Mimi Chakraborthy: పశ్చిమ బెంగాల్లో అధికార టీఎంసీకి ఝలక్.. ఎంపీ మిమి చక్రవర్తి రాజీనామా
పశ్చిమ బెంగాల్లో అధికార టీఎంసీ ఎంపీ మిమి చక్రవర్తి తన పదవికి రాజీనామా చేశారు.
కోల్కతా: సార్వత్రిక ఎన్నికల ముందు పశ్చిమ బెంగాల్ (West Bengal)లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC)కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ ఎంపీ, నటి మిమి చక్రవర్తి (Mimi Chakraborty) తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షురాలు, రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee)కి అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా తన నియోజకవర్గంలోని స్థానిక నాయకత్వంపై మిమి చక్రవర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. వారితో తలెత్తిన అభిప్రాయబేధాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అంతకు రెండురోజుల ముందు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ పదవులకు ఆమె రాజీనామా చేశారు.
సందేశ్ఖాలీలో ఉద్రిక్తత.. టీఎంసీ ఎంపీ ఫొటోషూట్పై భాజపా విమర్శలు
‘‘జాదవ్పుర్ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశాను. ఈ క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. సినిమా పరిశ్రమ నుంచి వచ్చానని కొందరు నా గురించి హేళనగా మాట్లాడారు. స్థానిక నాయకుల్లో కొంతమందిని నేను కలవలేకపోయి ఉండొచ్చు. అంతమాత్రాన వారితో నేను అమర్యాదగా వ్యవహరించినట్లు కాదు. రాజకీయాల్లో నైతికత ఏంటనేది నాకు అర్థం కావడం లేదు’’ అని ఆమె వ్యాఖ్యానించారు. మరోవైపు మిమి చక్రవర్తి రాజీనామాను మమత బెనర్జీ ఆమోదించలేదని సమాచారం. 2019 ఎన్నికల్లో జాదవ్పుర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన ఆమె.. భాజపా (అనుపమ్ హజ్రా), సీపీఎం (రంజన్ భట్టాచార్య) తరఫున పోటీ చేసిన సీనియర్ నాయకులను ఓడించి విజయం సాధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా కుమారున్ని మీకు అప్పగిస్తున్నాను: సోనియాగాంధీ
రాహుల్ గాంధీకి మద్దతుగా సోనియాగాంధీ రాయ్బరేలీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
మళ్లీ భాజపా గెలిస్తే.. ఆ నేతలు కటకటాల్లోకే..: కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
దేశంలో మరోసారి భాజపా అధికారంలోకి వస్తే పలువురు కీలక నేతల్ని జైలుకు పంపుతుందని దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు (Latest News)
-
గాల్లో ఉండగా విమానం ‘ఏసీ’లో మంటలు.. అత్యవసర ల్యాండింగ్!
-
48 గంటల్లో పోలింగ్ శాతాలపై.. ఈసీ స్పందన కోరిన సుప్రీంకోర్టు
-
వర్షం ముప్పు.. బెంగళూరును ‘సబ్ఎయిర్’ సిస్టమ్ కాపాడుతుందా?
-
ఇక కంటితోనే స్క్రీన్ను ఆపరేట్ చేసేలా: త్వరలో యాపిల్ కొత్త ఫీచర్లు
-
ఆరోగ్యకరమైన ఆహారం.. జొమాటోలో కొత్త ఫీచర్
-
తరగతి గది ఆవరణలో చిన్నారి మృతదేహం.. స్కూల్కు నిప్పంటించిన కుటుంబసభ్యులు