Telangana News: భాజపా, కాంగ్రెస్‌ శ్రేణులపై లాఠీఛార్జి.. హనుమకొండలో ఉద్రిక్తత

హనుమకొండలోని భాజపా జిల్లా కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా భాజపా కార్యాలయం వద్ద కాంగ్రెస్‌ ధర్నా చేపట్టింది. దీనిపై స్పందించిన

Published : 01 Jul 2022 16:36 IST

హనుమకొండ: హనుమకొండలోని భాజపా జిల్లా కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా భాజపా కార్యాలయం వద్ద కాంగ్రెస్‌ ధర్నా చేపట్టింది. దీనిపై స్పందించిన భాజపా శ్రేణులు.. కాంగ్రెస్‌ కార్యకర్తలను అడ్డుకున్నారు. ఈక్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, ఘర్షణ జరిగింది. ఆగ్రహించిన భాజపా శ్రేణులు కాంగ్రెస్‌    నాయకుల వాహనాలపై దాడి చేశారు. ఇరువర్గాల పరస్పర దాడులతో హనుమకొండ భాజపా కార్యాలయం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రంగంలోకి దిగిన పోలీసులు లాఠీఛార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. దాడిలో పలు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. భాజపా కార్యాలయం వద్దకు వచ్చి కాంగ్రెస్‌ శ్రేణులు నిరసనకు దిగడాన్ని భాజపా నాయకులు తీవ్రంగా ఖండించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని