Gujarat Vs Mumbai: పాత జట్టే పాండ్య ప్రత్యర్థి.. ‘నాన్-కెప్టెన్’ రోహిత్ ఏం చేస్తాడో?
ఐపీఎల్లో మరో ఆసక్తికరమైన మ్యాచ్ ఇవాళ జరగనుంది. రాత్రి 7 గంటలకు ముంబయి, గుజరాత్ జట్లు అహ్మదాబాద్ వేదికగా తలపడనున్నాయి.
ఐపీఎల్లోకి అడుగుపెట్టిన ఆ జట్టును తొలి ఏడాదే ఛాంపియన్గా నిలిపాడు.. రెండో సీజన్లోనూ ఫైనల్కు తీసుకెళ్లాడు. మూడో ఎడిషన్నాటికి జట్టు మారిపోయాడు. మరొక టీమ్కు కెప్టెన్ అయిపోయాడు. ఇప్పటికే అర్థమై ఉంటుందిగా ఆ ప్లేయర్ హార్దిక్ పాండ్య అని.. పాత జట్టు గుజరాత్. ఇప్పుడు సారథిగా నియమితుడైన టీమ్ ముంబయి. నేడు ఈ రెండు జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్ జరగనుంది.
రోహిత్పైనే దృష్టి..
హార్దిక్ నాయకత్వం గురించి అందరికీ తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్లో ముంబయిని ఐదుసార్లు ఛాంపియన్గా నిలిపిన రోహిత్ శర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు. హిట్మ్యాన్ను సారథ్యం నుంచి తప్పించి హార్దిక్ను నియమించడంపై నెట్టింట సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఒకదశలో రోహిత్ సీజన్ ఆడకపోవచ్చనే వార్తలూ వచ్చాయి. అయితే, ప్రాక్టీస్ సందర్భంగా రోహిత్-హార్దిక్ హగ్ చేసుకోవడం నెట్టింట వైరల్గా మారింది. దీంతో రోహిత్ ఆడటం ఖాయమని తేలిపోయింది. ఇక బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ను కోల్పోయిన ఇషాన్ కిషన్ కూడా ముమ్మరంగా సాధన చేశాడు. టీ20ల్లో టాప్ర్యాంకర్ సూర్యకుమార్ యాదవ్ ఇంకా ఫిట్నెస్ సాధించలేదు. టీ20 ప్రపంచ కప్లో చోటే లక్ష్యంగా తిలక్ వర్మ బరిలోకి దిగుతున్నాడు.
బుమ్రా, కొయిట్జీ గెరాల్డ్, క్వెనా మఫాకా త్రయంతో కూడిన పేస్ దళం ముంబయి సొంతం. వారితోపాటు హార్దిక్ పాండ్య ఫాస్ట్ బౌలింగ్ వేయడం కలిసొచ్చే అంశమే. అయితే, అతడు ఈసారైనా పూర్తి ఓవర్ల కోటాను సంధిస్తాడో లేదో చూడాలి. నబీ, పీయూశ్ చావ్లాతో కూడి స్పిన్ విభాగం బాగుంది. గుజరాత్ జట్టులోని హిట్టర్లను అడ్డుకోవాలంటే ఇంకాస్త శ్రమించాలి. యువ తెందూల్కర్ అర్జున్ను ఈసారి ఎలా వినియోగించుకుంటారనేది ఆసక్తికరం.
వారిద్దరు లేకపోవడం నష్టమే.. కానీ
గత రెండు సీజన్లలో జట్టును నడిపించిన హార్దిక్ పాండ్య గుజరాత్లో లేడు. పేస్ విభాగంలో కీలకమైన మహమ్మద్ షమీ గాయం కారణంగా దూరమయ్యాడు.అయినా ఆ జట్టును తక్కువగా అంచనా వేయకూడదు. క్లాస్ క్రికెటర్ శుభ్మన్ గిల్ తొలిసారి భారీ లీగ్లో సారథ్యం నిర్వర్తించేందుకు సిద్ధమయ్యాడు. వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, సాయి సుదర్శన్, షారుక్ ఖాన్ వంటి హార్డ్ హిట్టర్లు గుజరాత్ సొంతం. భారత సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్ను గత మినీ వేలంలో ఆ జట్టు తీసుకుంది. అతడితోపాటు మోహిత్ శర్మ, జాషువా లిటిల్ ఫాస్ట్ బౌలింగ్తో ముంబయిని అడ్డుకోనుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 బౌలర్ రషీద్ ఖాన్తోపాటు నూర్ అహ్మద్ స్పిన్ విభాగాన్ని నడిపించనున్నారు.
తుది జట్లు (అంచనా)
ముంబయి: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య (కెప్టెన్), రోహిత్ శర్మ, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, డెవాల్డ్ బ్రెవిస్, నెహాల్ వధేరా, నబీ, బుమ్రా, గెరాల్డ్ కొయిట్జీ, పీయూష్ చావ్లా
గుజరాత్: శుభ్మన్ గిల్ (కెప్టెన్), వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, విజయ్ శంకర్, రాహుల్ తెవాతియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, జోషువా లిటిల్, మోహిత్ శర్మ, ఉమేశ్ యాదవ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
-
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం