Andre Russell: ‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: కోల్కతా కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై నమీబియా ఆటగాడు డేవిడ్ వీజ్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో వైరల్గా మారాయి. చంద్రకాంత్కు దేశవాళీ క్రికెట్లో ఎంతోమందికి శిక్షణ ఇచ్చిన అనుభవం ఉంది. అతడివి మిలిటరీ తరహా కోచింగ్ పద్ధతులంటూ వీజ్ చేసిన వ్యాఖ్యలపై కోల్కతా స్టార్ ఆల్రౌండర్ ఆండ్రి రస్సెల్ స్పందించాడు. ఒక్కో కోచ్ శైలి భిన్నంగా ఉంటుందని.. చంద్రకాంత్కు రస్సెల్ మద్దతుగా నిలిచాడు.
‘‘మేం గతేడాది నుంచి అతడితో కలిసి పనిచేస్తున్నాం. కొత్తగా ఎవరైనా కోచ్ పాత్రకు వచ్చినప్పుడు మొదట్లో ఇబ్బందులు ఉంటాయి. సర్దుకోవడానికి కాస్త సమయం పడుతుంది. మనమంతా ప్రొఫెషనల్ క్రికెటర్లం. కోచ్ల ప్రణాళికలకు అనుగుణంగా మారాలి. అంతేకానీ, వారిపై ఫిర్యాదులు చేయడం సరైంది కాదు. ఫ్రాంచైజీ కోసం నావంతు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటా. అలాగే కోచ్గా ఆయన కూడా అద్భుత పాత్ర పోషిస్తున్నారు. తప్పకుండా ఈ సీజన్లో మెరుగైన ప్రదర్శన చేస్తాం’’ అని ఆండ్రి రస్సెల్ వ్యాఖ్యానించాడు.
బెంగళూరుతో కోల్కతా పోరు
ఐపీఎల్ 17వ సీజన్లో కోల్కతా రెండో మ్యాచ్కు సిద్ధమైంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా బెంగళూరును ఢీకొట్టనుంది. సొంతమైదానంలో దూకుడైన ఆటతీరుతో పంజాబ్ను మట్టికరిపించిన బెంగళూరును అడ్డుకోవాలంటే కోల్కతా ఇంకాస్త శ్రమించాలి. హైదరాబాద్తో మ్యాచ్లో ఫిన్ సాల్ట్ (54) మినహా కోల్కతా టాప్ఆర్డర్ విఫలమైంది. లోయర్ ఆర్డర్లో ఆండ్రి రస్సెల్ (64*)తోపాటు నమన్ దీప్ (35), రింకు సింగ్ (23) రాణించడంతో 200+ స్కోరు చేయగలిగింది. ఇటు బౌలింగ్లోనూ హర్షిత్ రాణా చివరి ఓవర్లో మ్యాజిక్ చేయడంతో స్వల్ప తేడాతో గట్టెక్కింది. ఐపీఎల్ మినీ వేలంలో భారీ మొత్తం దక్కించుకున్న మిచెల్ స్టార్క్ ఘోరంగా విఫలం కావడం ఆ జట్టును కలవరానికి గురి చేస్తోంది. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా ధారాళంగా పరుగులు సమర్పించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్ 17వ సీజన్లో భారీ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైంది. 200+ కాకుండా.. 250+ స్కోరుకూడా దాటిపోవడం గమనార్హం. -
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?నేడు జట్టును ప్రకటించే అవకాశం
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో