TS Elections: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అఫిడవిట్‌పై పిటిషన్‌.. డిస్మిస్‌ చేసిన హైకోర్టు

రాష్ట్ర మంత్రి, మహబూబ్‌నగర్‌ భారాస అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్‌ (Srinivas Goud) ఎన్నికల అఫిడవిట్‌పై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్‌ చేసింది.

Published : 17 Nov 2023 18:48 IST

హైదరాబాద్‌: రాష్ట్ర మంత్రి, మహబూబ్‌నగర్‌ భారాస అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్‌ (Srinivas Goud) ఎన్నికల అఫిడవిట్‌పై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్‌ చేసింది. అసెంబ్లీ ఎన్నికల నామినేషన్‌ సందర్భంగా ఇటీవల శ్రీనివాస్‌గౌడ్‌ దాఖలు చేసిన అఫిడవిట్‌పై మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేంద్రరాజు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అఫిడవిట్‌లో సరైన వివరాలు వెల్లడించలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. సంబంధిత రిటర్నింగ్‌ అధికారి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. రాఘవేంద్రరాజు వేసిన పిటిషన్‌ను డిస్మిస్‌ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని