MS Dhoni: ధోనీపై క్రికెటర్ భార్య ఎమోషనల్ పోస్టు..
టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్ఎస్ ధోనీపై తనకున్న అభిమానాన్ని పంచుకున్నారు మరో క్రికెటర్ శివమ్ దూబె భార్య అంజుమ్ ఖాన్.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని అభిమానించని వారు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. ఐపీఎల్లో చెన్నై ఎక్కడ ఆడినా అతడిని చూడటానికే అభిమానులు వస్తున్నారంటే ఆ క్రేజ్ మాటల్లో చెప్పలేం. తాజాగా జట్టు సహచరుడు శివమ్ దూబె భార్య అంజుమ్ ఖాన్ (Anjum Khan) సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్టు నెటిజన్లను ఆకట్టుకుంది.
‘‘మహీ టీమిండియాకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న రోజులవి. మొదటిసారి ఓ న్యూస్ ఛానెల్లో ధోనీ పేరు విన్నా. అతని గురించి తెలియనంత వరకు నాకు క్రికెట్ అంటే ఇష్టం మాత్రమే ఉండేది. కానీ, నాకు తెలియకుండానే నాడు ఆ ఇంటర్వ్యూ మొత్తం ఎందుకు చూశానో తెలియదు. అది సాధారణంగా అనిపించలేదు. అప్పటి నుంచి ఇప్పటివరకు క్రికెట్ మ్యాచ్లన్నీ చూస్తుంటా. ధోనీ ఆడే మ్యాచ్ను మాత్రం అసలు మిస్సవ్వను. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు మహీ ఉంటే గెలిపిస్తాడనే ధైర్యం ఉంటుంది. ధోనీ అంటే క్రికెట్.. క్రికెట్ అంటే ధోనీ’’ అని పోస్టు చేశారు.
ధోనీ కోసం ఇంకాస్త అరుస్తా..
‘‘మొదటి సారి ధోనీని చూసినప్పుడు పొడవాటి హెయిర్ స్టైల్తో కనిపించారు. అప్పుడు నాకు నా బాల్యం గుర్తుకు వచ్చింది. ఎంతో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యా. ఆయనను కలవాలనే ఆశ నా భర్త శివమ్ ద్వారా నెరవేరింది. మ్యాచ్ జరుగుతుండగా.. శివమ్కు మద్దతుగా అరుస్తూ ఉండేదాన్ని. కానీ, అక్కడ ధోనీ ఉంటే మాత్రం ఇంకాస్త ఎక్కువగానే కేకలు వేస్తుంటా. ఆయన టీమ్లో శివమ్ కూడా ఉండాలని నా కోరిక. ఆయన నుంచి ఎంతో నేర్చుకోవాలి’’ అని పంచుకున్నారు. అంజుమ్ పెట్టిన పోస్టు నెట్టింట వైరల్గా మారింది.
సగం IPL పూర్తి.. బాదుడు నుంచి ఫ్లైయింగ్ కిస్ వరకు... ఆసక్తికర విశేషాలివే!
‘అంజుమ్.. ఈ రోజు మీరూ మా అభిమానాన్ని గెలుచుకున్నారు’, ‘మీరు ఎంతో భావోద్వేగంగా ఈ పోస్టు పెట్టినట్లు అర్థమవుతోంది’’ అంటూ పలువురు కామెంట్లు పెట్టారు. శివమ్ దూబె, అంజుమ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
కమలా.. మా మద్దతు మీకే
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)