CSK: అతడే సీఎస్కే భవిష్యత్తు కెప్టెన్: అంబటి రాయుడు
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో (IPL) అత్యంత విజయవంతమైన జట్టు చెన్నై సూపర్ కింగ్స్ (CSK). ఎంఎస్ ధోనీ నాయకత్వంలో ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచింది. అయితే, అతడి తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు ఎవరు తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐదుసార్లు చెన్నై సూపర్ కింగ్స్ను (CSK) ఛాంపియన్గా నిలిపిన ‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ (MS Dhoni) వచ్చే ఏడాది ఐపీఎల్లో ఆడటంపై ఇప్పటికీ సందిగ్ధత నెలకొంది. ఆటగాడిగా మైదానంలోకి దిగుతాడా..? సీఎస్కేకు మెంటార్గా వ్యవహరిస్తాడా.? అనేది తేలలేదు. ఒకవేళ ధోనీ తర్వాత కెప్టెన్గా సీఎస్కేను ఎవరు నడిపిస్తారనే ప్రశ్నకు సమాధానం రవీంద్ర జడేజా అని రావడం సహజం. ఎందుకంటే సీఎస్కేలో సీనియర్ ఆటగాడు అతడే. అదేవిధంగా గత వేలంలో భారీ మొత్తం పెట్టి కొనుగోలు చేసిన బెన్ స్టోక్స్ పేరూ వస్తోంది. కానీ, మొన్నటి వరకు సీఎస్కే జట్టు తరఫున ఆడి క్రికెట్కు వీడ్కోలు పలికిన అంబటి రాయుడు మాత్రం భవిష్యత్తు సారథిగా ఎవరు ఉంటారనే దానిపై తన విశ్లేషణ వెల్లడించాడు. వీరిద్దరూ కాకుండా ఓ యువ బ్యాటర్పై అంబటి రాయుడు మొగ్గు చూపడం విశేషం.
‘500’ వికెట్ల క్లబ్లో అశ్విన్ - జడేజా.. వారిద్దరి రికార్డుపై కన్ను !
‘‘ఇప్పుడికిప్పుడే సీఎస్కే సారథ్యంపై మాట్లాడటం లేదు. కానీ, భవిష్యత్తులో మాత్రం రుతురాజ్కు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అతడిలో నాయకత్వ లక్షణాలు పుష్కలం. మహీ భాయ్ నాయకత్వంలో అతడు ఓ ఏడాదిపాటు ఎదిగితే.. తప్పకుండా ఓ పదేళ్లపాటు సీఎస్కేను నడిపించగల సత్తా అతడికి ఉంది. ధోనీ, ఫ్లెమింగ్ వంటి దిగ్గజాల మార్గనిర్దేశంలో రుతురాజ్ రాటుదేలతాడు. అద్భుతమైన టాలెంట్ కలిగిన అతడు ధోనీలా నిశ్శబ్దంగా ముందుకు సాగుతాడు. భారత్ జట్టు తరఫునా అన్ని ఫార్మాట్లు ఆటగలడు. తప్పకుండా మరిన్ని అవకాశాలు వస్తాయని భావిస్తున్నా’’ అని అంబటి తెలిపాడు.
ఐపీఎల్ 2023 సీజన్లో రుతురాజ్ గైక్వాడ్ 16 మ్యాచుల్లో 590 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీతోపాటు 14 అర్ధశతకాలు ఉన్నాయి. తాజాగా ఆసియా గేమ్స్ కోసం ప్రకటించిన జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ నడిపిస్తాడు. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 8 వరకు చైనా వేదికగా జరగనున్న ఆసియా గేమ్స్లో టీమ్ఇండియా పాల్గొంటోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
-
రంగంలోకి బైడెన్.. గాజాలోకి మరింత సాయానికి ఇజ్రాయెల్ అనుమతి
-
యూపీఎస్సీ ఫలితాల్లో టీ మాస్టర్ కుమారుడి సత్తా
-
డబ్బన్నావ్.. డబ్బాకొట్టుకున్నావ్!!
-
‘ప్రభుత్వానికి భజన చేస్తూ.. కొన్ని సంఘాలు దిగజారాయి’
-
అంతా సొంత డబ్బా.. హామీలపై మాట్లాడరేమబ్బా!