Kolkata Vs Hyderabad: తొలి క్వాలిఫయర్.. అభిషేక్కు ఆ జోడీ నుంచే ముప్పు: భారత మాజీ క్రికెటర్
నాకౌట్ దశలో తొలి మ్యాచ్ కోల్కతాతో తలపడేందుకు హైదరాబాద్ సిద్ధమైంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మ్యాచ్ జరగనుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2024 సీజన్ తొలి క్వాలిఫయర్కు అహ్మదాబాద్ వేదిక. కోల్కతా X హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. సన్రైజర్స్ ఓపెనర్ల దూకుడుకు.. కేకేఆర్ బౌలింగ్కు అసలైన పోరు ఉంటుందని క్రికెట్ పండితుల అంచనా. ఈ క్రమంలో యువ బ్యాటర్ అభిషేక్ శర్మకు భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కీలక సూచనలు చేశాడు. కోల్కతా బౌలర్లు సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి జోడీ నుంచి ప్రమాదం పొంచి ఉంటుందని హెచ్చరించాడు. ప్రస్తుత సీజన్లో అభిషేక్ శర్మ 13 ఇన్నింగ్స్ల్లో 467 పరుగులు చేశాడు. కోల్కతాతో మ్యాచ్లో శర్మ ‘ప్లాన్ A’ గేమ్తో ఆడితేనే ఆ ఇద్దరిపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు అవకాశం ఉంటుందని చోప్రా వ్యాఖ్యానించాడు. వచ్చే జింబాబ్వే, శ్రీలంక పర్యటనలకు అభిషేక్ను ఎంపిక చేయాలని ఈ సందర్భంగా సెలక్టర్లకు సూచించాడు.
‘‘భారత జట్టు తరఫునా అభిషేక్ శర్మ ఆడేందుకు సమయం వస్తుందని అనుకుంటున్నా. శ్రీలంక, జింబాబ్వే దేశాలకు అతడిని ఎంపిక చేస్తే బాగుంటుంది. తప్పకుండా ఓపెనింగ్ చేస్తాడు. ఇప్పుడు ఐపీఎల్ తొలి క్వాలిఫయర్లో నరైన్, వరుణ్పై అభిషేక్ అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించాలి. ట్రావిస్ హెడ్ కూడా శర్మతో ఇన్నింగ్స్ను ప్రారంభిస్తాడు కాబట్టి.. స్పిన్ను త్వరగానే బౌలింగ్కు తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి, స్పిన్ను సమర్థంగా అడ్డుకొని పరుగులు చేయాలంటే భారత బ్యాటర్గా అభిషేక్ ఒక అడుగు ముందుకేయాలి. వారిని అడ్డుకోగలిగితే మ్యాచ్పై ఎస్ఆర్హెచ్ పట్టు సాధించడం ఖాయం’’ అని చోప్రా తెలిపాడు.
హెడ్ - అహ్మదాబాద్ పిచ్ మధ్య లవ్ఎఫైర్!
‘‘ట్రావిస్ హెడ్కు అహ్మదాబాద్ పిచ్ అంటే చాలా ఇష్టం. వరల్డ్ కప్ ఫైనల్లో ఇక్కడే శతకం సాధించాడు. భారత్ను ఓడించడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. కాబట్టి, హెడ్ ఈసారి హైదరాబాద్ జట్టును గెలిపిస్తాడని అనుకుంటున్నా. ఎస్ఆర్హెచ్కు వన్డౌన్ కాస్త బలహీనంగా అనిపిస్తోంది. రాహుల్ త్రిపాఠి గత మ్యాచ్లో ఫర్వాలేదనిపించాడు. మరోసారి అలాంటి ప్రదర్శనే చేస్తే తిరుగుండదు’’ అని భారత మాజీ క్రికెటర్ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి