Virat Kohli: విరాట్ ఎదుట ఒక టోర్నీ.. టార్గెట్లు చాలా!
తన బ్యాటింగ్ దూకుడు ఏమాత్రం తగ్గలేదని ప్రపంచానికి చెప్పడానికి విరాట్ కోహ్లీకి ఐపీఎల్ అద్భుతమైన వేదిక. అతడిపై రేకెత్తిన పలు సందేహాలను ఈ టోర్నీలో పటాపంచలు చేస్తాడని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.
ఇంటర్నెట్డెస్క్: పరుగుల వీరుడు విరాట్ కోహ్లీ (Virat Kohli) పొట్టి ఫార్మాట్లో ఇప్పుడు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా త్వరలో జరగనున్న టీ20 ప్రపంచకప్లో అతడి స్థానంపై సందేహాలు ముసురుకొన్నాయి. వాస్తవానికి పొట్టి ప్రపంచకప్లో అతడికి అద్భుతమైన రికార్డు ఉంది. కాకపోతే టీ20ల్లో కొంత గ్యాప్ రావడంతో అతడు బ్యాటింగ్ లయను అందుకోవడంపైనే సందేహాలు ఉన్నాయి. దీనికి సమాధానం రావాలంటే ఐపీఎల్ మొదలయ్యే వరకు వేచి చూడాల్సిందే. కోహ్లీ కెరీర్కు సంబంధించి ఈ టోర్నమెంట్ ఇప్పుడు కీలకంగా మారింది.
ఐపీఎల్ తొలి మ్యాచ్లోనే డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్తో ఆర్సీబీ ఆడనుంది. సీనియర్ ఆటగాడిగా జట్టును నడిపించడం.. బ్యాటింగ్లో రాణించి టీ20 ప్రపంచకప్ జట్టులో స్థానానికి బలమైన పోటీదారుగా మారడం కోహ్లీ ముందున్న లక్ష్యాలు. 35 ఏళ్ల విరాట్ చివరి సారిగా 2022లో అఫ్గానిస్థాన్తో జరిగిన పొట్టి సిరీస్ ఆడాడు. అందులో రెండు మ్యాచుల్లో కేవలం 29 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత మరే అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడలేదు. ఇదొక్కటే అభిమానులను కొంచెం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో తన పదును ఏమాత్రం తగ్గలేదని సెలక్టర్లకు సంకేతాలు పంపేందుకు ఇదే సరైన వేదిక.
బుమ్రా-హార్దిక్ను ముంబయి వదులుకోవాలనుకుంది.. రోహిత్ వల్లే ఆ నిర్ణయం వెనక్కి: పార్థివ్ పటేల్
అంతర్జాతీయ టీ20ల్లో 4,000 పరుగులు చేసిన ఏకైక క్రికెటర్ కోహ్లీనే. ఇప్పటి వరకు 117 మ్యాచ్లు ఆడి 4,037 రన్స్ చేశాడు. అతడి సగటు 51.75 కాగా.. స్ట్రైక్ రేట్ 138.15. ఈ ఫార్మాట్లో శతకాలు చేసిన ఐదుగురు భారతీయుల్లో విరాట్ ఒకడు.
ఆ మరకను తుడిచేస్తాడా..?
ఐపీఎల్ ప్రారంభమైన 17 ఏళ్లలో కేవలం దిల్లీ, పంజాబ్, బెంగళూరు జట్లు మాత్రమే ఇప్పటి వరకూ ట్రోఫీని ముద్దాడలేదు. ముఖ్యంగా కోహ్లీ లాంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నా.. ఆర్సీబీ విషయంలో అభిమానులకు ఎప్పుడూ నిరాశే మిగులుతోంది. ఈ జట్టు మూడు సార్లు ఫైనల్స్లో ఓటములను మూటగట్టుకుంది. ఈ సారి కింగ్ తన పరుగుల దాహాన్ని తీర్చుకుని.. జట్టుకు ట్రోఫీని అందిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. అతడు మరో ఆరు పరుగులు సాధిస్తే టీ20 ఫార్మాట్లో 12,000 రన్స్ చేసిన ఆరో ఆటగాడిగా ఘనత సాధిస్తాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
టెస్టుల్లో సచిన్ తెందూల్కర్ అత్యధిక పరుగుల రికార్డును ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ (Joe Root) బ్రేక్ చేసే అవకాశముందని భారత మాజీ వికెట్కీపర్ దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) అభిప్రాయపడ్డాడు. -
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