Sunil Gavaskar: ఆండ్రి రస్సెల్ బెస్ట్.. కానీ, గంభీర్ రావడమే కోల్కతాకు ప్లస్: సునీల్ గావస్కర్
హైదరాబాద్పై కోల్కతా విజయం సాధించడంలో ఆండ్రి రస్సెల్ కీలక పాత్ర పోషించాడు. ఇటు బ్యాటింగ్తోపాటు బౌలింగ్లోనూ రాణించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్లో కోల్కతా బోణీ కొట్టింది. ఉత్కంఠపోరులో హైదరాబాద్పై విజయం సాధించింది. బ్యాటింగ్లో ఆండ్రి రస్సెల్ దూకుడైన ఆటతీరు ప్రదర్శించాడు. కేవలం 25 బంతుల్లోనే 64 పరుగులు చేశాడు. ఇందులో 7 సిక్స్లు ఉన్నాయి. బౌలింగ్లోనూ 2 వికెట్లు తీశాడు. కోల్కతా విజయంలో రస్సెల్ కీలక పాత్ర పోషించినప్పటికీ.. మెంటార్గా గంభీర్ తిరిగి రావడమే ఆ జట్టుకు బలంగా మారిందని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ వ్యాఖ్యానించాడు.
‘‘ఆండ్రి రస్సెల్ బాగా ఆడాడు. టాప్ ఆర్డర్లో కొందరు విఫలమైనప్పటికీ దూకుడైన బ్యాటింగ్తో కోల్కతాకు భారీ స్కోరు అందించాడు. అయితే, ఇక్కడ మరో అంశం గమనించాల్సి ఉంది. గంభీర్ మళ్లీ మెంటార్గా వచ్చిన తర్వాత కోల్కతాకు తొలి విజయం. అలాగే గత సీజన్లో పెద్దగా మెప్పించని రస్సెల్ నుంచి కీలక ఇన్నింగ్స్. తదుపరి మ్యాచుల్లోనూ రస్సెల్ ఇదే ఆటతీరును ప్రదర్శించాల్సి ఉంటుంది. ఒక వేళ విఫలమైతే మాత్రం గంభీర్పై నిందలు వేయడానికి కొందరు సిద్ధంగా ఉంటారు. ఈ మ్యాచ్లో రస్సెల్ బ్యాటింగ్ అద్భుతం. భువనేశ్వర్ కుమార్ వంటి సీనియర్ బౌలర్ స్లో యార్కర్లను అద్భుతంగా సంధిస్తాడు. ప్రాక్టీస్ సెషన్స్లోనూ ఎక్కువగా సాధన చేశాడు. కానీ, మ్యాచ్లో మాత్రం లెగ్సైడ్ వేయడంతో రస్సెల్కు ఈజీ అయిపోయింది. స్టాండ్స్లో బంతిని పంపే అతడిలాంటి భయకరమైన హిట్టర్కు బౌలింగ్ వేయడం కష్టమే’’ అని గావస్కర్ తెలిపాడు.
గత రెండేళ్లు ఇబ్బంది పడ్డా: రస్సెల్
‘‘బంతిని బలంగా బాదేందుకు ప్రయత్నించి గతంలో ఔటయ్యేవాడిని. అలా కాకుండా సరైన పద్ధతిలో హిట్టింగ్ చేయాలని తెలుసుకున్నా. గత రెండేళ్లుగా బౌలర్లు నాపై తమ ప్రణాళికలను సరిగ్గా అమలు చేయగలిగారు. పరుగుల కోసం నేను ఇబ్బంది పడ్డా. నా కోసం ప్రతి ఒక్కరూ ఏదొక ప్లాన్ వేసుకొని వస్తారని తెలుసు. కోల్కతాతో అనుబంధం మరిచిపోలేనిది. ఇంతకుముందు నేను బెంచ్కే పరిమితమైనప్పటికీ ఏదొకటి నేర్చుకొన్నా. ఈ ఇన్నింగ్స్తో నా జెర్సీకి అర్థం ఉందని నిరూపించుకున్నా. ఇదే ప్రదర్శనను టోర్నీ ఆసాంతం కొనసాగించేందుకు ప్రయత్నిస్తా. హర్షిత్ రాణా బౌలింగ్ బాగుంది. ఒత్తిడిలోనూ ప్రత్యర్థిని కట్టడి చేయడం అద్భుతం’’ అని ఆండ్రి రస్సెల్ వెల్లడించాడు. అతడినే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
హైదరాబాద్లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
అరుదైన ఘనత సాధించిన ‘పొలిమేర2’.. ఆనందంతో దర్శకుడి పోస్ట్
-
మోదీజీ.. ఇంకా మౌనమేనా?: ప్రజ్వల్ అభ్యంతరకర వీడియోలపై ప్రియాంకగాంధీ
-
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు
-
భారీ ధరకు ‘తండేల్’ ఓటీటీ రైట్స్.. చైతూ కెరీర్లో బిగ్ డీల్
-
భారత్లో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్.. ధర, ఫీచర్లివే..!
-
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?