Gautam Gambhir: గంభీర్ నెక్ట్స్ టార్గెట్ అదే.. ప్రధాన కోచ్ రూమర్స్కు చెక్!
ప్రధాన కోచ్ పదవిలోకి గంభీర్ వస్తాడని జరుగుతున్న ప్రచారానికి ఇక తెరపడినట్లే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో గంభీర్ చేసిన వ్యాఖ్యలే దీనికి కారణం.
ఇంటర్నెట్ డెస్క్: భారత ప్రధాన కోచ్గా రాహుల్ ద్రవిడ్ స్థానంలో గౌతమ్ గంభీర్ నియామకం అయిపోయిందనే వార్తలు వచ్చాయి. టీ20 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత.. జులై 1 నుంచి కొత్త కోచ్ బాధ్యతలు చేపడతాడని ఇప్పటికే బీసీసీఐ వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రముఖులు ఎవరు దరఖాస్తు చేశారనేది ఇంకా తెలియలేదు. కేకేఆర్ మూడోసారి ఐపీఎల్ ఛాంపియన్గా నిలిచిన తర్వాత ఓ ఇంటర్వ్యూలో గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. దీంతో అతడు ఈసారి కోచ్గా వచ్చేందుకు మొగ్గు చూపడం లేదని ఈ వ్యాఖ్యలనుబట్టి తెలుస్తోంది.
‘‘మేం ఇప్పటికి మూడు టైటిళ్లను సాధించాం. ముంబయి, చెన్నై కంటే ఇంకా రెండు కప్లను వెనుకబడే ఉన్నాం. ఇప్పుడు విజేతలుగా నిలిచినా.. మా టైటిళ్ల వేట కొనసాగుతుంది. ఇప్పటికీ ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్ల జాబితాలో మేం లేము. అలా జరగాలంటే మరో మూడు సార్లు ఛాంపియన్గా నిలవాలి. దాని కోసం తీవ్రంగా కష్టపడాలి. మా తదుపరి లక్ష్యం అదే. ఐపీఎల్లో విజయవంతమైన జట్టుగా కేకేఆర్ను నిలపడం కంటే గొప్ప అనుభూతి మరొకటి ఉండదు. ఇప్పుడు జర్నీ ప్రారంభమైంది’’ అని గంభీర్ తెలిపాడు.
నరైన్ అలా అడిగాడు..
సునీల్ నరైన్ తనకు సోదరుడిలాంటి వాడని, 2012 సీజన్లో మొదటిసారి ఓ ప్రశ్న అడిగినట్లు గంభీర్ గుర్తు చేసుకున్నాడు. ‘‘క్యారెక్టర్ విషయంలో నరైన్కు నాకు చాలా దగ్గరి పోలికలు ఉంటాయి. ఐపీఎల్లోకి అతడు 2012లో తొలిసారి అడుగు పెట్టాడు. నాకు ఇప్పటికీ గుర్తుంది జైపుర్లో ప్రాక్టీస్ చేసిన తర్వాత లంచ్కు రమ్మని చెప్పా. అతడు చాలా సిగ్గుపడుతుంటాడు. లంచ్ సమయంలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ తర్వాత ఒకే ఒక్క ప్రశ్న అడిగాడు. ‘నేను నా గర్ల్ఫ్రెండ్ను ఐపీఎల్కు తీసుకురావచ్చా?’ తొలి సీజన్ కావడంతో కాస్త భయపడ్డాడు. తర్వాతి నుంచి అద్భుతమైన ఆటతీరుతో జట్టులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. నేనెప్పుడూ అతడిని జట్టు సభ్యుడిగా చూడను. ఒక సోదరుడిగానే భావిస్తా. ఏ అవసరం వచ్చినా ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉంటాం. కేవలం కోల్కతాకే కాకుండా టోర్నీకే అతడు అత్యంత విలువైన ఆటగాడు. భవిష్యత్తులోనూ చాలా క్రికెట్ ఆడగలడు’’ అని కేకేఆర్ మెంటార్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అంత డబ్బు నా వద్ద లేదు: జాన్వీకపూర్
-
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
-
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
-
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
-
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్