Arvind Kejriwal: వాట్నెక్స్ట్.. ఎన్నికల్లో ఆప్ను నడిపేదెవరు..?
2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు సంచలనం సృష్టించింది. ఆయన జైలు గోడల మధ్య నుంచే పాలన కొనసాగిస్తారని పార్టీ చెబుతోంది. కానీ, ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్తో సరితూగే నేత ఎవరనే విషయం ఆసక్తికరంగా మారింది.
ఇంటర్నెట్డెస్క్: సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడిన వేళ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)ను మద్యం కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఓ పక్క రాజకీయ పార్టీలు మొత్తం 2024 ఎన్నికల వ్యూహాలు, అభ్యర్థుల ఖరారులో తలమునకలైన సమయంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ప్రభావం చూపించే పలు రాష్ట్రాల్లో అభ్యర్థుల ఎంపిక నుంచి పార్టీ ప్రచారం వరకూ పలు సవాళ్లు ఎదురుకానున్నాయి.
డిసెంబర్లోనే ప్రజాభిప్రాయ సేకరణ..
ప్రస్తుతం జైల్లో ఉన్నా కేజ్రీవాలే ముఖ్యమంత్రి బాధ్యతలను కొనసాగిస్తారని ఆప్ ఇప్పటికే ప్రకటించింది. ఆ పార్టీ నేత, మంత్రి ఆతిశీ మార్లీనా సీఎం నివాసం వద్ద ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ వ్యూహానికి ఆప్ ఎప్పుడో పదునుపెట్టింది. గతేడాది డిసెంబర్లోనే కేజ్రీవాల్ అరెస్టుపై ప్రచారం జరగ్గా.. ఆయన రాజీనామా చేయాలా..? లేదా జైలు నుంచే పాలన కొనసాగించాలా..? అనే అంశంపై ‘మై బీ కేజ్రీవాల్’ పేరిట ఆప్ పలు ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేసింది. దీనిలో సీఎం పదవి నుంచి ఆయన దిగాల్సిన అవసరం లేదని అత్యధిక మంది కోరుకున్నట్లు నాడు పార్టీ వెల్లడించింది.
న్యాయ నిపుణులు ఏమంటున్నారు..?
కేజ్రీవాల్ వద్ద ప్రస్తుతానికి ఎలాంటి కీలక శాఖలు లేకపోవడంతో పాలనకు ఇబ్బంది లేకపోయినా.. సీనియర్ మంత్రులు, అధికారులతో రోజువారీ సమావేశాలు, సమీక్షలు చేయడంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు. సీఎం అరెస్టైతే రాజీనామా చేయాలని, పాలన పగ్గాలను వేరేవారికి ఇవ్వాలని చట్టంలో ఎక్కడా లేదని న్యాయ నిపుణుడు ఎస్కే శర్మ ఓ ఆంగ్లపత్రికకు వెల్లడించారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన వ్యక్తి దోషిగా తేలే వరకూ పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. అయితే, జైలు గది నుంచి సమీక్షలు, మంత్రి వర్గ సమావేశాల నిర్వహణ వాస్తవిక పరిస్థితుల్లో సాధ్యం కాదని.. సంక్షోభ పరిస్థితులు కూడా ఏర్పడవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో కేంద్రం జోక్యం చేసుకొని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం కూడా ఉందన్నారు. దీంతో దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ పాత్ర చాలా కీలకం కానుంది. గతంలో బిహార్ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకు వెళ్లగా.. పగ్గాలను తన భార్య రబ్రీదేవికి ఇచ్చారు. ఇటీవల ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ బాధ్యతల నుంచి వైదొలగారు. కేజ్రీవాల్ పదవిలో కొనసాగితే.. జైలు నుంచి పాలన సాగించిన తొలి సీఎంగా రికార్డు సృష్టించనున్నారు.
సీఎం రేసులో ఎవరు..?
ఇక సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయాల్సి వస్తే.. ఆ స్థానం భర్తీ చేసేందుకు పార్టీ నుంచి విద్యా శాఖ మంత్రి ఆతిశీ, వైద్య శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ పేర్లు తెరపైకి రావచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఉన్నత విద్యావంతురాలైన ఆతిశీ ఇప్పటికే అత్యధిక శాఖలను నిర్వహిస్తున్నారు. ఆమె కేజ్రీవాల్కు అత్యంత విశ్వాసపాత్రురాలు. పైగా పార్టీ ప్రతినిధిగా ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టడంలో మంచి నైపుణ్యం ఉంది. ఇక భరద్వాజ్ కూడా పలు శాఖలను నిర్వహిస్తూ ప్రభుత్వాన్ని, పార్టీని ముందుకు తీసుకెళుతున్నారన్న పేరుంది.
కేజ్రీవాల్ సతీమణి సునీత పేరు కూడా రేసులో నిలిచే అవకాశం ఉంది. ఆమె రెవెన్యూ సర్వీస్ మాజీ అధికారిణి. తరచూ పార్టీ సమావేశాల్లో పాల్గొంటూ పరిస్థితులను తెలుసుకుంటున్నారు.
ఎన్నికల ప్రచారంపై ప్రభావం..
అన్నింటికి మించి ఆప్ రాజకీయ బాధ్యతలే ఇప్పుడు కత్తిమీద సాముగా మారనున్నాయి. ఇతర రాష్ట్రాల్లో పార్టీని విస్తరించే క్రమంలో ప్రజాకర్షక నేతగా కేజ్రీవాల్ వ్యవహరిస్తున్నారనడంలో సందేహం లేదు. ఇప్పటికే ఆయన సన్నిహితులు మనీష్ సిసోదియా, సత్యేందర్ జైన్, ఎంపీ సంజయ్ సింగ్ కూడా జైళ్లలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ అరెస్టుతో ఆప్ రోజువారీ కార్యకలాపాల నిర్వహణలో కొన్ని సమస్యలు రావచ్చు. దిల్లీ, పంజాబ్, గుజరాత్, హరియాణాలు పార్టీకి చాలా కీలకం. ఇక్కడ ఎన్నికల ప్రచారం ఎలా నిర్వహిస్తారనేదానిపై చర్చ జరుగుతోంది. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ దేశవ్యాప్త ప్రచార బాధ్యతలను భుజాన వేసుకోవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. -
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం మరోమారు బయటపడిందని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. -
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు సహా ఆ పార్టీ సానుభూతిపరులపై ఎక్కడా ఉద్దేశపూర్వకంగా దాడులు జరగట్లేదని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. -
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
జులై 27న దిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశానికి దూరంగా ఉంటామంటూ విపక్షాల కూటమి (INDIA)కి చెందిన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పేర్కొంటున్నారు. -
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్లో చేర్చి చట్ట ప్రకారం శిక్షిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. -
కేసీఆర్, కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
కమీషన్లకు కక్కుర్తిపడి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మండిపడ్డారు. -
స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు సమంజసం కాదు: కోదండరాం
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై తెలంగాణ జన సమితి(తెజస) అధ్యక్షుడు ఆచార్య కోదండరాం మండిపడ్డారు. -
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటనపై అభూతకల్పన కల్పిస్తున్నారని మాజీ సీఎం, వైకాపా అధినేత జగన్ అన్నారు. -
వైకాపా హయాంలో రూ.9.74 లక్షల కోట్ల అప్పులు చేశారు: ఏపీ సీఎం చంద్రబాబు
2014-19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ను నిలిపామని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
తెలంగాణలో కరవు అనే మాట వినపడకూడదని కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు