Varla ramaiah: పిన్నెల్లికి సలాం కొట్టిన పోలీసులే.. బాదటానికి రెడీ..: వర్ల రామయ్య

పోలింగ్‌ సరళి చూశాక ఓడిపోతున్నట్లు వైకాపా నేతలకు అర్థమైపోయిందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. 

Updated : 25 May 2024 18:40 IST

అమరావతి: పోలింగ్‌ సరళి చూశాక ఓడిపోతున్నట్లు వైకాపా నేతలకు అర్థమైపోయిందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. అందుకే వెబ్‌కాస్టింగ్‌ బటన్‌ చంద్రబాబు చేతిలో ఉందని సాక్షిలో తప్పుడు ప్రచారం మొదలుపెట్టారని విమర్శించారు. ఇప్పటికే వైకాపా నేతలు చాలా మంది అజ్ఞాతంలోకి వెళ్లారని ఆరోపించారు. పోలింగ్‌ బూత్‌లో పిన్నెల్లి చేసిన విధ్వంసం గురించి ఫోన్‌ ఉన్న ప్రతి ఒక్కరికీ తెలిసిందన్నారు. తెదేపాకు మెజారిటీ వస్తోందని గ్రహించే ఏజెంట్లపై దాడి చేశారని విమర్శించారు. ఆ సమయంలో పట్టుకోవాల్సిన పోలీసులు.. దగ్గరుండి ఎమ్మెల్యేను కారెక్కించి పంపించారని తెలిపారు.

సజ్జలకు ఈ విషయంపై మాట్లాడే ధైర్యం లేకపోయినా.. ఇంకా 144 స్థానాల్లో గెలుస్తామని ఎలా అంటున్నారని ప్రశ్నించారు. కౌంటింగ్‌ కేంద్రాల్లో ఏజెంట్లుగా కూర్చుకునేందుకు కూడా వైకాపా నేతలు సిద్ధంగా లేరని చెప్పారు. ‘‘ఏ పోలీసులైతే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సలాం కొట్టారో ఆ పోలీసులే పిన్నెల్లిని బాదటానికి సిద్ధంగా ఉన్నారు. అన్నదమ్ములిద్దరూ పరార్‌ కాగానే మాచర్ల ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారు. బొత్స ఏం చెబుతాడో ప్రజలకు అర్థం కాదు.. ఓడి పోతామన్న వాస్తవం ఆయన గ్రహించడం లేదు’’ అని వర్ల పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని