TDP: తెదేపాలో చేరనున్న వైకాపా కీలక నేతలు

అధికార వైకాపాకు చెందిన పలువురు కీలక నేతలు శనివారం తెలుగుదేశం పార్టీ (TDP)లో చేరనున్నారు.

Published : 01 Mar 2024 18:22 IST

అమరావతి: అధికార వైకాపాకు చెందిన పలువురు కీలక నేతలు శనివారం తెలుగుదేశం పార్టీ (TDP)లో చేరనున్నారు. హైదరాబాద్‌లో తెదేపా అధినేత చంద్రబాబు(Chandrababu) సమక్షంలో మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్‌ పసుపు కండువా కప్పుకోనున్నారు. నెల్లూరులో చంద్రబాబు సమక్షంలో వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు తెదేపాలో చేరనున్నారు. దాచేపల్లిలో జరిగే ‘రా.. కదలిరా’ బహిరంగసభలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సైకిలెక్కనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని