Ganta Srinivasa Rao: జగనన్న దెబ్బకు మొహం చాటేసిన సంస్థల జాబితా ఇది: గంటా శ్రీనివాసరావు

జగనన్న దెబ్బకు అమరావతికి మొహం చాటేసిన సంస్థల జాబితా చాలానే ఉందని తెదేపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు.

Updated : 18 Nov 2023 11:30 IST

అమరావతి: జగనన్న దెబ్బకు అమరావతికి మొహం చాటేసిన సంస్థల జాబితా చాలానే ఉందని తెదేపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. ‘వై ఏపీ హేట్స్‌ జగన్‌’ అంటూ ఓ పోస్టర్‌ను సోషల్‌ మీడియాలో ఆయన పోస్ట్‌ చేశారు. అందులో అమరావతి నుంచి తరలి వెళ్లిన సంస్థల జాబితాను ప్రస్తావించారు. దేశంలోనే రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందన్నారు. ‘‘కేంద్ర కార్యాలయాలు ఎక్కడ పెట్టాలో తెలియక ఆ సంస్థలు ఏపీవైపే రావట్లేదు. ప్రతిష్ఠాత్మక సంస్థలు కూడా హైదరాబాద్‌ నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. 

మాట తప్పడం ఈ సీఎంకు అలవాటే!

రాష్ట్రంలో గందరగోళాలు, నిర్లక్ష్యాలు జరగకుండా అమరావతి రాజధానిగా ఉండి ఉంటే ఈ సంస్థలన్నీ తమ కార్యకలాపాలు ఇప్పటికే ప్రారంభించి ఉండేవి. జగన్‌ రివర్స్‌ పాలన వల్ల రాష్ట్రం అన్ని విధాలుగా నష్టపోయింది. ఓటు అనే ఆయుధంతో వైకాపా ప్రభుత్వాన్ని తరిమికొడదాం’’ అని గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని