Rajnath Singh: తెలంగాణ ఎందుకు అభివృద్ధి చెందలేదో కేసీఆర్ జవాబు చెప్పాలి: రాజ్నాథ్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జమ్మికుంటలో నిర్వహించిన భాజపా జన గర్జన బహిరంగ సభలో కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. అధికార భారాసపై విమర్శలు గుప్పించారు.
జమ్మికుంట: రాణి రుద్రమదేవి, కుమురంభీమ్ లాంటి ఎంతో మంది వీరులను కన్న పుణ్యభూమి తెలంగాణ అని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ కొనియాడారు. 1984లో భాజపా రెండు లోక్సభ స్థానాల్లో గెలిస్తే.. తెలంగాణ భాజపా నుంచి జంగారెడ్డి ఎన్నికయ్యారని గుర్తుచేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జమ్మికుంటలో నిర్వహించిన భాజపా జనగర్జన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
‘‘27 ఏళ్లుగా గుజరాత్లో భాజపా అధికారంలో ఉంది. అభివృద్ధికి రోల్ మోడల్గా గుజరాత్ నిలిచింది. మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి పథంలో పయనిస్తోంది. పదేళ్లుగా తెలంగాణ ఎందుకు అభివృద్ధి చెందలేదో కేసీఆర్ సమాధానం చెప్పాలి. స్వరాష్ట్ర సాధన కోసం కేవలం కేసీఆర్ ఒక్కరే పోరాటం చేయలేదు. రాష్ట్ర సాధన కోసం భాజపా కూడా పోరాటం చేసింది. కేసీఆర్ పాలనలో అవినీతి పెరిగింది. ఆయనకు కుటుంబమే తొలి ప్రాధాన్యత. కేసీఆర్ కుటుంబం.. ఆయన పరివారం మాత్రమే రాష్ట్రంలో బాగుపడ్డారు. తెలంగాణ నెంబర్ 1గా ఉండాలని ప్రజలంతా కోరుకుంటున్నారు.’’ అని రాజ్నాథ్ తెలిపారు.
భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను ఈ సందర్భంగా రాజ్నాథ్ అభినందించారు. హుజురాబాద్ ఉపఎన్నికలో కేసీఆర్ స్వయంగా ప్రచారం చేపట్టినా.. విచ్చలవిడిగా డబ్బు ఖర్చుపెట్టినా ఉపఎన్నికలో రాజేందర్ను ఓడించలేకపోయారని అన్నారు. ‘‘ యువతకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారని ప్రశ్నిస్తున్నా. యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్న కేసీఆర్ హామీ ఏమైంది? పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేని కేసీఆర్ ప్రభుత్వం యువతకు సమాధానం చెప్పాలి. కేవలం భారాస అనుచరగణానికే దళిత బంధు అందింది. రామజన్మభూమి కోసం భాజపా ఉద్యమించింది. జనవరి 26న అయోధ్యలో భవ్య రామమందిర కల సాకారం చేయబోతున్నాం. 370 అధికరణాన్ని తొలగించి జమ్ముకశ్మీర్లో స్వేచ్ఛాయుత వాతావరణం తీసుకొచ్చాం. భాజపా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి తీరుతుంది’’ అని రాజ్నాథ్ స్పష్టం చేశారు.
ప్రజల గుండెల్లో స్థానం ఉన్న వ్యక్తిని ఎవరైనా ఓడించగలరా?: ఈటల
ప్రస్తుతం ఏ పథకం కావాలన్నా భారాసలోకి రమ్మంటున్నారని ఈటల రాజేందర్ విమర్శించారు. ‘‘ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని నన్ను కమలాపురం ఓటర్లు 25 వేల ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేశా. మంత్రిగా ఉన్నప్పుడు హుజూరాబాద్లో అనేక పనులు చేశా. హాస్టల్లో విద్యార్థుల కష్టాలు నాకు తెలుసు. నేను మంత్రిని అయ్యాక హాస్టళ్లకు సన్నబియ్యం ఇచ్చా. వైద్యశాఖ మంత్రిని అయ్యాక ఆస్పత్రుల్లో వసతులు పెంచా. హైదరాబాద్లో మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తే కేసీఆర్కు నచ్చలేదు. సమ్మె చేసిన 1,700 మందిని ఉద్యోగాల నుంచి కేసీఆర్ తొలగించారు. ఉద్యమాల గడ్డగా పేరున్న ఇందిరా పార్కులో ధర్నాలు నిషేధించారు. వీఆర్ఏలకు నేను మద్దతివ్వడం కేసీఆర్కు నచ్చలేదు. హుజూరాబాద్లో నన్ను ఓడించేందుకు కేసీఆర్ అనేక కుట్రలు చేశారు. ప్రజల గుండెల్లో స్థానం ఉన్న వ్యక్తిని ఎవరైనా ఓడించగలరా? 2021లో హుజూరాబాద్ ప్రజలు గెలిచారు. భారాస వందల కోట్లు ఖర్చు పెట్టినా నేనే గెలిచా. ఈసారి భాజపాను ప్రజలు ఆశీర్వదించాలి’’ అని ఈటల కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. -
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం మరోమారు బయటపడిందని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. -
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు సహా ఆ పార్టీ సానుభూతిపరులపై ఎక్కడా ఉద్దేశపూర్వకంగా దాడులు జరగట్లేదని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. -
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
జులై 27న దిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశానికి దూరంగా ఉంటామంటూ విపక్షాల కూటమి (INDIA)కి చెందిన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పేర్కొంటున్నారు. -
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్లో చేర్చి చట్ట ప్రకారం శిక్షిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. -
కేసీఆర్, కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
కమీషన్లకు కక్కుర్తిపడి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మండిపడ్డారు. -
స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు సమంజసం కాదు: కోదండరాం
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై తెలంగాణ జన సమితి(తెజస) అధ్యక్షుడు ఆచార్య కోదండరాం మండిపడ్డారు. -
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటనపై అభూతకల్పన కల్పిస్తున్నారని మాజీ సీఎం, వైకాపా అధినేత జగన్ అన్నారు. -
వైకాపా హయాంలో రూ.9.74 లక్షల కోట్ల అప్పులు చేశారు: ఏపీ సీఎం చంద్రబాబు
2014-19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ను నిలిపామని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
తెలంగాణలో కరవు అనే మాట వినపడకూడదని కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అంగరంగ వైభవంగా ప్రారంభమైన పారిస్ ఒలింపిక్స్ వేడుకలు
-
ఐడెంటిటీ మార్చుకోవాల్సి వస్తే: విజయ్ ఆంటోనీ సమాధానమేంటంటే?
-
టూరిస్టులు.. చెత్త సంచి వెంటతెచ్చుకోవాలి!
-
డేటింగ్ యాప్లతో విశాఖలో విజృంభిస్తున్న సైబర్ నేరగాళ్లు
-
వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్లకు ప్రత్యేక రీఛార్జి?
-
తెలంగాణ అసెంబ్లీలో శనివారం ప్రశ్నోత్తరాలు రద్దు.. నేరుగా బడ్జెట్ పద్దు పైనే చర్చ