Uddhav Thackeray: మణిపుర్ ఫైల్స్ vs కిచిడీ ఫైల్స్.. ‘మహా’ రాజకీయాల్లో మాటల యుద్ధం!
భాజపాను ‘భ్రష్ట్ (అవినీతి) జనతా పార్టీ’గా పేర్కొన్న ఉద్ధవ్ ఠాక్రే.. రాజకీయ ప్రయోజనాల కోసం ఆ పార్టీ కళంకితులను స్వాగతిస్తోందని ఆరోపించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఎన్నికల బాండ్ల వివరాలతో భాజపా (BJP) అసలు స్వరూపం బయటపడిందని శివసేన (యూబీటీ) అధ్యక్షుడు, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) ఆరోపించారు. భాజపాను ‘భ్రష్ట్ (అవినీతి) జనతా పార్టీ’గా పేర్కొంటూ.. రాజకీయ ప్రయోజనాల కోసం అజిత్ పవార్, అశోక్ చవాన్, నవీన్ జిందాల్ వంటి కళంకితులను స్వాగతిస్తోందని విమర్శించారు. ‘ఇండియా’ కూటమి సభలో పాల్గొనేందుకు దిల్లీ వచ్చిన ఠాక్రే ఈ మేరకు మాట్లాడారు. మరోవైపు ఆయన వ్యాఖ్యలను తిప్పికొట్టిన కమలదళం.. ఉద్ధవ్ పాలనలోని అవినీతిని వెలికి తీసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.
‘‘వాజ్పేయీ హయాం నాటి భాజపా భిన్నంగా ఉండేది. అది సిద్ధాంతాలపై పనిచేసేది. ఇప్పుడు అవినీతిపరుల వెంట ఉంది. ఎన్నికల బాండ్ల వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేశారు’’ అని ఉద్ధవ్ ఆరోపించారు. వీడీ సావర్కర్పై ఇటీవల విడుదలైన సినిమా చూసేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి థియేటర్ బుక్ చేస్తానని దేవేంద్ర ఫడణవీస్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఆయన మణిపుర్కు వెళ్లాలని డిమాండ్ చేశారు. ‘మణిపుర్ ఫైల్స్’ అనే సినిమా తీసేందుకు బాలీవుడ్ నిర్మాతను సంప్రదించాలని ఎద్దేవా చేశారు.
మ్యాచ్ ఫిక్సింగ్ లేకుండా భాజపా 400 దాటడం అసాధ్యం: రాహుల్ గాంధీ
ఒకవేళ ఠాక్రే ప్రభుత్వపు అవినీతిపై ఫడణవీస్ సినిమాలు తీస్తే.. వాటికి కిచిడీ ఫైల్స్, కొవిడ్ బాడీబ్యాగ్ ఫైల్స్గా పేర్లు పెట్టాల్సి ఉంటుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బావన్కులే పేర్కొన్నారు. ‘రూ.100 కోట్ల రికవరీ ఫైల్స్’ సినిమాకు స్ర్కిప్ట్ సిద్ధంగా ఉందని చెప్పారు. కరోనా సమయంలో ప్రజలకు కిచిడీ పంపిణీ, కొవిడ్ మృతుల బాడీ బ్యాగ్ల కొనుగోలులో అక్రమాలు, కాంట్రాక్టుల్లో కమీషన్ వంటి అక్రమాల్లో శివసేన (యూబీటీ) హస్తం ఉందని ఆరోపించారు. రెండున్నరేళ్లు ఇంటినుంచే పాలించిన ఉద్ధవ్.. ఎన్ని వ్యంగ్య వ్యాఖ్యానాలు చేసినా రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో ఆయనకు సరైన జవాబు ఇస్తారన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజ్వల్ రేవణ్న బాధితులకు అండగా నిలుద్దాం
జనతాదళ్(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్న లైంగిక వేధింపులకు గురైన బాధితులందరికీ సాయం అందించాలని, వారికి న్యాయం జరిగే వరకూ అండగా నిలవాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించారు. -
కులగణనకు కట్టుబడి ఉన్నాం: సీఎం
కులగణనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, బీసీలకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. -
రిజర్వేషన్లు ఎత్తేస్తామంటున్న భాజపాను ఓడించడమే ఎజెండా
రాజ్యాంగాన్ని రద్దు చేసి, రిజర్వేషన్లు ఎత్తేయాలని కుట్రలు పన్నుతున్న భాజపాను లోక్సభ ఎన్నికల్లో ఓడించడమే ఎజెండాగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఏఐసీసీ ఎస్సీ విభాగం ఛైర్మన్ రాజేష్ లిలోతియా పిలుపునిచ్చారు. -
భారాసకు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ రాజీనామా
భారాసకు రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ ప్రకటించారు. శనివారం దిల్లీలోని తెలంగాణ భవన్లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మరో నలుగురి నామినేషన్
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మూడో రోజు శనివారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
రోహిత్ మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి: కూనంనేని
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదంటూ నివేదిక ఇవ్వడం విస్మయం కలిగించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. -
‘సెక్యులర్’ పదం తొలగింపు వ్యాఖ్యలపై మోదీ, అమిత్షా సమాధానం చెప్పాలి: జి.నిరంజన్
భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగంలోని ‘సెక్యులర్’ పదాన్ని తొలగిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్కుమార్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాలు సమాధానం చెప్పాలని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
12 గంటలపాటు కాల్పులు.. హమాస్ ‘వెస్ట్బ్యాంక్’ కమాండర్ హతం!
-
చెన్నైకి మరో షాక్.. గాయం కారణంగా స్వదేశానికి పతిరన
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారిన ట్రెండ్.. ఎన్నికల వేళా ఐపీఓల సందడి!
-
రోజా కామెంట్స్పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?
-
వందల మంది ‘రేవణ్ణ’ బాధితులకు.. ప్రభుత్వం ఆర్థిక సహాయం!