TDP-JANASENA: బ్రో.. మీరు ఎవరి తాలూకా!.. వైకాపాపై సోషల్ మీడియాలో ట్రోల్స్
రాష్ట్రంలో ఎన్డీయే కూటమి తిరుగులేని విజయకేతనం ఎగురవేశాక సామాజిక మాధ్యమాల్లో వైకాపాపై ట్రోల్స్ బాగా పెరిగాయి.
మూడ్ ఆఫ్ ఆంధ్ర.. ‘హలో ఏపీ.. బై బై వైసీపీ’
సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడిదే పెద్ద చర్చ
ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి తిరుగులేని విజయకేతనం ఎగురవేశాక సామాజిక మాధ్యమాల్లో వైకాపాపై ట్రోల్స్ బాగా పెరిగాయి. ప్రచారంలో జనసేన అధినేత పవన్కల్యాణ్ ఇచ్చిన ‘హలో ఏపీ.. బై బై వైసీపీ’ నినాదం ఈ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజల్లోకి బాగా వెళ్లింది. ఫలితాల తరువాత కూడా దాన్ని విపరీతంగా గుర్తు చేసుకున్నారు. ఈ నినాదం ఎన్నికల్లో కూటమి గెలవడానికి దోహదపడిందని చర్చించుకుంటున్నారు. వైకాపా నాయకులు విర్రవీగుతూ పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యల్ని, ప్రస్తుత ఫలితాలను పోల్చుతూ ఓ రేంజిలో నెటిజన్లు ఆడుకున్నారు. ఎన్డీయే గెలిచిన అంకెలను చూపిస్తూ వాటి కింద పలు సభల్లో జగన్ ప్రదర్శించిన విచిత్రమైన హావభావాలతో వ్యంగ్యంగా పోస్టులు పెట్టారు. సోమవారం వరకు.. ‘అధికారం మాదే.. వైనాట్ 175..’ అంటూ అతిశయోక్తులకు పోయిన జగన్ బృందం ఇప్పుడు ముఖం చెల్లక ట్రోలర్ల దెబ్బకు మూగబోయింది. వారి సామాజిక మాధ్యమాల ఖాతాలను బ్లాక్ చేసుకున్నారు. వైకాపా ఘోర పరాజయాన్ని సూచిస్తూ పలువురు యువకులు ఆ పార్టీ ఎన్నికల గుర్తు ఫ్యాన్ను ద్విచక్రవాహనాలకు కట్టి ఊరంతా ఈడ్చుకెళ్లిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
వైకాపాను అధఃపాతాళానికి తొక్కుతా..
తమ పార్టీ తరఫున పోటీ చేసిన ప్రతి ఒక్కరినీ గెలిపించుకున్న పవన్కల్యాణ్.. ఎన్నికల్లో ప్రచారం సందర్భంగా ఓ సభలో చేసిన ‘జగన్ గుర్తుంచుకో.. నీ పార్టీని అథ:పాతాళానికి తొక్కుతా’ అంటూ చేసిన శపథం వీడియోను ఫలితాల అనంతరం ఆయన అభిమానులు షేర్ చేస్తూ గుర్తు చేసుకున్నారు. ‘పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా’ బహుశా ఈ వాక్యం తెలియని నెటిజన్లు ఉండరేమో అంటే అతిశయోక్తి కాదు. సోషల్మీడియాలో ‘బ్రో.. మీరు ఎవరి తాలూకా..’ ఇప్పుడు ఇదే సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చ. ఎందుకంటే ఫలితాలకు ముందు ‘పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా’, ‘పిఠాపురం ఎమ్మెల్యేగారి అబ్బాయి రామ్చరణ్ తాలూకా’ అంటూ వాహనాల నంబరు ప్లేట్లకు స్టిక్కర్లు వేసుకుని పవన్కల్యాణ్కు మద్దతుగా నిలుస్తూ అభిమానులు తెగ వైరల్ చేశారు. అడపాదడపా అక్కడక్కడ ‘డిప్యూటీ సీఎం తాలూకా’ అంటూ వంగా గీతకు ఒక్కరిద్దరు మద్దతుగా స్టిక్కర్లు వేసుకున్నా పవన్ అభిమానుల ధాటికి కొట్టుకుపోయారు.
మనల్ని ఎవడ్రా ఆపేది?
