IPL 2024: సగం IPL పూర్తి.. బాదుడు నుంచి ఫ్లైయింగ్ కిస్ వరకు... ఆసక్తికర విశేషాలివే!
సుదీర్ఘమైన ఐపీఎల్ టోర్నీలో సగం మ్యాచ్లు ముగిశాయి. అనూహ్యంగా కొన్ని జట్లు చెలరేగగా.. మరికొన్ని డీలా పడిపోయి పాయింట్ల పట్టికలో అడుగుకు చేరాయి.
ఇంటర్నెట్ డెస్క్: ధోనీ నామస్మరణ.. విరాట్ దూకుడు.. హైదరాబాద్ రికార్డులు.. ముంబయి కెప్టెన్సీ ట్రోలింగ్.. ఇవీ ఇప్పటి వరకు ఐపీఎల్ 17వ సీజన్లో అభిమానులను అలరించిన అంశాలు. ఈ ఎడిషన్లో సగం మ్యాచ్లు పూర్తైన నేపథ్యంలో ఆసక్తికర విశేషాలు ఇవే
హైదరా ‘బాదు’డు
గత రెండు సీజన్లతో పోలిస్తే.. ఈసారి సరికొత్త సన్రైజర్స్ను చూసినట్లుంది. బ్యాటర్లు ‘రికార్డు’లు తిరగరాసే పనిలో ఉన్నారు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు (287/3) చేసిన జట్టుగా ఈ ఏడాది హైదరాబాద్ చరిత్ర సృష్టించింది. 277/3తో తొలుత బద్దలు కొట్టగా... దానిని మళ్లీ తానే 287తో బ్రేక్ చేసింది. తాజాగా దిల్లీపైనా 266 రన్స్ చేయడం విశేషం. మరోవైపు కోల్కతా 272/7, బెంగళూరు 263/5 కూడా భారీ స్కోర్లు చేశాయి.
ధోనీ స్పెషల్
ధోనీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం అతడి ఆటను చూడటానికే వచ్చామా? అన్నట్లుగా అభిమానులు ఈ ఏడాది హోరెత్తిస్తున్నారు. చెన్నై ఆడిన మైదానం పసుపుమయం కావడం గమనార్హం. ఐపీఎల్లో బదులు డీపీఎల్ (ధోనీ ప్రీమియర్ లీగ్)గా మారిపోయింది అనే కామెంట్లూ వినిపించాయి. వచ్చిన వారిని నిరాశపరచకుండా ఆఖర్లో బ్యాటింగ్కు వచ్చి భారీ సిక్స్లతో రెచ్చిపోయాడీ ‘కెప్టెన్ కూల్’. అతడు బ్యాటింగ్కు వచ్చే వేళ అభిమానుల హోరు 95 డెసిబుల్స్ను దాటిందని డికాక్ సతీమణి సాషా ఇన్స్టాలో చేసిన పోస్టు సంచలనం సృష్టించింది.
బౌలింగ్ ఫట్.. విరాట్ హిట్
‘ఈసాలా కప్ నమదే’.. ఏటా వినిపించే ఈ నినాదం బెంగళూరు అభిమానుల నుంచి ఈ ఏడాది రావడం లేదు. కారణం ఏడింటిలో ఒకటే విజయం. ఆ టీమ్ గురించి కేవలం నాలుగు పదాల్లో చెప్పాలంటే.. ‘బౌలింగ్ ఫట్.. విరాట్ హిట్’. 200+ స్కోరు చేసినా గెలుస్తామనే నమ్మకం లేదు. విరాట్ కోహ్లీ (7 మ్యాచుల్లో 361) ఆరెంజ్ క్యాప్ రేసులోఉండటమే బెంగళూరుకు ఊరటనిచ్చే అంశం. నా వల్ల కాదు బాబోయ్ అంటూ గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా చేతులెత్తేశాడు. ప్లేఆఫ్స్ ఆశలు కాదు కదా.. బాటమ్ నుంచి కాస్త అయినా టీమ్ పైకొస్తుందా అనేది కూడా డౌటే.
హార్దిక్ - రోహిత్ - ఫ్యాన్స్ ట్రోలింగ్
మ్యాచ్లు ముంబయి ప్రదర్శన కంటే హార్దిక్-రోహిత్ ఫ్యాన్స్ యుద్ధాలను తలపిస్తున్నాయి. ప్రతి స్టేడియంలోనూ పాండ్యకు హేళనలు ఎదురవుతూనే ఉన్నాయి. సరైన వ్యూహాల ఎంపికలో హార్దిక్ విఫలమయ్యాడని కొందరు విమర్శలు గుప్పించారు. ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబయి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. జస్ప్రీత్ బుమ్రాను వినియోగించుకోవడంలో పాండ్య విఫలమవుతున్నాడని కూడా అంటున్నారు. వ్యక్తిగతంగానూ పాండ్య బ్యాటింగ్, బౌలింగ్లో విఫలం కావడం నిరాశకు గురి చేస్తోంది.
మయాంక్కు హర్షిత్ రాణా ఫ్లైయింగ్ కిస్
హైదరాబాద్తో మ్యాచులో కోల్కతా బౌలర్ హర్షిత్ రాణా ప్రవర్తించిన తీరుపై విమర్శలు వచ్చాయి. ఎస్ఆర్హెచ్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ను ఔట్ చేసినప్పుడు ‘ఫ్లైయింగ్ కిస్’ ఇవ్వడం అభిమానుల ఆగ్రహానికి దారితీసింది. అంతకుముందు తన ఓవర్లోనే మయాంక్ సిక్స్, ఫోర్ కొట్టడంతో రాణా ఇలా ప్రవర్తించాడు. అయితే, ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ ఈ చర్యను ఉపేక్షించలేదు. రాణాకు జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. కోల్కతా జట్టులో చాలా సీజన్లుగా విఫలమవుతున్న సునీల్ నరైన్, ఆండ్రి రస్సెల్ ఫామ్ను అందిపుచ్చుకొన్నారు. పాతిక కోట్లు పెట్టి దక్కించుకున్న స్టార్ పేసర్ స్టార్క్ నిరాశపరుస్తున్నాడు.
యశస్వి తడబడగా.. పరాగ్ చెలరేగగా..
ఏడు మ్యాచుల్లో ఆరు విజయాలు సాధించిన ఏకైక జట్టుగా (12 పాయింట్లు) రాజస్థాన్ నిలిచింది. మిగిలిన సగం మ్యాచుల్లో కనీసం మూడు గెలిచినా ఆ జట్టుకు ప్లేఆఫ్స్ బెర్తు ఖాయం. అయితే, ఓపెనర్ యశస్వి జైస్వాల్ తడబాటు ఆందోళన కలిగించే అంశమే. టీ20 ప్రపంచ కప్ జట్టులోకి వస్తాడని భావిస్తున్న క్రమంలో ఫామ్ కోల్పోవడం ఆశ్చర్యంగా ఉంది. ఐపీఎల్ ప్రారంభం ముందు వరకు మంచి ఫామ్తో ఆడిన యశస్వి ఇప్పుడు నిరాశపరుస్తున్నాడు. మరోవైపు అనూహ్యంగా రియాన్ పరాగ్ సక్సెస్ కావడం విశేషం.
సామ్ - జితేశ్ వైస్ కెప్టెన్సీ రగడ
పంజాబ్ పరిస్థితిని చూస్తుంటే జాలేస్తోంది. టోర్నీని అద్భుత విజయంతో ప్రారంభించిన ఆ జట్టు పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉందంటే నమ్మగలమా? ఏడు మ్యాచుల్లో రెండు విజయాలను మాత్రమే సాధించింది. రెగ్యులర్ సారథి శిఖర్ ధావన్ గాయం కారణంగా డగౌట్కే పరిమితం కావడం కూడా ఆ జట్టుకు షాక్. ఇలాంటి క్లిష్ట సమయంలో వైస్ కెప్టెన్సీ రగడ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. జితేశ్ను తొలుత వైస్ కెప్టెన్ అని చెప్పి.. తర్వాత సామ్కి అప్పగించారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయిత గబ్బర్కి డిప్యూటీ సామ్ అని మేనేజ్మెంట్ తేల్చేసింది.
కొత్త పేస్ హీరో
ఈ సీజన్లో భారత క్రికెట్కు మరో పేస్ స్టార్ దొరికాడు. అతడే లఖ్నవూ సీమర్ మయాంక్ యాదవ్. నిలకడగా 150 కి.మీ వేగంతో బంతులేయడం అంత ఈజీ కాదు. కానీ, ఈ కుర్రాడు మాత్రం అలవోకగా చేసి చూపిస్తున్నాడు. ప్రస్తుత సీజన్లో అత్యంత వేగవంతమైన బంతిని (156.7 కి.మీ) విసిరిన బౌలర్ అతనే. అయితే ఇప్పుడు గాయంతో డగౌట్కు పరిమితమయ్యాడు. ఫిట్నెస్ సాధించి మళ్లీ అదే జోరుతో బౌలింగ్ వేస్తే టీ20 ప్రపంచ కప్లో అతడిని బ్యాకప్ పేసర్గా తీసుకున్నా ఆశ్చర్యపడక్కర్లేదు.
