PM Modi: భాజపాపై మీ ఉత్సాహం వారికి నిద్ర లేకుండా చేస్తోంది: మోదీ
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడులో పర్యటించారు. ఈసందర్భంగా డీఎంకే, కాంగ్రెస్లపై విమర్శలు గుప్పించారు.
తిరునల్వేలి: గత పదేళ్ల పాలనలో తమిళనాడు అభివృద్ధి కోసం తాము రేయింబవళ్లు పని చేశామని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన తిరునల్వేలిలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సభకు విచ్చేసిన జనాన్ని ఉద్దేశిస్తూ.. ‘భాజపాపై మీ ఉత్సాహం డీఎంకే, విపక్ష ‘ఇండియా’ కూటమికి నిద్ర లేకుండా చేస్తున్నాయి’ అని మోదీ వ్యాఖ్యానించారు.
తన కంచుకోటనే కాపాడుకోలేకపోయారు: రాహుల్పై మోదీ ఎద్దేవా
తమిళనాడు కొత్త సంవత్సరం రోజే భాజపా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ప్రయాణాలను సులభతరం చేసేందుకు వీలుగా వందే భారత్ రైలు నడుపుతున్నామన్న ఆయన.. దక్షిణాదికి బుల్లెట్ రైలును నడపనున్నట్లు వెల్లడించారు. తమిళనాడు మహిళలు మోదీని ఆశీర్వదిస్తున్నారని పేర్కొన్నారు. తమిళ సంస్కృతికి డీఎంకే, కాంగ్రెస్ వ్యతిరేకమని విమర్శించారు. సెంగోల్, జల్లికట్టు.. ఇలా తమిళ సంస్కృతిని పెంపొందించే ప్రతీ అంశాన్ని ఆ రెండు పార్టీలూ నిరసించాయని ఆరోపించారు. కుటుంబ పార్టీ అయిన కాంగ్రెస్.. మహానేత కామరాజ్ను అవమానించిందన్నారు. తమిళ భాషను, సంస్కృతిని ప్రేమించేవాళ్లకు తొలి ఛాయిస్ భాజపానే అన్నారు. తమిళ వారసత్వ ప్రదేశాలను ప్రపంచ పర్యాటక ముఖచిత్రంలో నిలుపుతామని ఈసందర్భంగా ప్రధాని హామీ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
హాసన సెక్స్ కుంభకోణం.. ఆ బాధితురాలు భవానీ బంధువే
-
ఆలయం నుంచి బయటకెళ్లు.. దళిత సర్పంచిని అవమానించిన వైకాపా నాయకులు
-
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
-
కోనసీమ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
-
ఇచ్చింది రూ.50 వేలు.. లాగింది రూ.3.5 లక్షలు
-
ఏపీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని ప్రార్థించా: సినీనటి జయప్రద