Ashwin: హైదరాబాద్ కెప్టెన్సీ నిర్ణయం షాక్కు గురి చేసింది: అశ్విన్
ఐపీఎల్లో ఇవాళ రెండు మ్యాచ్లు జరగనున్నాయి. కోల్కతాతో హైదరాబాద్.. పంజాబ్ కింగ్స్తో దిల్లీ తలపడనున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ తన తొలి మ్యాచ్లో కోల్కతాతో తలపడేందుకు సిద్ధమవుతోంది. కొత్త కెప్టెన్ ప్యాట్ కమిన్స్ నాయకత్వంలో ఈసారి భారీ అంచనాలతో బరిలోకి దిగింది. గత సీజన్లో దారుణమైన ప్రదర్శనతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో కిందకి దిగజారింది. ఐదెన్ మార్క్రమ్ స్థానంలో కమిన్స్ను హైదరాబాద్ మార్చిన సంగతి తెలిసిందే. అయితే, కమిన్స్ నియామకంపై భారత సీనియర్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
‘‘సన్రైజర్స్ వరుసగా రెండు టైటిళ్లను దక్కించుకుంది. దక్షిణాఫ్రికా 20 లీగ్లో ఆ ఘనత సాధించింది. అద్భుతమైన జట్లతో ఆకట్టుకుంది. కానీ, ఐపీఎల్కు వచ్చేసరికి ఆ జట్టు తీసుకున్న నిర్ణయం షాక్కు గురి చేసింది. ప్యాట్ కమిన్స్ను హైదరాబాద్ టీమ్కు సారథిగా నియమించుకుంది. SA20 టీ20లో రెండు టైటిళ్లను అందించిన మార్క్రమ్ను జట్టులో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యమేసింది. ఆటగాడిగా కమిన్స్ విషయంలో ఇబ్బందేమీ లేదు. కానీ, కెప్టెన్గా మాత్రం అతడితోపాటు జట్టుకు కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ట్రావిస్ హెడ్ను బ్యాకప్గా పెట్టుకోవాల్సి ఉంది. ఎందుకంటే మార్క్రమ్, కమిన్స్, క్లాసెన్, వనిందు.హసరంగ రూపంలో నలుగురు విదేశీ ఆటగాళ్లు మాత్రమే తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. ఒకవేళ కొన్ని మైదానాల్లో హసరంగను వద్దనకుంటే.. ఫరూఖి లేదా మార్కో ఎన్సెన్లో ఒకరు ఉండాల్సిందే’’ అని అశ్విన్ వ్యాఖ్యానించాడు.
రిషభ్ అదరగొట్టేస్తాడు: రికీ పాంటింగ్
రోడ్డు ప్రమాదం తర్వాత కోలుకుని వచ్చిన రిషభ్ పంత్ తొలిసారి మైదానంలోకి దిగేందుకు రెడీగా ఉన్నాడు. పంజాబ్తో దిల్లీ తలపడనుంది. ఈ క్రమంలో దిల్లీ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ మాట్లాడుతూ.. ‘‘వైజాగ్లో మేం వారం రోజులపాటు ట్రైనింగ్ శిబిరం నిర్వహించాం. రిషభ్ పంత్ చాలా సౌకర్యంగా కనిపించాడు. తప్పకుండా అతడి నుంచి అద్భుతమైన క్రికెట్ను చూడబోతున్నాం. బ్యాటింగ్లోనే కాకుండా స్టంప్స్ వెనక చురుగ్గా కదిలాడు. కొన్నిసార్లు ఎక్కువ సమయం బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. కానీ, నేను అతడిని పక్కకు తీసుకెళ్లేవాడిని. గతంలో ఎక్కడ ఆగిపోయాడో.. అక్కడినుంచే ప్రారంభమవుతుంది. జట్టు కోసం ఏం చేయాలనుకుంటున్నాడో తన ప్రవర్తన, నవ్వులోనే తెలిసిపోతుంది’’ అని రికీ పాంటింగ్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
Paris Olympics 2024: ఒలింపిక్స్ వేడుకలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో జరిగిన పొరపాటుపై నిర్వాహకులు క్షమాపణలు కోరారు. -
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
టెస్టుల్లో సచిన్ తెందూల్కర్ అత్యధిక పరుగుల రికార్డును ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ (Joe Root) బ్రేక్ చేసే అవకాశముందని భారత మాజీ వికెట్కీపర్ దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) అభిప్రాయపడ్డాడు. -
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్