జట్టులో పంత్ ఖాయం!
దాదాపు 15 నెలలపాటు క్రికెట్కు దూరంగా ఉన్న పంత్... ఈ సీజన్లో ఆడిన ప్రతి మ్యాచ్లో కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. మిడిలార్డర్లో వచ్చే అతడు ఏడు మ్యాచుల్లో 210 పరుగులు చేశాడు. వీటిలో రెండు హాఫ్ సెంచరీలూ ఉన్నాయి. వరల్డ్ కప్ కోసం స్పెషలిస్ట్ బ్యాటర్ కమ్ వికెట్ కీపర్ కొరత టీమ్ఇండియాకు తీరిపోయినట్లే అని అంచనా వేస్తున్నారు. ఈ విషయం త్వరలో తేలిపోనుంది.
గిల్కి కెప్టెన్సీ కష్టం
గుజరాత్ శుభ్మన్ గిల్ నాయకత్వ అనుభవలేమితో ఇబ్బందిపడుతోంది. వ్యక్తిగత ప్రదర్శనలోనూ విఫలమవుతున్నాడు. మరోవైపు సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ లేకపోవడమూ ఆ జట్టుకు నష్టమే. గత సీజన్లో దూకుడుగా ఆడి పరుగులు చేసిన కేన్ విలియమ్సన్, మాథ్యూ వేడ్, రాహుల్ తెవాతియా, వృద్ధిమాన్ సాహా ఈసారి ప్రభావం చూపించడంలేదు. రషీద్ ఖాన్ ఒంటరి పోరు చేస్తున్నా సరిపోవడం లేదు. మోహిత్కు తోడుగా సరైన మరో పేసర్ రాణించకపోవడం వల్ల గుజరాత్కు ఓటములు తప్పడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వన్డేలు - టీ20ల్లో టీమ్ఇండియాదే అగ్రస్థానం.. టెస్టుల్లో ఆసీస్ నంబర్ వన్
క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన అత్యుత్తమ వార్షిక జట్ల ర్యాంకులను ఐసీసీ ప్రకటించింది. భారత్ ఎప్పటిలానే తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ అగ్రస్థానంలో నిలిచింది. -
ఆ ఒక్కడే.. ఐపీఎల్లో నన్ను భయపెట్టిన బ్యాటర్: గౌతమ్ గంభీర్
ముంబయితో మ్యాచ్కు ముందు ఓ క్రీడా ఛానెల్తో మాట్లాడిన కోల్కతా మెంటార్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో అందరికంటే ఓ బ్యాటర్కు చాలా భయపడేవాడినని పేర్కొన్నాడు. -
రోహిత్ తర్వాత పాండ్యనే కెప్టెన్.. మరింత బాధ్యతగా ఆడాలి: మాజీ క్రికెటర్
వరల్డ్ కప్ కోసం స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యను ఎంపిక చేసిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ.. అతడికే వైస్ కెప్టెన్సీని అప్పగించింది. -
నా స్థాయికి తగ్గ బౌలింగ్ చేయలేకపోయా: ముంబయి స్టార్ ఆల్రౌండర్
ఆల్రౌండర్గా జట్టులోకి వచ్చిన రొమారియో షెఫర్డ్ బౌలర్గా గొప్ప ప్రదర్శనేమీ ఇవ్వడం లేదు. కేవలం రెండు వికెట్లను మాత్రమే పడగొట్టిన అతడు మరోసారి అవకాశం వస్తే చెలరేగుతానని వ్యాఖ్యనించాడు. -
అత్యుత్తమ ఫామ్ అందుకోలేదు... నా బెస్ట్ ఇన్నింగ్స్ ఇది కాదు: రియాన్
రాజస్థాన్ తరఫున అద్భుతంగా ఆడుతున్న రియాన్ పరాగ్ తన ఫామ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హైదరాబాద్పై కీలక ఇన్నింగ్స్ ఆడినా.. తన బెస్ట్ మాత్రం ఇది కాదంటున్నాడు. -
ఆ ముగ్గురి వల్లే మేం గెలిచాం.. ప్రతి ఓవరూ సవాలే: ట్రావిస్ హెడ్
ఉత్కంఠపోరులో రాజస్థాన్ను ఓడించిన హైదరాబాద్ ప్లేఆఫ్స్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. పాయింట్ల పట్టికలో టాప్-4లోకి దూసుకొచ్చింది. -
అన్నీ అనుకున్నట్లే జరగవు.. పాండ్య కెప్టెన్సీలో ఆడటంపై తొలిసారి స్పందించిన రోహిత్
చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో కలిసి నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ముంబయి కెప్టెన్సీపైనా రోహిత్ శర్మ స్పందించాడు. -
ఓటమి లేదా టై.. మేం ఊహించిన ఫలితమిదే: థ్రిల్లింగ్ విక్టరీపై నితీశ్ రెడ్డి
