WI v IND: ‘500’ వికెట్ల క్లబ్లో అశ్విన్ - జడేజా.. వారిద్దరి రికార్డుపై కన్ను !
విండీస్తో జరిగిన రెండో టెస్టులో ఇప్పటి వరకు 500 వికెట్లు తీసిన రెండో జోడీగా అశ్విన్, రవీంద్ర జడేజా నిలిచారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్కు 90వ దశకంలో టాప్ స్పిన్నర్ అంటే అనిల్ కుంబ్లేనే..! కొన్నాళ్లకు హర్భజన్ తోడయ్యాడు. ఈ జోడి తర్వాత ఎవరా..? అనే ప్రశ్నకు సమాధానంగా మరో ఇద్దరు స్పిన్నర్లు అదరగొట్టేస్తున్నారు. వారే రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా. కుడి, ఎడమ చేతివాటం కలిగిన వీరిద్దరూ జట్టులో ఉంటే.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా విజయం సాధించేలా పోరాడతారు. ఈ క్రమంలో వీరిద్దరూ అరుదైన ఘనతను సాధించారు. ఇప్పటి వరకు 500 వికెట్లు తీసిన రెండో జోడీగా అశ్విన్ (Ashwin), రవీంద్ర జడేజా (Ravindra Jadeja) నిలిచారు. అనిల్ కుంబ్లే - హర్భజన్ సింగ్ (Anil Kumble-Harbhajan Singh) కలిసి 501 వికెట్లు తీశారు. ప్రస్తుతం విండీస్తో జరుగుతున్న రెండో టెస్టు సెకండ్ ఇన్నింగ్స్లో మరో రెండు వికెట్లు పడగొడితే వారి రికార్డును అశ్విన్- జడేజా జోడీ అధిగమించేస్తుంది.
అశ్విన్, జడేజా కలిసి ఆడిన 49వ టెస్టులో 500 వికెట్ల మైలురాయిని చేరుకొన్నారు. ఇందులో అశ్విన్ 274 వికెట్లు, జడేజా 226 వికెట్లు పడగొట్టారు. ఈ జోడీ ఇప్పటి వరకు కలిసి ఆడిన టెస్టుల్లో 32 సార్లు 5 వికెట్ల ప్రదర్శన, 8 సార్లు 10+ వికెట్ల ప్రదర్శన చేశారు. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సందర్భంగా జడేజాతో కలిసి బౌలింగ్ చేయడంపై అశ్విన్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ‘అతడు అద్భుతమైన ఆటగాడు. అలాంటి బౌలర్తో బౌలింగ్ చేయడం బాగుంటుంది’ అని అన్నాడు.
అత్యధిక వికెట్లు వీరివే..
- అనిల్ కుంబ్లే (281), హర్భజన్ సింగ్ (220) - 54 టెస్టుల్లో 501
- అశ్విన్ (274), రవీంద్ర జడేజా (226) - 49 టెస్టుల్లో 500*
- బిషన్ బేడీ (184), బిఎస్ చంద్రశేఖర్ (184) - 42 టెస్టుల్లో 368
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఛెత్రి ఇక చాలని..
ఈ తరానికి భారత ఫుట్బాల్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు సునీల్ ఛెత్రి. ఎన్నో చిరస్మరణీయ ప్రదర్శనలతో దేశంలో ఆటకు దాదాపు పర్యాయపదంగా మారిన సూపర్స్టార్ అతడు. కానీ మైదానంలో అతడి పరుగు ఆగనుంది. -
రిటైరైతే కనపడను..
క్రికెట్లో ఉన్నంత కాలం శక్తినంతా ధార పోస్తానని, ఒక్కసారి రిటైరైతే కొంతకాలం ఎవరికీ కనపడనని కింగ్ కోహ్లి అన్నాడు. ఐపీఎల్లో జోరుమీదున్న కోహ్లి ఇప్పటివరకు బెంగళూరు తరఫున 13 మ్యాచ్ల్లో 661 పరుగులు చేశాడు. -
వరుణుడు ఆడుకున్నాడు
ఐపీఎల్-17వ సీజన్లో రసవత్తరంగా మారిన ప్లేఆఫ్స్ రేసును వరుణుడు చప్పగా మార్చేశాడు. పరుగుల పోటీ లేకుండానే సన్రైజర్స్ హైదరాబాద్ను తర్వాతి దశకు చేర్చేశాడు. -
శ్రీజ.. సింగిల్స్లోనూ
తెలుగుతేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్లోనూ పారిస్ ఒలింపిక్స్ బరిలో నిలవనుంది. -
క్వార్టర్ఫైనల్లో మీరాబా
థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్ మీరాబా లువాంగ్ మైసనాం జోరు కొనసాగుతోంది. -
ఫైనల్లో నిఖత్
ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ ఎల్డోర్ కప్ ఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం మహిళల 52 కిలోల సెమీఫైనల్లో ఆమె 5-0తో కజకిస్థాన్ అమ్మాయి తొమిరిస్ మిర్జాకుల్ను చిత్తు చేసింది. -
భారత ఫుట్బాల్ గుండెచప్పుడు
సునీల్ ఛెత్రి.. భారత ఫుట్బాల్ గుండె చప్పుడు! దాదాపు రెండు దశబ్దాల పాటు అత్యుత్తమ ఆటతో జట్టు భారాన్ని మోసిన వీరుడు. మెరుపు విన్యాసాలతో అభిమానులను మైదానాలకు ఆకర్షించిన సమ్మోహన శక్తి. -
అంజుమ్, స్వప్నిల్ విజయం
ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్లో అంజుమ్ మౌద్గిల్, స్వప్నిల్ కుశాలె తమ తొలి విజయాలు సాధించారు. మహిళలు, పురుషుల 50మీ 3 పొజిషన్స్లో వాళ్లు విజేతగా నిలిచారు. -
చెన్నైకి గోల్డెన్ ఛాన్స్.. ఇలా జరిగితే ఏకంగా రెండో స్థానానికే!
ఐపీఎల్ 17 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ఇంకా ప్లేఆఫ్స్కు చేరలేదు. ఆ జట్టు మరో విజయం సాధించి ఇతర జట్ల ఫలితాల అనుకూలిస్తే రెండో స్థానానికి చేరడానికి ఛాన్స్ ఉంది.