Uttam Kumar: భారాస మేడిగడ్డ పర్యటనకు కేసీఆర్ సైతం వెళ్లాలి: మంత్రి ఉత్తమ్
భారాస నేతల మేడిగడ్డ బ్యారేజీ పర్యటనను స్వాగతిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి తెలిపారు.
హైదరాబాద్: భారాస నేతల మేడిగడ్డ బ్యారేజీ పర్యటనను స్వాగతిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి తెలిపారు. ఇంత భారీగా అవినీతి చేసి కూడా మేడిగడ్డకు వెళ్తామంటున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ జలసౌధలో ఆయన మాట్లాడారు. ‘‘భారాస నేతల మేడిగడ్డ పర్యటనకు సహకరించాలని అధికారులను ఆదేశించాం. వారి తీరు ‘ఉల్టా చోర్..’ సామెతను గుర్తు చేస్తోంది. భారాస మేడిగడ్డ పర్యటనకు కేసీఆర్ సైతం వెళ్లాలి. కుంగిన ఆనకట్ట సాక్షిగా రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు కట్టవద్దని నిపుణుల కమిటీ సూచించింది. కాళేశ్వరం రూపంలో రాష్ట్రంపై మోయలేని భారం మోపారు. స్వతంత్ర భారతంలో ఇంత భారీ అవినీతి గతంలో ఎన్నడూ జరగలేదు. ప్రాజెక్టుల విషయంలో భారాస సర్కారు అవినీతిని కాగ్ ఎండగట్టింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా వివరించింది’’ అని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు
భారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నికైనట్లు 2021 డిసెంబరు 14న జారీ చేసిన ప్రకటన, 15న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ చెల్లవని పేర్కొంది. -
జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదు.. కొనుక్కున్నాం
పల్నాడు జిల్లా ముప్పాళ్ల జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదని.. ఎంతో ఖర్చుపెట్టి కొనుక్కుంటే ఆ పదవి వచ్చిందని దమ్మాలపాడు గ్రామానికి చెందిన శిరిగిరి గోపాలరావు శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు చర్చనీయాంశమైంది. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు నలుగురి నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు శుక్రవారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
ప్రభుత్వ అలసత్వం వల్లే వృద్ధులకు పింఛను కష్టాలు
నడవలేని స్థితిలో ఉన్న వారికి ఇంటి వద్దే పింఛన్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు బ్యాంకుల్లో జమ చేసి, వారిని ఇబ్బందులకు గురి చేయడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
భాజపా నేతను చెప్పుతో కొట్టిన డిప్యూటీ సీఎం.. అనకాపల్లిలో వైకాపా అరాచకం
-
సందేశ్ఖాలీ ఘటనలు.. భాజపా ముందస్తు కుట్రే: మమతా బెనర్జీ
-
జై షాకు బ్యాట్ పట్టుకోవడం తెలుసా..?: ఆప్ విమర్శలు
-
నేను చేసిన కర్మల ఫలితమే: స్పామ్ కాల్స్పై జిరోదా సీఈవో పోస్ట్
-
మహీభాయ్ ఇంకా ఆడాలి... క్రికెట్లో నాకు తండ్రిలాంటివారు: పతిరన
-
రఫాపై దండయాత్ర జరిగితే..రక్తపాతమే: WHO ఆందోళన