Gujarat Vs Mumbai: పాత జట్టే పాండ్య ప్రత్యర్థి.. ‘నాన్-కెప్టెన్’ రోహిత్ ఏం చేస్తాడో?
ఐపీఎల్లో మరో ఆసక్తికరమైన మ్యాచ్ ఇవాళ జరగనుంది. రాత్రి 7 గంటలకు ముంబయి, గుజరాత్ జట్లు అహ్మదాబాద్ వేదికగా తలపడనున్నాయి.
ఐపీఎల్లోకి అడుగుపెట్టిన ఆ జట్టును తొలి ఏడాదే ఛాంపియన్గా నిలిపాడు.. రెండో సీజన్లోనూ ఫైనల్కు తీసుకెళ్లాడు. మూడో ఎడిషన్నాటికి జట్టు మారిపోయాడు. మరొక టీమ్కు కెప్టెన్ అయిపోయాడు. ఇప్పటికే అర్థమై ఉంటుందిగా ఆ ప్లేయర్ హార్దిక్ పాండ్య అని.. పాత జట్టు గుజరాత్. ఇప్పుడు సారథిగా నియమితుడైన టీమ్ ముంబయి. నేడు ఈ రెండు జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్ జరగనుంది.
రోహిత్పైనే దృష్టి..
హార్దిక్ నాయకత్వం గురించి అందరికీ తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్లో ముంబయిని ఐదుసార్లు ఛాంపియన్గా నిలిపిన రోహిత్ శర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు. హిట్మ్యాన్ను సారథ్యం నుంచి తప్పించి హార్దిక్ను నియమించడంపై నెట్టింట సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఒకదశలో రోహిత్ సీజన్ ఆడకపోవచ్చనే వార్తలూ వచ్చాయి. అయితే, ప్రాక్టీస్ సందర్భంగా రోహిత్-హార్దిక్ హగ్ చేసుకోవడం నెట్టింట వైరల్గా మారింది. దీంతో రోహిత్ ఆడటం ఖాయమని తేలిపోయింది. ఇక బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ను కోల్పోయిన ఇషాన్ కిషన్ కూడా ముమ్మరంగా సాధన చేశాడు. టీ20ల్లో టాప్ర్యాంకర్ సూర్యకుమార్ యాదవ్ ఇంకా ఫిట్నెస్ సాధించలేదు. టీ20 ప్రపంచ కప్లో చోటే లక్ష్యంగా తిలక్ వర్మ బరిలోకి దిగుతున్నాడు.
బుమ్రా, కొయిట్జీ గెరాల్డ్, క్వెనా మఫాకా త్రయంతో కూడిన పేస్ దళం ముంబయి సొంతం. వారితోపాటు హార్దిక్ పాండ్య ఫాస్ట్ బౌలింగ్ వేయడం కలిసొచ్చే అంశమే. అయితే, అతడు ఈసారైనా పూర్తి ఓవర్ల కోటాను సంధిస్తాడో లేదో చూడాలి. నబీ, పీయూశ్ చావ్లాతో కూడి స్పిన్ విభాగం బాగుంది. గుజరాత్ జట్టులోని హిట్టర్లను అడ్డుకోవాలంటే ఇంకాస్త శ్రమించాలి. యువ తెందూల్కర్ అర్జున్ను ఈసారి ఎలా వినియోగించుకుంటారనేది ఆసక్తికరం.
వారిద్దరు లేకపోవడం నష్టమే.. కానీ
గత రెండు సీజన్లలో జట్టును నడిపించిన హార్దిక్ పాండ్య గుజరాత్లో లేడు. పేస్ విభాగంలో కీలకమైన మహమ్మద్ షమీ గాయం కారణంగా దూరమయ్యాడు.అయినా ఆ జట్టును తక్కువగా అంచనా వేయకూడదు. క్లాస్ క్రికెటర్ శుభ్మన్ గిల్ తొలిసారి భారీ లీగ్లో సారథ్యం నిర్వర్తించేందుకు సిద్ధమయ్యాడు. వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, సాయి సుదర్శన్, షారుక్ ఖాన్ వంటి హార్డ్ హిట్టర్లు గుజరాత్ సొంతం. భారత సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్ను గత మినీ వేలంలో ఆ జట్టు తీసుకుంది. అతడితోపాటు మోహిత్ శర్మ, జాషువా లిటిల్ ఫాస్ట్ బౌలింగ్తో ముంబయిని అడ్డుకోనుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 బౌలర్ రషీద్ ఖాన్తోపాటు నూర్ అహ్మద్ స్పిన్ విభాగాన్ని నడిపించనున్నారు.
తుది జట్లు (అంచనా)
ముంబయి: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య (కెప్టెన్), రోహిత్ శర్మ, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, డెవాల్డ్ బ్రెవిస్, నెహాల్ వధేరా, నబీ, బుమ్రా, గెరాల్డ్ కొయిట్జీ, పీయూష్ చావ్లా
గుజరాత్: శుభ్మన్ గిల్ (కెప్టెన్), వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, విజయ్ శంకర్, రాహుల్ తెవాతియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, జోషువా లిటిల్, మోహిత్ శర్మ, ఉమేశ్ యాదవ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
భారత ఆర్చరీ బృందం అద్భుత ప్రదర్శన చేసింది. ఆర్చరీ వరల్డ్ కప్లో మూడు కేటగిరీల్లో స్వర్ణాలను గెలుచుకుంది. -
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్ 17వ సీజన్లో భారీ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైంది. 200+ కాకుండా.. 250+ స్కోరుకూడా దాటిపోవడం గమనార్హం. -
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?నేడు జట్టును ప్రకటించే అవకాశం
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్