Wrestling Champion Antim Panghal: అమ్మాయి వద్దనుకుంటే.. ఛాంపియన్ పుట్టింది
రెజ్లింగ్లో అత్యుత్తమ ప్రతిభ చూపిస్తున్న అంతిమ్ చరిత్ర సృష్టించింది. దీని కోసం ఆమెతోపాటు కుటుంబం పడిన కష్టాలు ఎన్నో ఉన్నాయి. అయితే, వరుసగా రెండుసార్లు అండర్ -20 ఛాంపియన్గా మారడంతో పేరు మారుమోగిపోయింది.
రెజ్లింగ్లో అంతిమ్ సంచలన ప్రదర్శన
హరియాణాలోని హిసార్ జిల్లా భాగన గ్రామంలోని ఓ మధ్య తరగతి కుటుంబం. రామ్ నివాస్, కృష్ణ కుమారి దంపతులకు అప్పటికే ముగ్గురు ఆడపిల్లలు. మరో అమ్మాయి వద్దని, అబ్బాయి పుట్టాలని ఆశపడ్డారు. కానీ మళ్లీ ఆడపిల్లే జన్మించింది. ఇక ఆమెనే చివరి అమ్మాయి కావాలనే అర్థం వచ్చేలా ‘అంతిమ్’ అని పేరు పెట్టారు. ఆ తర్వాత అబ్బాయి పుట్టాడు. కానీ అప్పుడు వాళ్లు ఊహించలేదు.. ఆ చివరి అమ్మాయే రెజ్లింగ్లో సంచలనాలు సృష్టిస్తుందని.. ప్రపంచ ఛాంపియన్గా ఎదుగుతుందని! అవును.. ఆ అమ్మాయే అంతిమ్ పంగాల్. వరుసగా రెండు సార్లు అండర్-20 ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన తొలి భారత మహిళా రెజ్లర్.
రెజ్లింగ్కు పేరుగాంచిన హరియాణా నుంచి వచ్చిన 19 ఏళ్ల అంతిమ్ పంగాల్.. మ్యాట్పై అసాధారణ ప్రదర్శనతో అబ్బురపరుస్తోంది. నిరుడు అండర్-20 ప్రపంచ ఛాంపియన్గా నిలిచి.. ఆ ఘనత సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్గా రికార్డు సృష్టించింది. ఆ గెలుపు గాలివాటం కాదంటూ ఈ ఏడాది కూడా 53 కేజీల విభాగంలో టైటిల్ నిలబెట్టుకుని.. వరుసగా రెండు సార్లు అండర్-20 ప్రపంచ ఛాంపియన్షిప్లో పసిడి నెగ్గిన మొట్టమొదటి భారత మహిళా రెజ్లర్గా చరిత్ర నమోదు చేసింది. మొదటి నుంచి అంతిమ్ ఓ పోరాట యోధురాలు. అబ్బాయి కావాలని ఆశపడ్డ తల్లితండ్రులకు నాలుగో ఆడపిల్లగా జన్మించిన ఆమె.. ఆటలోనూ ఎన్నో అడ్డంకులు దాటింది. నాలుగో అమ్మాయిగా ఆమె పుట్టడంతో హరియాణాలో కొనసాగుతున్న ఆచారం ప్రకారం ‘అంతిమ్’ అని పేరు పెట్టారు. అలా పెడితే ఆ తర్వాత అబ్బాయి పుడతాడని అక్కడ నమ్ముతారు. ఆ తర్వాత ఈ దంపతులకు అబ్బాయి పుట్టాడు.
అంతిమ్ తండ్రి రామ్ ఒకప్పుడు కబడ్డీ ఆడేవాడు. ఆమె పెద్దక్క సరిత కూడా కబడ్డీ క్రీడాకారిణే. దీంతో అంతిమ్ను కూడా కబడ్డీ వైపే నడిపించాలని తండ్రి అనుకున్నాడు. కానీ ఆమెను రెజ్లర్ను చేయాలని సరిత పట్టుబట్టింది. దీంతో 20 కిలోమీటర్ల దూరంలోని హిసార్ నగరానికి తనయలిద్దరినీ రామ్ తీసుకుని వెళ్లేవాడు. ఆ తర్వాత మహావీర్ స్టేడియంలో అంతిమ్ శిక్షణ కోసం కుటుంబమంతా హిసార్కు మకాం మార్చింది. కానీ వ్యవసాయం చేసే రామ్ దగ్గర బర్రెలు కూడా ఉండేవి. వీటి కోసం హిసార్ బయట ఇల్లు కట్టాడు. స్వదేశంలో టోర్నీలు, శిక్షణ శిబిరాల కోసం అంతిమ్తో పాటు రామ్ వెళ్లి దగ్గర్లోనే అద్దెకు ఉండేవాడు. అంతిమ్ కెరీర్ కోసం టెంపో ట్రక్కు, ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్ కూడా అమ్మేశాడు.
నమ్మకాన్ని నిలబెడుతూ..
కుటుంబ నమ్మకాన్ని నిలబెడుతూ అంతిమ్ త్వరగానే రెజ్లింగ్లో పట్టు సాధించింది. 11 ఏళ్లకే తనకంటే సీనియర్ రెజ్లర్లతో తలపడి గెలిచేది. ఆట కోసం అబ్బాయిల మాదిరే తలకట్టు తీయించుకోవాల్సి రావడంతో ఏడ్చింది. కానీ రెజ్లింగ్ ప్రాణంగా సాగే ఆమె ఇప్పటికీ సాధనలో తీవ్రంగా కష్టపడుతోంది. రోజుకు 8 గంటలు ప్రాక్టీస్లోనే మునిగిపోతోంది. సహజంగానే అబ్బిన నైపుణ్యాలు, శక్తితో పతకాల వేటలో సాగుతోంది. 2018లో అండర్-15 జాతీయ టైటిల్ గెలిచిన తర్వాత అంతిమ్ తిరిగి చూసుకోలేదు. జాతీయ, ఆసియా స్థాయిలో సత్తాచాటింది. కరోనా సమయంలో తమ్ముడు అర్పిత్తో కలిసి ప్రాక్టీస్ చేసేది. అర్పిత్ కూడా రెజ్లరే (గ్రీకో రోమన్). రాష్ట్ర అండర్-15 ఛాంపియన్షిప్లో అతను కాంస్యం నెగ్గాడు.
మ్యాట్పై సత్తాచాటే అంతిమ్.. బయట కూడా యోధురాలే. ఈ ఏడాది ఆసియా క్రీడలకు బజ్రంగ్, వినేశ్ ఫొగాట్కు మినహాయింపునిచ్చిన సంగతి తెలిసిందే. కానీ వినేశ్ పోటీపడే 53 కేజీల విభాగంలోనే అంతిమ్ ఉంది. దీంతో ట్రయల్స్ లేకుండా నేరుగా ఎలా ఎంపిక చేస్తారంటూ అంతిమ్ దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. అక్కడ తీర్పు ప్రతికూలంగా రావడంతో సుప్రీం కోర్టుకూ వెళ్దామనుకుంది. మరోవైపు ట్రయల్స్లో విజేతగా నిలిచింది. చివరకు వినేశ్ గాయం కారణంగా ఆసియా క్రీడల నుంచి తప్పుకోవడంతో ఇప్పుడు ఆ స్థానంలో చైనా వెళ్లేందుకు అంతిమ్ సిద్ధమవుతోంది. ఆసియా క్రీడలు, ప్రపంచ సీనియర్ ఛాంపియన్షిప్స్లో సత్తాచాటడంతో పాటు వచ్చే ఏడాది పారిస్ ఒలింపిక్స్లో పతకం గెలవడమే అంతిమ్ లక్ష్యం.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన