Hema Malini: మథుర కాకపోతే పోటీ చేసేదాన్ని కాదు : హేమమాలిని
మథురలో ప్రజలు నరేంద్రమోదీ ప్రభుత్వానికే పట్టం కడతారని నటి, భాజపా ఎంపీ అభ్యర్థి హేమమాలిని ఆశాభావం వ్యక్తం చేశారు.
బృందావన్: మథురలో ప్రజలు నరేంద్రమోదీ ప్రభుత్వానికే పట్టం కడతారని నటి, భాజపా ఎంపీ అభ్యర్థి హేమమాలిని(Hema Malini) ఆశాభావం వ్యక్తం చేశారు. వరుసగా మూడోసారి భాజపా తరపున మథురలో పోటీ చేస్తున్న ఆమె తన ప్రచారాన్ని మొదలుపెట్టారు.
అసంపూర్తిగా ఉన్న బృందావన మందిరాన్ని పూర్తి చేయడమే తన ధ్యేయమన్నారు. వందల ఏళ్లుగా దేశ ప్రజలు అయోధ్యలో రామమందిరం కోసం కన్న కలలను ప్రధాని మోదీ నిజం చేశారని ఆనందం వ్యక్తంచేశారు. కృష్ణ జన్మభూమి వివాదం కోర్టులో ఉంది కాబట్టి నేను దానిపై వ్యాఖ్యానించలేను. కానీ శ్రీకృష్ణుడు కోరుకుంటే కచ్చితంగా అది జరుగుతుంది అని పేర్కొన్నారు. అసంపూర్తిగా ఉన్న బృందావనాన్ని పూర్తి చేయడానికే భాజపాను ఈ నియోజకవర్గంలో టికెట్ అడిగానని అన్నారు.
‘‘నేను అనుభవజ్ఞురాలైన రాజకీయ నాయకురాలిని కాదు. కానీ, ఈ పదవిలో ఉన్నందున నేను కోరుకున్న పనులు చేయగలను. నేను శ్రీకృష్ణుడి భక్తురాలిని. మథుర కాకుండా మరే స్థానం ఇచ్చినా నేను పోటీ చేసేదాన్ని కాదు. రాజకీయాల్లోకి రావాలనీ అనుకోలేదు. అది దైవ నిర్ణయంగా జరిగిపోయింది.’’ అని అన్నారు. ఎంపీగా ఎన్నికైన మొదట్లో ఈ ప్రాంత పరిస్థితులను చూసి తాను ఎంతగానో ఆందోళన చెందానని గుర్తుచేసుకున్న హేమమాలిని తనకు మూడోసారి టికెట్ ఇచ్చినందుకు భాజపాకు కృతజ్ఞతలు తెలిపారు.
‘‘మోదీ దేశానికి చాలా చేశారు కాబట్టి ప్రజలు భాజపాను గెలిపించాలనుకుంటారు. నేను కూడా నా నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో పాటుపడ్డాను. రైతులకు ఏ సమస్య వచ్చినా దానిని సంబంధిత మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాను. కరెంటు, తాగు, సాగునీరు, రోడ్లను బాగు చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాను. ఇక్కడికి అతిపెద్ద ప్రపంచస్థాయి థియేటర్ను తీసుకొచ్చాను. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ కళాకారులు ఇక్కడికి వచ్చి ప్రదర్శనలు ఇవ్వవచ్చు. రైల్వే స్టేషన్ను పునరుద్ధరించాను, ఫ్లైఓవర్లు, రైల్వే కనక్టివిటీ మొదలైన ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టాను. మథురకు విమానాశ్రయం తేవాలనేది నా కల.’’ అని తెలిపారు.
యమునా జలాల కాలుష్యానికి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని దిల్లీ ప్రభుత్వమే కారణమని ఆమె ఆరోపించారు. యమునా నదిని శుభ్రం చేయడం చాలా కష్టమైనప్పటికీ ఈసారి పూర్తి చేస్తానని, మొదటినుంచి దానికోసం ప్రయత్నిస్తున్నానని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
తమ పార్టీ పుట్టుక సంచలనం... దారి పొడవునా రాజీలేని రణం అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు -
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు