WI vs IND: విండీస్లో కొత్త నీరెక్కువ.. మరి భారత్కు పోటీ ఇవ్వగలదా..?
బుధవారం నుంచి విండీస్తో భారత్ రెండు టెస్టుల (WI vs IND) సిరీస్ ప్రారంభం కానుంది. ఇటీవల వన్డే ప్రపంచ కప్ క్వాలిఫయర్స్లోనూ విండీస్ విఫలమై అర్హత సాధించలేకపోయింది. ఈ క్రమంలో టెస్టు సిరీస్ ఆడేందుకు సిద్ధమైన విండీస్ ఏమేర రాణిస్తుందనేది ప్రశ్నార్థకమే!
‘‘మా జట్టులోని యువ ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తారు. తప్పకుండా భారత్కు పోటీనిస్తాం’’ ఇవీ విండీస్ మెంటార్ బ్రియాన్ లారా వ్యాఖ్యలు.
జట్టులోని ఆటగాళ్లను ఉత్సాహపరచడానికి, మానసికంగా ధైర్యం నింపడానికే లారా అలా వ్యాఖ్యానించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటింగ్ లైనప్ కలిగిన భారత్ను ఎదుర్కోవడం తేలికైన విషయమేం కాదు. విండీస్ స్క్వాడ్లోనూ పేరొందిన ప్లేయర్లూ తక్కువే. అలాంటి వెస్టిండీస్ టీమ్ భారత్కు పోటీనివ్వగలదా..? మరి విండీస్తో ఆడటం వల్ల టీమ్ఇండియాకు కలిగే ప్రయోజనాలు ఏంటో ఓ సారి పరిశీలిద్దాం..
ఇప్పటి వరకు ఇరు జట్లు 98 టెస్టుల్లో తలపడ్డాయి. ఇందులో భారత్ 22 మ్యాచ్లు, విండీస్ 30 మ్యాచుల్లో గెలిచాయి. మిగిలిన 46 డ్రాగా ముగిశాయి. ఇదంతా గతం.. 1990ల వరకు విండీస్ జట్టంటే ప్రత్యర్థికి వణుకు పుట్టేదే. రిచర్డ్స్, క్లైవ్లాయిడ్, సోబెర్స్, గ్రీనిడ్జ్, ఆంబ్రోస్, కోట్నీ వాల్ష్ వంటి భీకరమైన బ్యాటర్లు, బౌలర్లు ఆ జట్టులో ఉండేవారు. ఆ తర్వాత చంద్రపాల్, లారా, జిమ్మీ ఆడమ్స్, కార్ల్ హోపర్, శర్వాన్, బ్రావో, గేల్, రామ్దిన్ వంటి ఆటగాళ్లు విండీస్ క్రికెట్ చరిత్రను కొనసాగించారు. ఇప్పుడు మాత్రం దాదాపు కొత్తవారితోనే మళ్లీ క్రికెట్ను ఆడుతున్నట్లుగా విండీస్ పరిస్థితి తయారైంది.
నలుగురు మాత్రమే కాస్త..
విండీస్ జట్టులో నలుగురు మాత్రమే భారత క్రికెటర్లకు పరిచయమున్న క్రికెటర్లు. వారిలో కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్వైట్ (85 టెస్టులు), జాసన్ హోల్డర్ (65 టెస్టులు), అల్జారీ జోసెఫ్ (28 టెస్టులు), కీమర్ రోచ్ (77 టెస్టులు) ఉన్నారు. బ్లాక్వుడ్ కూడా 54 టెస్టులు ఆడినప్పటికీ.. మనకు కొంచెం కొత్తే. ఇక భారీకాయుడు రకీమ్ కార్న్వాల్ ఆడింది తక్కువ మ్యాచ్లే కానీ ఫేమస్ అయిపోయాడు. అల్జారీ, కీమర్, జాసన్లను ఎదుర్కోవడం భారత బ్యాటర్లకు పరీక్షే. మిగతా ఆటగాళ్లు ఎలా ఆడతారనేది టీమ్ఇండియా అంచనా వేయడం కష్టమే. కాబట్టి, భారత ఆటగాళ్లు తేలికగా తీసుకోకుండా ఆడితేనే విజయం సాధించేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది.