ఐపీఎల్ 17వ సీజన్లో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచుల్లో హైదరాబాద్ - రాజస్థాన్ పోరు నిలుస్తుంది. చివరి బంతి వరకూ సాగిన మ్యాచ్లో సన్రైజర్స్ విజయకేతనం ఎగురవేసింది. -
విజయాన్ని లాగేసుకున్నారు
వారెవ్వా ఏం మ్యాచ్! ఉప్పల్లో ఎన్ని మలుపులో! రాజస్థాన్, హైదరాబాద్లతో గెలుపు దోబూచులాడగా కడ బంతి వరకూ రసవత్తరంగా సాగిన పోరు అభిమానులను ఉర్రూతలూగించింది. హోరాహోరీ పోరులో పట్టువదలని సన్రైజర్స్.. రాయల్స్ నుంచి విజయాన్ని లాగేసుకుంది. -
నితీశ్ నిలకడగా
విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి నిలకడగా రాణిస్తూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. నిరుడు కేవలం పేసర్గా రెండు మ్యాచ్లాడిన అతను.. ఈ సీజన్లో టాప్ఆర్డర్ బ్యాటర్గా సత్తాచాటుతున్నాడు. -
అందుకే నలుగురు స్పిన్నర్లు
టీ20 ప్రపంచకప్కు నలుగురు స్పిన్నర్లు కావాలనే విషయంలో జట్టు మేనేజ్మెంట్ చాలా స్పష్టతతో ఉందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టోర్నీ కోసం 15 మందిని ఖరారు చేయడంలో ఐపీఎల్ పాత్ర స్వల్పమని చెప్పాడు. -
భారత అమ్మాయిలదే సిరీస్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో భారత అమ్మాయిలు దూకుడు కొనసాగిస్తున్నారు. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే అయిదు టీ20ల సిరీస్ను 3-0తో కైవసం చేసుకున్నారు. -
భారత్కు షాక్
రెండేళ్ల కిందట.. ప్రపంచ పురుషుల టీమ్ ఛాంపియన్షిప్గా పరిగణించే థామస్ కప్లో భారత్ అద్భుత విజయం సాధించింది. మొట్టమొదటి సారి ఈ టైటిల్ను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. -
సెమీస్లో నలుగురు భారత బాక్సర్లు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నలుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్కు దూసుకెళ్లారు. గురువారం అండర్-22 విభాగంలో జాదుమణి (51 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), -
మహిళల హాకీ కెప్టెన్గా సలీమా టెటె
గోల్కీపర్ సవిత పునియా స్థానంలో మిడ్ఫీల్డర్ సలీమా టెటె భారత మహిళల హాకీ కెప్టెన్గా నియమితురాలైంది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ బెల్జియం, ఇంగ్లాండ్ అంచెలలో పోటీపడే 24 మంది సభ్యుల భారత జట్టుకు సలీమా నాయకత్వం వహించనుంది. -
పేద చిన్నారుల కోసం బోపన్న
భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు శిక్షణ అందించేందుకు సిద్ధమయ్యాడు. -
పాక్ జట్టులో రవూఫ్
ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో టీ20 సిరీస్లలో తలపడే పాకిస్థాన్ జట్టులో పేసర్ హారిస్ రవూఫ్ చోటు దక్కించుకున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆరంభ మ్యాచ్ల్లో ఆడిన రవూఫ్ ఆ తర్వాత గాయంతో క్రికెట్కు దూరమయ్యాడు. -
వాళ్లకి క్రికెట్ పరిజ్ఞానం లేదేమో: ఏబీ
విరాట్ కోహ్లి స్ట్రైక్రేట్ గురించి.. అతడి ఆటతీరు గురించి మాట్లాడేవాళ్లకు క్రికెట్ పరిజ్ఞానం లేదని అనిపిస్తుందని దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. మిడిల్ ఓవర్లలో విరాట్ సరిగా రాణించలేకపోతున్నాడని..
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
-
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఎన్నికల నేపథ్యంలో.. కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం - సుప్రీంకోర్టు