలంగాణ భాజపా నేతలు

తెలంగాణ భాజపా నేతలు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. కర్ణాటక ఎన్నికల ప్రచారానికి భాజపా జాతీయ నాయకత్వం తెలంగాణ నేతలను ఎంపిక చేసింది.

Published : 13 Apr 2023 18:55 IST

హైదరాబాద్‌:  కర్ణాటక ఎన్నికల ప్రచారానికి భాజపా జాతీయ నాయకత్వం తెలంగాణ భాజపా నేతలను ఎంపిక చేసింది. మొత్తం 13 రాష్ట్రాల నుంచి కర్ణాటక ఎన్నికల ప్రచారానికి నేతలను ఎంపిక చేయగా.. 20 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లుగా తెలంగాణ నేతలను నియమించింది.

ఇప్పటికే తమకు అప్పగించిన నియోజకవర్గాలకు తెలంగాణ భాజపా నేతలు లక్ష్మణ్‌, అర్వింద్‌, జితేందర్‌రెడ్డి, వివేక్‌ వెంకటస్వామి, రఘునందన్‌రావు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, గరికపాటి, బండ కార్తీకరెడ్డి, కొల్లి మాధవి, ఎస్‌ కుమార్‌ వెళ్లి ప్రచార పర్వంలో పాల్గొంటున్నారు. లక్ష్మణ్‌తో సహా మరికొందరికి నియోజకవర్గంతో పాటు ఆ జిల్లాలో ఉన్న మరో 5 నియోజకవర్గాల సమన్వయ బాధ్యతలు అప్పగించింది. 224 నియోజకవర్గాలకు 224 మందిని ఇతర రాష్ట్రాల నుంచి ఇన్‌ఛార్జ్‌లుగా అధిష్ఠానం నియమించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని