T20 League 2022: ఒకే ఇన్నింగ్స్లో పాంచ్ పటాకా.. ఈ బౌలర్లు అదరగొట్టేశారు!
టీ20 క్రికెట్ అనగానే మనకు మొదట గుర్తొచ్చేది బ్యాటర్ల విధ్వంసం. మైదానం నలువైపులా ఫోర్లు, సిక్సర్లు బాదుతూ బౌలర్లకు చుక్కలు చూపిస్తుంటారు బ్యాట్స్మెన్. కానీ, కొన్ని సార్లు సీన్ రివర్స్ అవుతుంది. బౌలర్లే బ్యాటర్లపై అధిపత్యం చెలాయించి టపాటపా వికెట్లు పడగొడతారు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 క్రికెట్ అనగానే మనకు మొదట గుర్తొచ్చేది బ్యాటర్ల విధ్వంసం. మైదానం నలువైపులా ఫోర్లు, సిక్సర్లు బాదుతూ బౌలర్లకు చుక్కలు చూపిస్తుంటారు బ్యాట్స్మెన్. కానీ, కొన్ని సార్లు సీన్ రివర్స్ అవుతుంది. బౌలర్లే బ్యాటర్లపై అధిపత్యం చెలాయించి టపా టపా వికెట్లు పడగొడతారు. మరి, ఈ సీజన్లో బ్యాటర్లపై అధిపత్యం ప్రదర్శించి ఒకే ఇన్నింగ్స్లో ఐదు వికెట్ల ఘనతను అందుకున్న బౌలర్లు ఎవరో చూద్దామా..
యుజువేంద్ర చాహల్
టీమ్ఇండియా మణికట్టు మాంత్రికుడు యుజువేంద్ర చాహల్ ఈ సీజన్లో రాజస్థాన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. చాహల్ 17 మ్యాచ్ల్లో 27 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. ఏప్రిల్ 18న కోల్కతాతో జరిగిన మ్యాచ్లో చాహల్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లు బౌలింగ్ చేసి 40 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇదే మ్యాచ్లో చాహల్ హ్యాట్రిక్ కూడా నమోదు చేశాడు. ఈ మ్యాచ్లో రాజస్థాన్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.
వానిందు హసరంగ
శ్రీలంక ఆల్రౌండర్ వానిందు హసరంగను మెగా వేలంలో బెంగళూరు రూ.10 కోట్ల భారీ ధరను వెచ్చించి కొనుగోలు చేసింది. ఆ భారీ ధరకు హసరంగ న్యాయం చేశాడు. 16 మ్యాచ్ల్లో 26 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా నిలిచాడు. మే 8న హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో హసరంగ చెలరేగాడు. 4 ఓవర్లలో కేవలం 18 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒక మేడిన్ ఓవర్ కూడా ఉండటం విశేషం. ఈ మ్యాచ్లో బెంగళూరు 67 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.
ఉమ్రాన్ మాలిక్
ఉమ్రాన్ మాలిక్.. ఈ మధ్య ఎక్కడ చూసిన ఇతడి పేరు మార్మోగుతోంది. అందుకు కారణం అతడు బంతిని విసిరే వేగమే. చాలా మ్యాచ్ల్లో 150 కి.మీ.ల వేగంతో బౌలింగ్ చేసిన ఉమ్రాన్.. దిల్లీతో జరిగిన మ్యాచ్లో 157 కి.మీ. వేగంతో బౌలింగ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. జమ్ముకశ్మీర్కు చెందిన ఈ పేస్ బౌలింగ్ సంచలనం ఈ సీజన్లో హైదరాబాద్ తరఫున ఆడి 14 మ్యాచ్ల్లో 9.03 ఎకానమీతో 22 వికెట్లు పడగొట్టాడు. ఏప్రిల్ 27న గుజరాత్తో జరిగిన మ్యాచ్లో 4 ఓవర్లలో 25 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు.
జస్ప్రీత్ బుమ్రా
టీమ్ఇండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా టీ20 లీగ్లో చాలా ఏళ్లుగా ముంబయికి ఆడుతున్నాడు. బుమ్రా ఈ సీజన్లో అంచనాలకు తగ్గట్లుగా రాణించలేదు. 14 మ్యాచ్ల్లో కేవలం 15 వికెట్లే పడగొట్టాడు. మే 9న కోల్కతాతో జరిగిన మ్యాచ్లో బుమ్రా చెలరేగాడు. 4 ఓవర్లలో కేవలం 10 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ మెడిన్ ఓవర్ కూడా ఉండటం విశేషం. బుమ్రా రాణించిన ఈ మ్యాచ్లో ముంబయికి ఓటమి తప్పలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేయగా.. ముంబయి 113 పరుగులకే ఆలౌటైంది. దీంతో కోల్కతా 52 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్