Kuppam-Chandrababu: వైకాపా ‘కుప్పం’గంతులకు చెక్!
కుప్పం నియోజకవర్గాన్ని కూడా గెలుచుకుంటామంటూ బీరాలు పోయిన వైకాపా ఈ నియోజకవర్గంతోపాటు రాష్ట్రం అంతటా చతికిలపడింది.
ఆ పార్టీ కక్ష సాధింపులకు చంద్రబాబు దీటైన వ్యూహం
శ్రేణులను ఏకం చేసేలా పావులు కదిపిన అధినేత
ఎనిమిదోసారీ ఘన విజయం
కుప్పం, న్యూస్టుడే: కుప్పం నియోజకవర్గాన్ని కూడా గెలుచుకుంటామంటూ బీరాలు పోయిన వైకాపా ఈ నియోజకవర్గంతోపాటు రాష్ట్రం అంతటా చతికిలపడింది. హనుమంతుడి ముందా కుప్పిగంతులు అన్న చందంగా చంద్రబాబు.. వైకాపా అరాచకాలన్నింటినీ ఎదుర్కొంటూ తనదైన తరహాలో పావులు కదిపి విజయఢంకా మోగించారు. అయిదేళ్ల వైకాపా పాలనలో కుప్పం.. ఎన్నో కక్షసాధింపు ధోరణులను చూసింది. వైకాపా ఇన్ఛార్జిగా భరత్ను నియమించి అక్కడ ఆధిపత్యం సాధించేందుకు రకరకాల ఎత్తుగడలు వేసింది. అయినా చివరకు కుప్పం ప్రజలు చంద్రబాబుకే బ్రహ్మరథం పట్టారు.
కేసులకు ఎదురొడ్డి..
గడిచిన అయిదేళ్లలో వైకాపా మూకలు కుప్పంలో చేసిన అరాచకాలు ఇన్నీ, అన్నీ కావు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి, ఎమ్మెల్సీ భరత్లు అక్కడి తెదేపా శ్రేణులను ఎటూ కదలనివ్వలేదు. కుప్పం నియోజకవర్గాన్ని మరో ‘పుంగనూరు’ను చేయాలన్న దురుద్దేశంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్థానిక తెదేపా నాయకులను భయభ్రాంతులకు గురిచేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోను తెదేపా పోటీచేయలేని పరిస్థితికి తీసుకువచ్చారు. చంద్రబాబు అక్కడ సొంతిల్లు నిర్మించుకోకుండా అడ్డుకున్నారు. అధికారం ఉందన్న అండ, ధనబలం, దౌర్జన్యాలతో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన మాదిరిగానే.. సార్వత్రిక సమరంలోనూ ఆధిపత్యం చెలాయించాలన్న కుట్రతో వైకాపా వ్యవహరించింది. అయినా కేసులకు ఎదురొడ్డి నియోజకవర్గంలో తమ పట్టు పెంచేలా చంద్రబాబు దీటైన వ్యూహం రచించి విజయం సాధించారు.
శ్రీకాంత్కు బాధ్యతలు
తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ స్థానం నుంచి తెదేపా తరపున గెలుపొందిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్కు చంద్రబాబు కుప్పం బాధ్యతలు అప్పగించారు. ఏడాది కిందట నియోజకవర్గ సమన్వయ కమిటీ కన్వీనరుగా నియమితులైన శ్రీకాంత్.. పార్టీకి పూర్వవైభవం తీసుకురావడంలో సఫలీకృతులయ్యారు. ఎప్పటికప్పుడు అధినేత ఆదేశాలు పాటిస్తూ నియోజకవర్గంలోని ప్రజలకు చేరువయ్యారు.
అరాచకానికి స్వస్తి...అభివృద్ధికి ఓటు..
వైకాపా అరాచకాలతో విసిగిపోయిన కుప్పం ప్రజలు తగిన సమయం కోసం ఎదురుచూసి వైకాపాకు గుణపాఠం చెప్పారు. చంద్రబాబును 48,006 ఓట్ల ఆధిక్యంతో గెలిపించారు. నాలుగో దఫా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్న చంద్రబాబుతోనే కుప్పం మరింత అభివృద్ధి చెందుతుందని, నియోజకవర్గానికి పూర్వవైభవం వస్తుందని భావించిన జనం ఆయనకు పట్టం పట్టారు. 1995-2004, 2014-2019 మధ్యకాలంలో ప్రగతికాంతులతో వెలుగులీనిన కుప్పం నియోజకవర్గం గడిచిన అయిదేళ్లలో వైకాపా కక్షసాధింపుల్లో చిక్కుకుంది. ఇది ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించింది. ఎనిమిదో దఫా కూడా ఆయనకే పగ్గాలు అప్పగించేందుకు కారణమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు(4)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
29న దిల్లీ జంతర్మంతర్లో మహిళా ధర్నా
మహిళా రిజర్వేషన్ చట్టం పార్లమెంట్లో ఆమోదం పొందినా మోదీ ప్రభుత్వం అమలు చేయనందుకు, ఈ చట్టంలో ఓబీసీ వర్గాల మహిళలను చేర్చనందుకు నిరసనగా ఈ నెల 29న దిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయనున్నట్లు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు తెలిపారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?