‘2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఓటమిపాలయ్యారంటూ వైకాపా నేతలు కారుకూతలు కూశారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో నిలబెట్టిన ప్రతి ఒక్కరినీ మా నాయకుడు గెలిపించుకున్నారు’ అంటూ పలువురు పవన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘మనల్ని ఎవడ్రా ఆపేది? సర్దార్ అన్నకు అడ్డెవరన్నా’ అంటూ సాగే పాటలు, సినిమా డైలాగులు ట్రెండింగ్ అయ్యాయి. అరాచక శక్తులు, ప్రభుత్వంపై పదేళ్లుగా చేసిన పోరాటం, బాధ, వ్యక్తిగత విమర్శలు, తారాస్థాయికి చేరిన దూషణలన్నింటికీ గూబగుయ్యిమనేలా సమాధానం చెప్పారంటూ పోస్టులు పెట్టారు. ఓ సినిమాలో పవన్కల్యాణ్ ‘మీకు అన్నీ ఉన్నాయి. డబ్బు, పేరు, అధికారం, తొక్కా, తోటకూర.. కానీ లేనిది మాత్రం భయం. అది నేను మీకు త్వరలోనే చూపిస్తా..’ అంటూ చెప్పిన డైలాగ్ను పోస్టు చేస్తూ ఈ ఫలితాలతో జగన్కు దిమ్మదిరిగేలా భయం చూపించారంటూ ఎద్దేవా చేశారు.
తట్టా బుట్టా సర్దుకుని ‘సిద్ధం’
ఘోర పరాజయం తర్వాత వైకాపా నేతలు తట్టాబుట్టా సర్దుకుని కొంతమంది విదేశాలు, చాలా మంది కారాగారానికి వెళ్లడానికి సిద్ధం కావాలంటూ పోస్టులు పెట్టారు. ‘ఇన్ని రోజులూ కామెడీ చేస్తూ మమ్మల్ని సంతోషపరిచిన ‘కోడిగుడ్డు మంత్రి’, ‘ట్విన్ సిటీస్ ఎంపీ’, ‘సంబరాల రాంబాబు’లాంటి వైకాపా నేతలకు కృతజ్ఞతలు.. ఇక సెలవు’ అంటూ వ్యంగ్యంగా స్పందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటనపై అభూతకల్పన కల్పిస్తున్నారని మాజీ సీఎం, వైకాపా అధినేత జగన్ అన్నారు. -
వైకాపా హయాంలో రూ.9.74 లక్షల కోట్ల అప్పులు చేశారు: ఏపీ సీఎం చంద్రబాబు
2014-19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ను నిలిపామని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
తెలంగాణలో కరవు అనే మాట వినపడకూడదని కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
సమస్యలపై ప్రశ్నిస్తే.. వేధింపులే సమాధానం
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం విడుదల చేసిన ‘శాంతిభద్రతల శ్వేతపత్రం’పై కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వేదికగా మాట్లాడారు. -
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే జగన్ దిల్లీ యాత్ర
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే వైకాపా అధ్యక్షుడు జగన్ దిల్లీ వెళ్లినట్లుగా ఉందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. దిల్లీ నుంచి అమరావతి చేరుకున్న జగన్... శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని సూచించారు. -
ఇది పసలేని దండగమారి బడ్జెట్: కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం పసలేని, దండగమారి బడ్జెట్ ప్రవేశపెట్టిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా ఆంక్షల పద్దు పెట్టారని అన్నారు. -
సంక్షిప్త వార్తలు (4)
బడ్జెట్లో అధిక కేటాయింపుల ద్వారా.. తమది రైతు ప్రభుత్వమని మరోసారి నిరూపించుకున్నట్లయిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. -
ఫైళ్ల దహనంతో మాకు సంబంధం లేదు: వైకాపా ఎంపీ మిథున్రెడ్డి
మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ దస్త్రాల దహనం ఘటనతో తమకెలాంటి సంబంధం లేదని వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పేర్కొన్నారు. -
గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతాం: మంత్రి నిమ్మల
సంజీవయ్య గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతామని జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. -
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే జగన్ దిల్లీ నిరసన: హోంమంత్రి అనిత
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే మాజీ సీఎం జగన్ దిల్లీలో నిరసన పేరుతో చౌకబారు ఆరోపణలు చేశారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. 36 రాజకీయ హత్యలు జరిగాయని నిస్సిగ్గుగా మాట్లాడారని ధ్వజమెత్తారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
-
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం
-
రివ్యూ: ‘రాయన్’.. ధనుష్ 50వ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా?
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
-
యశ్ ‘టాక్సిక్’లో బాలీవుడ్ భామ.. ఆ విషయం తాను చెప్పలేదంటూ పోస్ట్