వివిధ పార్టీల నేతలు టచ్లో ఉన్నారు: రేవంత్
తెలంగాణలో వివిధ పార్టీలకు చెందిన కొంతమంది నేతలు తనతో టచ్లో ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్లో అన్ని సామాజిక వర్గాలకు
హైదరాబాద్: తెలంగాణలో వివిధ పార్టీలకు చెందిన కొంతమంది నేతలు తనతో టచ్లో ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్లో అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం ఉంటుందని స్పష్టం చేశారు. రెండు, మూడు రోజుల్లో పీసీసీ అధికార ప్రతినిధులను నియమించనున్నట్లు చెప్పారు. తెదేపా తెలంగాణ మాజీ అధ్యక్షుడు ఎల్ రమణకు నాలుగు సార్లు భోజనం పెట్టి.. ఆ తరువాత సీఎం కేసీఆర్ తెరాసలోకి తీసుకున్నారని ఆరోపించారు. ఇవాళ ముగ్గురు నేతలు తనను కలిసి పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారన్నారు. వారిలో భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్ సోదరుడు, నిజమాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్; జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, మహబూబ్నగర్ భాజపా జిల్లా అధ్యక్షుడు ఎర్ర శేఖర్ ముదిరాజ్; భూపాల్పల్లికి చెందిన తెదేపా మాజీ నేత గండ్ర సత్యనారాయణలు ఉన్నట్లు వివరించారు. మూడు వర్గాలకు చెందిన నేతలు పార్టీలోకి వస్తున్నారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణికం ఠాగూర్కు రూ.50 కోట్లు ఇచ్చి పీసీసీ అధ్యక్షుడు అయ్యారని కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలపై రేవంత్ రెడ్డి స్పందించారు. ‘‘కౌశిక్రెడ్డి చిన్న పిల్లవాడు. ఆ మాటలు అతనివి కావు. సీఎం కేసీఆర్ మాట్లాడించినవి. హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిని ఇప్పుడే ప్రకటించం. తెరాసతో కౌశిక్ రెడ్డి టచ్లో ఉన్న విషయం నాకు ముందే తెలుసు. హుజూరాబాద్లో కౌశిక్ రెడ్డికి తెరాస టికెట్ ఇస్తుందని నేను అనుకోవడం లేదు. ప్రస్తుతం హుజూరాబాద్లో తెరాసకు సరైన అభ్యర్థి లేనందునే కాంగ్రెస్ పార్టీ నేతకు గాలం వేశారు. నిన్నటి పెట్రోల్, డీజిల్ పెంపుపై నిరసన కార్యక్రమాలకు మంచి స్పందన వచ్చింది’’ అని రేవంత్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్