ODI WC 2023: క్రికెట్ మహాసంగ్రామం.. ఈ రికార్డులపై గురి..!
నేటి నుంచి వన్డే ప్రపంచ కప్ (ODI World Cup 2023) సంగ్రామం ప్రారంభం కానుంది. అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్లో (ODI World Cup 2023) ఛాంపియన్గా నిలవాలంటే జట్టు సమష్ఠిగా రాణించాల్సిందే. అదేవిధంగా ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శన కూడా జట్టు విజయాల్లో కీలకం. భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ సంగ్రామం గురువారం నుంచి మొదలు కానుంది. ఇది కూడా ఓ ఘనతే. ఇతర దేశాలతో సంబంధం లేకుండా ఈ టోర్నీని భారత్ నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ సారి మెగా టోర్నీలో క్రికెటర్లు రికార్డులు బద్దలు కొడతారా? లేదా? అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.
- రోహిత్ శర్మ: భారత కెప్టెన్ రోహిత్ శర్మ హార్డ్ హిట్టింగ్ తెలిసిందే. సిక్స్లను మంచినీళ్లు తాగినంత సులువుగా బాదడంలో ప్రసిద్ధుడు. అంతర్జాతీయ క్రికెట్లో క్రిస్గేల్ అత్యధికంగా 551 ఇన్నింగ్స్ల్లో 553 సిక్సులు బాదాడు. ఆ తర్వాత స్థానంలో ఉన్న రోహిత్ కేవలం 471 ఇన్నిగ్స్ల్లో 551 సిక్సులు బాదాడు. మరో మూడు సిక్స్లు కొడితే క్రిస్గేల్ ప్రపంచ రికార్డు బద్దలవుతుంది. ఇప్పటికే వన్డేల్లో రోహిత్ 292 సిక్స్లతో మూడోస్థానంలో ఉన్న విషయం తెలిసిందే. వరల్డ్ కప్లో వెయ్యి పరుగులు చేసేందుకు రోహిత్కు 22 పరుగులు అవసరం. ప్రస్తుతం రోహిత్ 978 రన్స్తో కొనసాగుతున్నాడు. ఇక మరో శతకం చేస్తే.. ప్రపంచకప్ టోర్నిలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. ప్రస్తుతం సచిన్ (6) రికార్డును హిట్మ్యాన్ సమం చేశాడు.
- విరాట్ కోహ్లీ: ప్రస్తుతం విరాట్ ఖాతాలో 47 వన్డే సెంచరీలు (269 ఇన్నింగ్స్లు) ఉన్నాయి. మరో మూడు చేస్తే శతకాల సంఖ్య హాఫ్ సెంచరీకి చేరుతుంది. దీంతో క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ పేరిట ఉన్న 49 సెంచరీల (452 ఇన్నింగ్స్లు) రికార్డును ఈ క్రికెట్ కింగ్ అధిగమిస్తాడు. వన్డేలో 50 సెంచరీలు సాధించిన తొలి బ్యాటర్గా అవతరిస్తాడు. విరాట్ ఒక్క క్యాచ్ పడితే వరల్డ్ కప్లో భారత్ తరఫున అత్యధిక క్యాచ్లు పట్టిన ఫీల్డర్గా మారతాడు. ప్రస్తుతం కోహ్లీ ఖాతాలో 26 ఇన్నింగ్స్ల్లో 14 క్యాచ్లు పట్టి అనిల్ కుంబ్లే రికార్డును ఇప్పటికే సమం చేశాడు.
- జోస్ బట్లర్: వన్డేల్లో 5 వేల పరుగుల మైలురాయిని చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ కెప్టెన్ 4,823 పరుగులతో కొనసాగుతున్నాడు. ఇందులో 11 సెంచరీలు, 25 అర్ధశతకాలు ఉన్నాయి. మరో 177 పరుగులు చేస్తే 5000 పరుగుల జాబితాలోకి చేరతాడు.
- జో రూట్: ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ కూడా ఓ అరుదైన ఘనతకు కాస్త సమీపంలో ఉన్నాడు. వరల్డ్ కప్ టోర్నీల్లో ఇప్పటి వరకు 16 ఇన్నింగ్స్ల్లో 758 పరుగులు చేసిన రూట్.. మరో 140 పరుగులు చేస్తే చాలు ఓ రికార్డును తన ఖాతాలో వేసుకుంటాడు. గ్రాహం గూచ్ 21 ఇన్నింగ్స్ల్లో 897 పరుగులతో వరల్డ్ కప్ల్లో ఇంగ్లాండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా ఉన్నాడు.
- డేవిడ్ వార్నర్: ఆస్ట్రేలియా ఓపెనర్ వార్నర్ మరో 8 పరుగులు చేస్తే వరల్డ్ కప్ పోటీల్లో వెయ్యి పరుగులు చేసిన ఆ దేశానికి చెందిన నాలుగో బ్యాటర్గా అవతరిస్తాడు. గతంలో రికీ పాంటింగ్ (1,743), ఆడమ్ గిల్క్రిస్ట్ (1,085), మార్క్ వా (1,004) మాత్రమే ముందున్నారు. అలాగే వార్నర్ మరో రెండు సెంచరీలు చేస్తే వరల్డ్ కప్ ఈవెంట్లలో అత్యధిక శతకాలు బాదిన ఆసీస్ ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. వార్నర్ 4 సెంచరీలు చేయగా.. రికీ పాంటింగ్ 5 సెంచరీలు సాధించాడు.
- మిచెల్ స్టార్క్: ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ వరల్డ్ కప్లో ఇప్పటి వరకు 18 మ్యాచుల్లో 49 వికెట్లు తీశాడు. మరొక వికెట్ తీస్తే ఆసీస్ తరఫున 50 వికెట్లు తీసిన రెండో బౌలర్ అవుతాడు. గ్లెన్ మెక్గ్రాత్ 71 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. 39 మ్యాచుల్లో అతడు ఈ ఘనత సాధించాడు. దానిని అందుకోవడానికి స్టార్క్కు 23 వికెట్లు అవసరం.
- ట్రెంట్ బౌల్ట్: ఈ కివీస్ పేసర్ వన్డేల్లో 200 వికెట్ల క్లబ్లోకి చేరేందుకు మూడు వికెట్ల దూరంలోనే ఉన్నాడు. ప్రస్తుతం 104 మ్యాచుల్లో 197 వికెట్లతో కొనసాగుతున్నాడు. కివీస్ తరఫున వన్డేల్లో అత్యధిక వికెట్లు కూల్చిన బౌలర్ డానియల్ వెట్టోరి (291 మ్యాచుల్లో 273 వికెట్లు). ఈ వరల్డ్ కప్లో బౌల్ట్ మరో 18 వికెట్లు తీస్తే కివీస్ తరఫున అత్యధికంగా వికెట్లు తీసిన మూడో బౌలర్గా నిలుస్తాడు. వెట్టోరి తర్వాత మిల్స్ (240), టిమ్ సౌథీ (214) ఆ తర్వాత స్థానాల్లో నిలిచారు.
- టీమ్ఇండియా: ఈ సారి సెంటిమెంట్ భారత్ పక్షాన ఉంది. వన్డే ప్రపంచకప్ను భారత్ గెలుచుకుంటే గత మూడు కప్పుల్లోని సంప్రదాయాన్ని కొనసాగించిన జట్టుగా నిలుస్తుంది. గత మూడు వన్డే వరల్డ్ కప్లను ఆతిథ్య జట్లే గెలుచుకోవడం విశేషం. ధోనీ నాయకత్వంలో 2011 వరల్డ్ కప్ (భారత్, శ్రీలంక, బంగ్లా ఆతిథ్యం), 2015లో ఆస్ట్రేలియా, 2019లో ఇంగ్లాండ్ ఛాంపియన్గా నిలిచాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్