Afghan: అఫ్గాన్ విజయాల వెనుక మన జడేజా.. పాక్ పాలిట సింహస్వప్నం
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో సంచలనాలకు లోటు లేదు. ఫేవరెట్లుగా బరిలోకి దిగిన జట్లకు షాకులు తప్పడం లేదు. తాజాగా పాక్పై అఫ్గాన్ (PAK vs AFG) విజయం కూడా ఇదే జాబితాలోకి చేరింది.
వన్డే ప్రపంచకప్ 2023లో (ODI World Cup 2023) ఇప్పటి వరకు మూడు సంచలనాలు నమోదయ్యాయి. అందులో రెండు అఫ్గానిస్థాన్వే. ‘పసికూన’ అని లైట్ తీసుకున్నవాళ్లకు గట్టి షాక్లే ఇచ్చింది. వరల్డ్ కప్లో ఇలా చిచ్చరపిడుగులా మారడం వెనుక ఓ భారత మాజీ స్టార్ ప్లేయర్ ఉన్నాడని తెలుసా? అతనే అజయ్ జడేజా. ప్రస్తుతం అఫ్గాన్కి మెంటార్. అంతేకాదు పాక్పై విజయం వెనుక ‘పాక్ X జడేజా’ కూడా ఓ కారణం అని చెప్పొచ్చు.
మన దేశం మొత్తం దసరా పండగ సందడిలో బిజీగా ఉంది. క్రికెట్ అభిమానుల్లో ఆ సంతోషాన్ని దాదాపు రెట్టింపు చేసింది ఓ క్రికెట్ మ్యాచ్ ఫలితం. పాకిస్థాన్కు షాక్ ఇస్తూ అఫ్గానిస్థాన్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అఫ్గాన్ గెలిస్తే మనకేం సంబరం అనుకుంటున్నారా? ఆ జట్టు విజయం వెనుక ఉన్న కీలక వ్యక్తి మన దేశస్థుడు అజయ్ జడేజా. అంతేకాదు మన దేశం ప్రోత్సాహంతోనే ఇప్పుడు దూసుకుపోతూ మేటి జట్లకు అఫ్గాన్ షాక్లిస్తోంది.
అఫ్గానిస్థాన్ క్రికెట్కు భారత్ ఎంతో కాలంగా బాసటగా నిలుస్తోంది. మౌలిక సదుపాయాలను కల్పించడం నుంచి ఆ దేశంలో స్టేడియం నిర్మాణం వరకూ సహకారం అందించింది. ఇప్పుడు ఏకంగా ఆ జట్టు మన మాజీ స్టార్ ప్లేయర్ అజయ్ జడేజాను మెంటార్గా నియమించుకుంది. టోర్నీ ఆరంభానికి కేవలం వారం వ్యవధిలోనే జట్టుతోపాటు చేరిన అజయ్ జడేజా ఆటగాళ్లతో భలేగా కలిసిపోయాడు. ఐపీఎల్లో అడిన అనుభవం, ఇక్కడి మైదానాల గురించి తెలిసిన వ్యక్తి మెంటార్ కావడంతో షాహిదీ జట్టు దూసుకెళ్తోంది. రషీద్, ముజీబ్, నూర్, నబీ... ఇలా ఎవరికివారు తమదైన రోజున ప్రత్యర్థిని వణికిస్తున్నారు. ఈసారి బ్యాటింగ్ విభాగంపై అజయ్ జడేజా దృష్టి పెట్టాడని తెలుస్తోంది. అందుకే అఫ్గాన్కు ఈ భారీ విజయాలు, షాక్లు ఇతర జట్లకు ఎదురవుతున్నాయట.
అప్పుడు అజయ్ జడేజా..
పాకిస్థాన్పై అఫ్గానిస్థాన్ విజయంతో.. 1996 వరల్డ్ కప్ రెండో క్వార్టర్ ఫైనల్ను గుర్తు చేసుకుంటున్నారు ఇండియన్ ఫ్యాన్స్. ఆ మ్యాచ్లో పాక్పై చివర్లో అజయ్ జడేజా కేవలం 25 బంతుల్లోనే 45 పరుగులు సాధించాడు. ఇప్పటికీ ఆ ఇన్నింగ్స్ క్రికెటర్లకు ఎన్నో పాఠాలను నేర్పుతుంది. వకార్ యూనిస్, అకీబ్ జావెద్ వంటి బౌలర్లను ఎదుర్కొని పరుగులు సాధించడమే ఆ మ్యాచ్ ప్రత్యేకత. ఇక జడేజా టీమ్ ఇండియా ప్లేయర్గా కొనసాగుతున్న రోజుల్లో డేరింగ్ అండ్ డాషింగ్ అనే పేరు తెచ్చుకున్నాడు. వికెట్ల మధ్య వేగంగా పరుగులు తీయడం, సింగిల్ వచ్చే చోట రెండో పరుగు తీయడం లాంటివి చేసేవాడు. పాకిస్థాన్ మ్యాచ్లో అఫ్గాన్ బ్యాటర్లు చేసింది కూడా ఇదే. ఇక ఫీల్డింగ్లో జడేజా మెరుపులు చాలానే ఉన్నాయి. గాల్లోకి అమాంతం ఎగరడం, ఒంటి చేతి క్యాచ్లు, సింగిల్ స్టంప్ వ్యూ రనౌట్లు లాంటివి ఎన్నో అజయ్ ఖాతాలో ఉన్నాయి. ఇప్పుడు అలాంటివే అఫ్గాన్ ప్లేయర్ల దగ్గర చూస్తున్నాం కూడా.
పాక్ అంటే పూనకమే...
గతంలో పాక్పై అజయ్ జడేజా మంచి గణాంకాలే నమోదు చేశాడు. కెరీర్ మొత్తంలో వన్డేల్లో 196 మ్యాచ్లు ఆడిన జడేజా... 5359 పరుగులు చేశాడు. ప్రత్యర్థి జట్ల లెక్కలు చూస్తే.. పాకిస్థాన్ మీదే ఈ మిడిలార్డర్ బ్యాటర్కు అత్యధిక పరుగులు సాధించాడు. మొత్తంగా పాక్పై 40 మ్యాచ్లు ఆడిన అజయ్ 892 పరుగులు చేశాడు. బౌలర్గా రెండు వికెట్లు తీశాడు. కచ్చితంగా ఈ అనుభవాన్ని అఫ్గాన్ కుర్రాళ్లకు నేర్పే ఉంటాడు. ఇక ఒత్తిడిలో చిత్తవడం అనేది జడేజాకు తెలియదు అంటుంటారు. వకార్ యూనిస్ లాంటి ఫాస్ట్ బౌలర్ వేసిన బంతినే అలవోకగా స్టాండ్స్లోకి పంపిన ఘనుడు. ఇప్పుడు అదే అఫ్గాన్ ప్లేయర్లకు నూరిపోస్తున్నాడేమో అనిపిస్తోంది వారి ప్రదర్శన చూస్తుంటే.
తడబాటుతో ప్రారంభం...
అజయ్ జడేజా మార్గదర్శకంలో వరల్డ్ కప్లోకి అడుగు పెట్టిన అఫ్గాన్కు తొలి మ్యాచ్లో షాక్ తగిలింది. బంగ్లాదేశ్పై 156 పరుగులకే ఆలౌటైంది. అలాగని బౌలింగ్లో తీసికట్టు ప్రదర్శన చేయకుండా పోరాడింది. కానీ, ఓటమి తప్పలేదు. ఇక భారత్పై అఫ్గాన్ బ్యాటింగ్ విభాగం చెలరేగుతుందని ఎవరూ ఊహించలేదు. మిడిలార్డర్లో కెప్టెన్ షాహిది, అజ్మతుల్లా నిలకడైన ఆటతీరును ప్రదర్శించారు. దీంతో 50 ఓవర్లలో 272 పరుగులు చేయగలిగింది. కానీ, భారత బ్యాటర్లు భీకర ఫామ్లో ఉండటంతో అఫ్గాన్ బౌలర్లు చేతులెత్తేశారు. రెండు ఓటముల తర్వాత ఎలాంటి జట్టైనా ఇబ్బంది పడటం సహజం. కానీ, మూడో మ్యాచ్ నాటికి పుంజుకున్న తీరు అమోఘం. ఇంగ్లాండ్పైనా 284 పరుగులు చేసి ఔరా అనిపించింది. బౌలింగ్లోనూ రాణించి వారిని 215 పరుగులకే ఆలౌట్ చేసి తొలి సంచలన విజయాన్ని రుచిచూసింది. ఇప్పుడు రెండో విజయంగా పాక్ను మట్టికరిపించి గెలుపును సొంతం చేసుకుంది.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
-
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్