Ts News: ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు ద్వారా ఆ విషయం మరోసారి రుజువైంది: కేటీఆర్‌

తెరాస తిరుగులేని రాజకీయ శక్తి అని.. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయంతో ఈ విషయం మరోసారి రుజువైందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు...

Published : 14 Dec 2021 15:01 IST

హైదరాబాద్‌: తెరాస తిరుగులేని రాజకీయ శక్తి అని.. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయంతో ఈ విషయం మరోసారి రుజువైందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏ ఎన్నిక జరిగినా... తెరాస ఘన విజయం సాధిస్తోందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన తెరాస అభ్యర్థులకు కేటీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఓటేసిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనకు ప్రజలు ప్రతి ఎన్నికలోనూ పట్టం కడుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. తెరాస హయాంలో స్థానిక సంస్థలు బలపడ్డాయని.. ముఖ్యంగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా నిధులను అందించడంతో స్థానిక సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేశామని వెల్లడించారు. ప్రభుత్వ కార్యక్రమాల ఫలితంగానే స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు తెరాస అభ్యర్థులకు ఘన విజయం అందించారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని