Nitish Kumar: 2024లో భాజపాకు ఓటేస్తే విధ్వంసం కొనితెచ్చుకున్నట్లే: నీతీశ్
Nitish Kumar Attack on BJP: వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే విధ్వంసాన్ని కొని తెచ్చినట్లే అవుతుందని నీతీశ్ కుమార్ అన్నారు. ఆ పార్టీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఏకమవుతున్నాయని చెప్పారు.
పట్నా: భాజపా (BJP) నేతృత్వంలోని ఎన్డీయే సర్కారుపై జేడీయూ నేత, బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ (Nitish Kumar) ఘాటు విమర్శలు చేశారు. 2024 ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటేస్తే విధ్వంసాన్ని కొని తెచ్చుకున్నట్లేనని చెప్పారు. ప్రస్తుతం భాజపాకు వ్యతిరేకంగా విపక్షాల ఐక్యం కోసం తాను పనిచేస్తున్నట్లు చెప్పారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా జేడీయూ కార్యాలయంలో ఆయన పార్టీ కార్యకర్తలనుద్దేశించి శుక్రవారం మాట్లాడారు.
‘‘విపక్షాల ఐక్యత కోసం నేను పనిచేస్తున్నా. నేనైతే ప్రధాని మంత్రి పదవికి పోటీలో లేను. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు విపక్షాలను ఒక తాటిపైకి వస్తున్నాయి. ప్రస్తుతానికి నా ముందున్న ఒకే ఒక్క లక్ష్యం భాజపాను మరోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే. సార్వత్రిక ఎన్నికల్లో ఎవరైతే భాజపాకు ఓటు వేస్తారో వారు తమతో పాటు దేశానికీ విధ్వంసాన్ని కొనితెచ్చినట్లే. కేంద్ర రాష్ట్రాల్లో సుపరిపాలన కావాలంటే మాకు (విపక్షాలకు) ఓటు వేయాలి’’ అని నీతీశ్ అన్నారు.
విపక్షాల ఐక్యం చేసే దిశగా కాంగ్రెస్, వామపక్ష పార్టీల నేతలతో తాను భేటీ అయినట్లు నీతీశ్ వెల్లడించారు. సమావేశాలన్నీ సానుకూల వాతావరణంలో నిర్మాణాత్మకంగా జరిగాయని చెప్పారు. దేశవ్యాప్తంగా పర్యటించి ఇతర పార్టీ నేతలతోనూ మాట్లాడనున్నానని చెప్పారు. మతపరంగా సమాజాన్ని చీల్చడం తప్ప ఈ దేశానికి భాజపా చేసిందేమీ లేదన్నారు. అందుకే ఆ పార్టీ చరిత్రను మార్చాలనకుంటోందని ఆరోపించారు. ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్తో కలిసి రెండ్రోజుల పాటు దిల్లీలో పర్యటించిన నీతీశ్.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు నేతలతో భేటీ అయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండు ప్రభుత్వాల తప్పిదాల వల్లే రైతులకు నష్టం: కొండా విశ్వేశ్వర్రెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతరాహిత్యంగా వ్యవహరిస్తోందని, ఆరు గ్యారెంటీలు అసాధ్యమైన హామీలని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. -
వైకాపా నేత ఇంట్లో పెట్రోల్ బాంబుల కలకలం
ఏపీలోని పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో పెట్రోల్ బాంబులు కలకలం రేపుతున్నాయి. తాజాగా మరో వైకాపా నేత ఇంట్లో 29 పెట్రోల్ బాంబులు బయటపడ్డాయి. -
ఈ-ఆఫీస్ మూసివేతపై అనుమానాలు.. గవర్నర్కు చంద్రబాబు లేఖ
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్కు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ-ఆఫీస్ అప్గ్రేడ్ వ్యవహారం నిలిపివేయాలని కోరారు. -
ఆ విషయంలో ప్రధాని అవివేకంగా ఆలోచిస్తున్నారు: శరద్ పవార్
ప్రధాని నరేంద్ర మోదీపై ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ విమర్శలు గుప్పించారు. -
నాపై అనర్హత వేటు కక్షపూరిత చర్య: జంగా కృష్ణమూర్తి
ఎమ్మెల్సీగా ఉన్న తనపై అనర్హత వేటు వేయడం కక్షపూరిత చర్య అని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి ఆరోపించారు. -
తెదేపా నేత కొనకళ్ల నారాయణకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
కృష్ణా జిల్లా తెదేపా అధ్యక్షుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ అస్వస్థతకు గురయ్యారు. -
ప్రశ్నించే గొంతుకను గెలిపించాలి
నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. -
కుల గణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి
రాష్ట్రంలో కుల గణన ప్రక్రియ చేపట్టిన తర్వాత బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య బుధవారం లేఖ రాశారు. -
సీఎం సొంతూరు ఉన్న నియోజకవర్గంలో భారాస నేతలపై దాడులు
రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, సీఎం రేవంత్రెడ్డి సొంతూరు ఉన్న అచ్చంపేట నియోజకవర్గంలో భారాస నేతలపై జరుగుతున్న దాడులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆ పార్టీ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. -
వైఫల్యాలను అంగీకరించకుండా ఉద్యోగులపై అభాండాలా?
కరెంటు కోతల విషయంలో సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను అంగీకరించకుండా.. ప్రతిపక్షాలు, విద్యుత్తు ఉద్యోగులపై అభాండాలు మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. -
దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వకపోవడం అన్యాయం
దొడ్డు వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వకపోవడం రైతులకు తీవ్ర అన్యాయం చేయడమేనని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
మాలీవాల్పై దాడి.. విచారణ జరిపించాలి
ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్పై జరిగిన దాడిపై భాజపా ఆందోలన వ్యక్తం చేసింది. ఈ దాడిపై సమగ్ర విచారణ జరపాలంటూ భాజపా నాయకులు, మహిళా మోర్చా సభ్యులు బుధవారం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ముందు నిరసనకు దిగారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర
-
తెలంగాణలో ఏసీబీకి చిక్కిన ముగ్గురు అధికారులు
-
ఖాన్సార్ మరింత ఎరుపెక్కేలా.. ‘సలార్2’లో మరో విలన్గా మలయాళ నటుడు
-
హైదరాబాద్లో భారీ వర్షం.. పలుచోట్ల స్తంభించిన ట్రాఫిక్
-
ఆ ప్రచారాన్ని ఖండిస్తున్నాం: సినిమా ప్రదర్శనల నిలిపివేతపై టీఎఫ్పీసీ క్లారిటీ
-
వన్ టూ త్రీ ఫోర్.. ఇప్పటికీ అవే నాలుగంకెల పిన్స్!