భారత్కు ప్రయోజనం ఏంటి?
కొత్త ఆటగాళ్లతో కూడిన విండీస్తో తలపడటం వల్ల భారత్కు కలిగే ప్రయోజనం ఏంటనేది సగటు క్రికెట్ అభిమానికి వచ్చే సందేహం. టీమ్ఇండియా జట్టులో అనుభవజ్ఞులే ఎక్కువ. అలాగే యువ క్రికెటర్లకూ ఈసారి అవకాశం దక్కింది. రోహిత్, గిల్, విరాట్, రహానె వంటి సూపర్ బ్యాటర్లతోపాటు యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రీకర్ భరత్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. తుది జట్టులోకి వచ్చే యంగ్ క్రికెటర్లకు ఇదొక మంచి ఛాన్స్. సిరాజ్ నేతృత్వంలోని పేస్ దళంలో జయ్దేవ్ ఉనద్కత్, నవ్దీప్ సైని, ముకేశ్ కుమార్ ఉన్నారు.
తమను నిరూపించుకుని తదుపరి సిరీస్ల కోసం రేసులో ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఛెతేశ్వర్ పుజారా ఈ సిరీస్కు దూరమైన సంగతి తెలిసిందే. ఓ రెండేళ్లలో సీనియర్లు ఒక్కొక్కరు ఆటను వదిలేసే అవకాశం నేపథ్యంలో వారికి ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ఈ సిరీస్ చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే కెప్టెన్ రోహిత్ శర్మ తన ఫామ్ను అందిపుచ్చుకోవడానికి టెస్టు సిరీస్ను వినియోగించుకోవాలి. లేకపోతే భవిష్యత్తులో అతడిపై వేటు పడే అవకాశాలూ లేకపోలేదు. ఇక ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2023 -25 సీజన్లోనూ ఫైనల్కు చేరాలంటే విజయాలు సాధించడం ముఖ్యం.
సచిన్ సరసన కోహ్లీ
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనతలోకి చేరనున్నాడు. తుది జట్టులో విండీస్ ఆటగాడు త్యాగ్నారాయణ్ చంద్రపాల్ వస్తే.. తండ్రీకుమారుడితో ఆడిన ఆటగాడిగా విరాట్ మారతాడు. పన్నెండేళ్ల కిందట తొలిసారి టెస్టుల్లోకి అడుగు పెట్టినప్పుడు విరాట్ విండీస్ ఆటగాడు శివనారాయణ్ చంద్రపాల్తో ఆడాడు. ఇప్పుడు త్యాగ్నారాయణ్తో కూడా కలిసి ఆడితే విరాట్ కోహ్లీ క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ సరసన చేరతాడు. 1992లో ఆసీస్ మాజీ ఆటగాడు జెఫ్ మార్ష్తో తలపడిన సచిన్.. 2011/12 సమయంలోఆయన కుమారుడు షాన్ మార్ష్తో కూడా ఆడటం విశేషం.
స్క్వాడ్లు ఇవే:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానె, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శ్రీకర్ భరత్, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, జయ్దేవ్ ఉనద్కత్, నవ్దీప్ సైని, ముఖేశ్ కుమార్.
విండీస్: క్రెయిగ్ బ్రాత్వైట్ (కెప్టెన్), జెర్మైన్ బ్లాక్వుడ్ (వైస్ కెప్టెన్), అలిక్ అథనేజ్, త్యాగ్నారాయణ్ చంద్రపాల్, రఖీమ్ కార్న్వాల్, జోష్వా ద సిల్వా, షనోన్ గాబ్రియల్, జేసన్ హోల్డర్, అల్జారి జోసెఫ్, కిర్క్ మెకంజీ, రేమన్ రీఫర్, కీమర్ రోచ్, జోమెల్ వారికన్ రిజర్వ్ ఆటగాళ్లు: టెవిన్ ఇమ్లాచ్, అకీమ్ జోర్డాన్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన