YSRCP-TDP: వైకాపా నేత దాష్టీకం.. తెదేపా కార్యకర్తలకు తీవ్ర గాయాలు

సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం వెంకటరమణపల్లిలో స్థల వివాదానికి సంబంధించి.. వైకాపా నాయకుడు, తెదేపా సానుభూతిపరులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

Updated : 11 Aug 2023 12:40 IST

గోరంట్ల: శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం వెంకటరమణంపల్లిలో వైకాపా, తెదేపా కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇళ్ల స్థలాలకు సంబంధించిన అంశంలో వివాదం జరిగి ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో వైకాపా నేత దాష్టీకానికి పాల్పడ్డారు. చౌడు రెడ్డి అనే వైకాపా నేత.. ఇతర ప్రాంతాల నుంచి రెండు కార్లలో కొత్త వ్యక్తులను గ్రామానికి పిలిపించి తెదేపా కార్యకర్తల ఇళ్లపై దాడి చేయించారు. ఇద్దరు మహిళలతోపాటు ఐదుగురిపై సినీఫక్కీలో కర్రలతో దాడి చేశారు. క్షతగాత్రులను గోరంట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్య సేవలకోసం హిందూపురం తరలించారు. పోలీసులు గ్రామానికి చేరుకుని వైకాపా నేత చౌడు రెడ్డితో పాటు దాడులకు వచ్చిన ఇతర ప్రాంతాల వారిని అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని