Bhuma Akhila Priya: భూమా అఖిలప్రియను అడ్డుకున్న వైకాపా నేతలు.. యర్రగుంట్లలో ఉద్రిక్తత

మాజీ మంత్రి, ఆళ్లగడ్డ తెదేపా అభ్యర్థి భూమా అఖిలప్రియను వైకాపా నేతలు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Updated : 28 Mar 2024 19:03 IST

శిరివెళ్ల: మాజీ మంత్రి, ఆళ్లగడ్డ తెదేపా అభ్యర్థి భూమా అఖిలప్రియను వైకాపా నేతలు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రలో భాగంగా ఆళ్లగడ్డలో సీఎం జగన్‌ పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా ఆళ్లగడ్డలో రైతులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. అన్నదాతల సమస్యలపై సీఎంకు వినతిపత్రం అందించేందుకు భూమా అఖిలప్రియ అక్కడికి బయల్దేరారు. ఈ క్రమంలో ఆమెను యర్రగుంట్ల వద్ద వైకాపా నేతలు, పోలీసులు అడ్డుకున్నారు.  దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. ఈ ఘటనపై అఖిలప్రియ శిరివెళ్ల పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వినతిపత్రం అందించేందుకు వెళ్తే వైకాపా నేతలు దాడి చేశారని అందులో పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని