World Cup 2023: ఆ నాలుగు జట్లను దించగలరా? ఏకపక్షంగా మారుతున్న సెమీస్ రేసు
వన్డే ప్రపంచకప్లో వరుసగా కొన్ని సంచలనాలు నమోదవ్వడమే కాక.. కొన్ని మ్యాచ్ల్లో అనూహ్య ఫలితాలు రావడంతో.. సెమీఫైనల్ రేసు రసవత్తరంగా మారుతున్న సంకేతాలు కనిపించాయి. లీగ్ దశలో చివరి వరకు ఉత్కంఠ తప్పదేమో అనిపించింది. కానీ నెమ్మదిగా పరిస్థితి మారిపోతోంది.
వన్డే ప్రపంచకప్లో వరుసగా కొన్ని సంచలనాలు నమోదవ్వడమే కాక.. కొన్ని మ్యాచ్ల్లో అనూహ్య ఫలితాలు రావడంతో.. సెమీఫైనల్ రేసు రసవత్తరంగా మారుతున్న సంకేతాలు కనిపించాయి. లీగ్ దశలో చివరి వరకు ఉత్కంఠ తప్పదేమో అనిపించింది. కానీ నెమ్మదిగా పరిస్థితి మారిపోతోంది. టాప్-4 విషయంలో పెద్దగా ఉత్కంఠ ఏమీ నెలకొనే పరిస్థితి కనిపించడం లేదు. త్వరలోనే సెమీస్ బెర్తులపై ఒక స్పష్టత వచ్చేలా ఉంది. లీగ్ దశలో చివర్లో కొన్ని మ్యాచ్లు నామమాత్రంగా మారి సెమీస్ ముంగిట ప్రపంచకప్ ఊపు తగ్గేలా ఉంది. ప్రస్తుతం టాప్-4లో ఉన్న జట్లను మిగతా జట్లు కిందికి దించితే తప్ప సెమీస్ రేసు రసవత్తరంగా మారకపోవచ్చు.
ప్రపంచకప్లో ఒక పది రోజులు వెనక్కి వెళ్తే.. సెమీస్ చేరే జట్లేవో చెప్పడం చాలా కష్టంగా కనిపించింది. భారత్, న్యూజిలాండ్ నాలుగేసి విజయాలతో ముందంజలో ఉండగా.. మిగతా రెండు బెర్తుల కోసం తీవ్రమైన పోటీ తప్పేలా లేదనిపించింది. నెదర్లాండ్స్, అఫ్గానిస్థాన్ కొన్ని సంచలనాలు నమోదు చేసినా సెమీస్ చేరగలవన్న అంచనా ముందు నుంచి ఎవరికీ లేదు. శ్రీలంక, బంగ్లాదేశ్ కూడా టోర్నీలో ఇబ్బంది పడుతూ కనిపించాయి. కానీ అవి తీసి పడేయదగ్గ జట్లు కాదు కాబట్టి వాటి అవకాశాలను పూర్తిగా కొట్టి పడేయలేని పరిస్థితి. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, ఇంగ్లాండ్ ఈ నాలుగు జట్లూ సెమీస్ రేసులో హోరాహోరీగా తలపడేలా కనిపించాయి. ఇంగ్లాండ్.. అఫ్గానిస్థాన్ చేతిలో షాక్ తిన్నప్పటికీ, బలమైన జట్టు కావడంతో డిఫెండింగ్ ఛాంపియన్ ఏ దశలోనైనా పుంజుకుంటుందనిపించింది. నాలుగు మ్యాచ్ల్లో మూడు నెగ్గినప్పటికీ.. నెదర్లాండ్స్ చేతిలో షాక్ తిన్న దక్షిణాఫ్రికాకు.. నాలుగు మ్యాచ్లు ఆడి రెండేసి విజయాలు సాధించిన పాకిస్థాన్, ఆస్ట్రేలియాలకు పెద్దగా తేడా కనిపించలేదు. ఈ జట్లలో వేటికి సెమీస్ బెర్తులు సొంతమవుతాయో అన్న ఉత్కంఠ నెలకొంది. టాప్-2లో ఉన్న భారత్, న్యూజిలాండ్ల పరిస్థితి కూడా తిరగబడితే పరిస్థితేంటి అన్న చర్చ జరిగింది. కానీ గత పది రోజుల్లో కథ మారిపోయింది.
రెండు ఫిక్స్.. రెండు ఔట్
ఇంకా అధికారిక ప్రకటన రాలేదన్న మాటే కానీ.. ఆరుకు ఆరు విజయాలు సాధించిన భారత జట్టు సెమీస్లో అడుగు పెట్టినట్లే. టోర్నీలో ప్రస్తుతం ఆరు విజయాలు సాధించే అవకాశం అయిదు జట్లకే ఉంది. టాప్-4లో ఉన్న మిగతా జట్లు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కాకుండా శ్రీలంకకు ఆ ఛాన్సుంది. ఐతే 5 మ్యాచ్లు ఆడి రెండే నెగ్గిన లంక.. మిగతా నాలుగు మ్యాచ్ల్లోనూ గెలిచి ఆరు విజయాలు నమోదు చేయడం చాలా కష్టం. కాబట్టి భారత్ సెమీస్ చేరడం లాంఛనమే. ఇక 6 మ్యాచ్ల్లో 5 విజయాలు సాధించిన దక్షిణాఫ్రికా సైతం దాదాపుగా ముందంజ వేసినట్లే. ఆ జట్టు నెట్ రన్రేట్ చాలా బాగుంది. మిగతా మ్యాచ్ల్లో ఓడినా ముందంజ వేయడానికి ఛాన్సుంది. మూడు మ్యాచ్ల్లో ఒక్కటి నెగ్గినా దానికి బెర్తు ఖరారవుతుంది. ఇక ఆరేసి మ్యాచ్లు ఆడి అయిదు చొప్పున పరాజయాలు చవిచూసిన బంగ్లాదేశ్, ఇంగ్లాండ్ సాంకేతికంగా మాత్రమే సెమీస్ రేసులో ఉన్నట్లు లెక్క. అవి టోర్నీ నుంచి నిష్క్రమించినట్లే. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్లను ఓడించి నెదర్లాండ్స్.. ఇంగ్లాండ్, పాకిస్థాన్లపై నెగ్గి అఫ్గానిస్థాన్ రెండేసి సంచలనం రేపాయి కానీ.. మిగతా మ్యాచ్ల్లో చిత్తయ్యాయి. ఇక ఆడాల్సిన మ్యాచ్లన్నీ గెలిచి ముందంజ వేయడం అంటే అసాధ్యమే కాబట్టి వాటినీ లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు.
భారత్, దక్షిణాఫ్రికా రెండు బెర్తులను ఖాయం చేసుకున్నాయనుకుంటే.. మిగతా రెండు బెర్తులు ఆస్ట్రేలియా (6 మ్యాచ్ల్లో 4 విజయాలు), న్యూజిలాండ్ (6 మ్యాచ్ల్లో 4 విజయాలు) జట్లకు దక్కే అవకాశాలే ఎక్కువ. తొలి రెండు మ్యాచ్ల్లో ఓడాక ఆస్ట్రేలియా జూలు విదిల్చింది. వరుసగా భారీ విజాయలతో సెమీస్కు ఫేవరెట్గా మారింది. ఆ జట్టున్న ఊపులో సెమీస్ బెర్తును వదిలే అవకాశమే కనిపించడం లేదు. నాలుగు వరుస విజయాల తర్వాత భారత్, ఆస్ట్రేలియాల చేతుల్లో ఓడినప్పటికీ కడదాకా గట్టి పోటీనిచ్చింది కివీస్. కాబట్టి ఆ జట్టు కూడా సెమీస్ చేరే అవకాశాలే ఎక్కువ. ఇక భారత్ చేతిలో ఓడినప్పటి నుంచి కోలుకోలేకపోతున్న పాకిస్థాన్.. వరుసగా నాలుగో పరాజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఇక ఆ జట్టు కోలుకునేలా కనిపించడం లేదు. శ్రీలంక మూడు వరుస ఓటముల తర్వాత రెండు విజయాలు సాధించింది కానీ ఆ జట్టు పరిస్థితి కూడా ఏమంత మెరుగ్గా లేదు. ఈ రెండు జట్లు.. ఆస్ట్రేలియా, న్యూజలాండ్లను వెనక్కి నెట్టి సెమీస్ చేరడం చాలా కష్టంగానే కనిపిస్తోంది. మరి మున్ముందు సంచలన ఫలితాలు వచ్చి సెమీస్ లెక్కలు తారుమారు అవుతాయేమో చూడాలి.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు