IPL 2024: ‘‘ఐపీఎల్ కప్ కొట్టడం.. సంబరాలు చేసుకున్నంత సులువు కాదు’’
కీలకమైన ప్లేఆఫ్స్ మ్యాచ్లో బెంగళూరు ఓడిపోయింది. ఈసారైనా కప్ను కొట్టాలనే ఆశలకు బ్రేక్ పడింది. ఈ క్రమంలో సీఎస్కే మాజీ ఆటగాడు చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్ ప్లేఆఫ్స్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి పాలైంది. ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ చేతిలో పరాభవంతో టోర్నీ నుంచి ఆర్సీబీ నిష్క్రమించింది. ఈ క్రమంలో బెంగళూరు జట్టును ఉద్దేశించి సీఎస్కే మాజీ ఆటగాడు అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. ఈ సీజన్ లీగ్ స్టేజ్ చివరి మ్యాచ్లో చెన్నైను ఓడించిన అనంతరం సంబరాల్లో మునిగిపోయిన బెంగళూరు ఆటగాళ్లపై అప్పుడు తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఎంఎస్ ధోనీతోపాటు సీఎస్కే ఆటగాళ్లు మైదానంలో ప్రవేశించినా ఆర్సీబీ ప్లేయర్లు ఆలస్యంగా రావడంతో వారి కరచాలనం కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఎదురైంది. దీంతో ఇప్పుడు మరోసారి ఆ సందర్భాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ రాయుడు కీలక వ్యాఖ్యలు చేశాడు.
‘‘దూకుడుగా ఉండటం, సంబరాలు చేసుకోవడం వల్ల ఐపీఎల్ ట్రోఫీలను గెలవలేం. కేవలం సీఎస్కేను ఓడించినంత మాత్రాన కప్ను సొంతం చేసుకున్నట్లు కాదు. ఐపీఎల్ టైటిల్ను నెగ్గాలంటే ప్లేఆఫ్స్కు చేరితేనే సరిపోదు. అక్కడా మంచి ప్రదర్శన ఇవ్వాలి’’ అని రాయుడు వ్యాఖ్యానించాడు. అలాగే తన సోషల్ మీడియా ఖాతాలోనూ పోస్టు పెట్టాడు. ‘కొన్నిసార్లు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది’ అని క్యాప్షన్ ఇచ్చాడు.
నిరాశే కానీ.. కుర్రాళ్లు అదరగొట్టారు: ఏబీడీ
‘‘కష్టపడి ప్లేఆఫ్స్కు వచ్చాక.. ఇలాంటి ఫలితం ఎదురైతే ఆ బాధ మాటల్లో చెప్పలేం. అయితే, ఆర్సీబీ అభిమానిగా కుర్రాళ్ల శ్రమ పట్ల గర్వంగా ఉంది. ప్లేఆఫ్స్ అవకాశాలు అతి తక్కువగా ఉన్నప్పటి నుంచి నాకౌట్కు చేరినంత వరకు ప్లేయర్లు పట్టుదల ప్రదర్శించడం అభినందనీయం. తప్పకుండా వచ్చే సీజన్లో మరింత బలంగా బెంగళూరు జట్టు తిరిగి వస్తుందని నమ్ముతున్నా. టైటిల్ సాధిస్తుందని విశ్వసిస్తున్నా’’ అని ఒకప్పటి ఆర్సీబీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు పెట్టాడు. ఎలిమినేటర్ మ్యాచ్లో బెంగళూరుపై నాలుగు వికెట్ల తేడాతో రాజస్థాన్ విజయం సాధించింది. ఆర్సీబీ నిర్దేశించిన 173 పరుగుల టార్గెట్ను ఆర్ఆర్ 19 ఓవర్లలో ఆరు వికెట్లను కోల్పోయి ఛేదించింది. దీంతో హైదరాబాద్తో రెండో క్వాలిఫయర్ మ్యాచ్లో తలపడనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం