CSK: అతడే సీఎస్కే భవిష్యత్తు కెప్టెన్: అంబటి రాయుడు
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో (IPL) అత్యంత విజయవంతమైన జట్టు చెన్నై సూపర్ కింగ్స్ (CSK). ఎంఎస్ ధోనీ నాయకత్వంలో ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచింది. అయితే, అతడి తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు ఎవరు తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐదుసార్లు చెన్నై సూపర్ కింగ్స్ను (CSK) ఛాంపియన్గా నిలిపిన ‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ (MS Dhoni) వచ్చే ఏడాది ఐపీఎల్లో ఆడటంపై ఇప్పటికీ సందిగ్ధత నెలకొంది. ఆటగాడిగా మైదానంలోకి దిగుతాడా..? సీఎస్కేకు మెంటార్గా వ్యవహరిస్తాడా.? అనేది తేలలేదు. ఒకవేళ ధోనీ తర్వాత కెప్టెన్గా సీఎస్కేను ఎవరు నడిపిస్తారనే ప్రశ్నకు సమాధానం రవీంద్ర జడేజా అని రావడం సహజం. ఎందుకంటే సీఎస్కేలో సీనియర్ ఆటగాడు అతడే. అదేవిధంగా గత వేలంలో భారీ మొత్తం పెట్టి కొనుగోలు చేసిన బెన్ స్టోక్స్ పేరూ వస్తోంది. కానీ, మొన్నటి వరకు సీఎస్కే జట్టు తరఫున ఆడి క్రికెట్కు వీడ్కోలు పలికిన అంబటి రాయుడు మాత్రం భవిష్యత్తు సారథిగా ఎవరు ఉంటారనే దానిపై తన విశ్లేషణ వెల్లడించాడు. వీరిద్దరూ కాకుండా ఓ యువ బ్యాటర్పై అంబటి రాయుడు మొగ్గు చూపడం విశేషం.
‘500’ వికెట్ల క్లబ్లో అశ్విన్ - జడేజా.. వారిద్దరి రికార్డుపై కన్ను !
‘‘ఇప్పుడికిప్పుడే సీఎస్కే సారథ్యంపై మాట్లాడటం లేదు. కానీ, భవిష్యత్తులో మాత్రం రుతురాజ్కు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అతడిలో నాయకత్వ లక్షణాలు పుష్కలం. మహీ భాయ్ నాయకత్వంలో అతడు ఓ ఏడాదిపాటు ఎదిగితే.. తప్పకుండా ఓ పదేళ్లపాటు సీఎస్కేను నడిపించగల సత్తా అతడికి ఉంది. ధోనీ, ఫ్లెమింగ్ వంటి దిగ్గజాల మార్గనిర్దేశంలో రుతురాజ్ రాటుదేలతాడు. అద్భుతమైన టాలెంట్ కలిగిన అతడు ధోనీలా నిశ్శబ్దంగా ముందుకు సాగుతాడు. భారత్ జట్టు తరఫునా అన్ని ఫార్మాట్లు ఆటగలడు. తప్పకుండా మరిన్ని అవకాశాలు వస్తాయని భావిస్తున్నా’’ అని అంబటి తెలిపాడు.
ఐపీఎల్ 2023 సీజన్లో రుతురాజ్ గైక్వాడ్ 16 మ్యాచుల్లో 590 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీతోపాటు 14 అర్ధశతకాలు ఉన్నాయి. తాజాగా ఆసియా గేమ్స్ కోసం ప్రకటించిన జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ నడిపిస్తాడు. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 8 వరకు చైనా వేదికగా జరగనున్న ఆసియా గేమ్స్లో టీమ్ఇండియా పాల్గొంటోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు