MS Dhoni: ఆ విషయంలో ధోనీ అందరి అంచనాలను తల్లకిందులు చేశాడు: డివిలియర్స్
మిస్టర్ కూల్ కెప్టెన్ ధోనీ (MS Dhoni)పై దక్షిణాఫ్రికా మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మరో మూడు సీజన్లు ఆడే సత్తా ధోనీకి ఉందని అంచనావేశాడు.
ఇంటర్నెట్డెస్క్: కెప్టెన్ కూల్ ధోనీ (MS Dhoni) ఐపీఎల్ భవిష్యత్తుపై మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ (Ab de Villiers ) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మహీ ఐపీఎల్ జైత్రయాత్ర అంచనాలకు మించి సాగుతోందన్నాడు. తాజాగా తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ..‘‘చెన్నై కొనసాగించిన ఆటగాళ్ల జాబితాలో ధోనీ పేరును చూసి సంతోషించాను. గత సీజనే ధోనీకి చివరిదయ్యే అవకాశం ఉందని భారీగా ప్రచారం జరిగింది. అతడు 2024 ఐపీఎల్ సీజన్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. అతడు ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుంటాడు. ఎవరికి తెలుసు..? అతడు మరో మూడు సీజన్ల కంటే ఎక్కువ ఆడతాడమేమో. ఆ సీజన్లలో అతడి పేరు చూడాలన్నది ఆకాంక్ష మాత్రమే’’ అని డివిలియర్స్ పేర్కొన్నాడు.
‘టీ20 ప్రపంచకప్ ఉన్న ఈ తరుణంలో’.. కోచ్గా ద్రవిడ్ కొనసాగింపుపై గంభీర్ స్పందన
ఇక పంజాబ్ విడుదల చేసిన ఆటగాడు షారుఖ్ ఖాన్ ఆర్సీబీ సొంతం చేసుకోవచ్చనే అంశంపై మాట్లాడతూ.. అతడు (షారుఖ్ ఖాన్) స్థిరంగా రాణిస్తున్న బలమైన ఆటగాడన్నాడు. మాతోపాటు అతడిని కొనుగోలు చేయడానికి చాలా జట్లు పోటీపడవచ్చని అంచనావేశాడు. ఈ విషయంలో సీఎస్కేతో పోటీ ఉండొచ్చని డివిలియర్స్ పేర్కొన్నాడు.
సూపర్ కింగ్స్కు ఆరోసారి ఐపీఎల్ టైటిల్ను అందించేందుకు 2023 సీజన్లో ధోనీ విపరీతంగా శ్రమించాడు. ఆ లీగ్ సమయంలో ధోనీ మోకాలి సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. 16 మ్యాచ్ల్లో 184 స్ట్రైక్ రేట్తో 104 పరుగులు చేశాడు. అప్పట్లోనే తాను మరో ఐపీఎల్లో ఆడేందుకు వస్తానని ధోనీ ప్రకటించాడు. ప్రస్తుతం మోకాలి గాయానికి శస్త్రచికిత్స చేయించుకుని కోలుకున్నాడు. వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం సమాయత్తమవుతున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం