IPL 2024: సన్రైజర్స్ ఆ నిర్ణయం తీసుకోవడంతో షాక్ అయ్యా: అశ్విన్
ఐపీఎల్ 2024 సీజన్ మరో రెండ్రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ ఏడాది సన్రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) పాట్ కమిన్స్ సారథ్యంలో బరిలోకి దిగుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: గత ఐపీఎల్ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఈసారి ఎలాగైనా మంచి ప్రదర్శన చేయాలనే లక్ష్యంతో జట్టులో భారీ మార్పులు చేసింది. ఈక్రమంలోనే ఆస్ట్రేలియాను వన్డే ప్రపంచకప్, డబ్ల్యూటీసీ ఛాంపియన్గా నిలిపిన పాట్ కమిన్స్ను వేలంలో రూ.20.50 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది. అంతేకాదు ఐదెన్ మార్క్రమ్ స్థానంలో కమిన్స్ (Pat Cummins)ను కెప్టెన్గా నియమించింది. సన్రైజర్స్ మార్క్రమ్ను కెప్టెన్సీ నుంచి తప్పించడం గురించి భారత ఆటగాడు, రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడాడు. సౌతాఫ్రికా టీ20లీగ్ (SA20)లో సన్రైజర్స్కు వరుసగా రెండు టైటిళ్లు అందించిన మార్క్రమ్ను ఐపీఎల్లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడంతో షాక్కు గురయ్యానని అశ్విన్ పేర్కొన్నాడు.
‘‘సౌతాఫ్రికా టీ20 లీగ్లో మార్క్రమ్ సారథ్యంలో సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ వరుసగా రెండు టైటిళ్లు సాధించింది. అత్యద్భుతమైన జట్లతో ట్రోఫీలు అందుకుంది. కానీ, ఐపీఎల్లో మార్క్రమ్ను కాదని కమిన్స్ను కెప్టెన్గా నియమించారు. నిజంగా ఇది నాకు షాకింగ్గా అనిపించింది. వారు (సన్రైజర్స్) మార్క్రమ్నే సారథిగా కొనసాగిస్తారని భావించా. కమిన్స్ను కెప్టెన్గా చేయడం వల్ల తుది జట్టు కూర్పులో సన్రైజర్స్కు ఇబ్బందులు ఎదురవుతాయి. ట్రావిస్ హెడ్ బ్యాకప్గా ఉపయోగించుకున్నా. మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, వానిందు హసరంగలను తుది జట్టులోకి తీసుకోవాల్సి ఉంటుంది. హసరంగ అవసరం లేదని భావిస్తే కొన్ని మ్యాచ్ల్లో అతనికి బదులుగా ఫజల్హాక్ ఫారూకీ లేదా మార్కో జాన్సెన్ను ఆడించే ఛాన్స్ ఉంది. ఏది ఏమైనా విదేశీ ఆటగాళ్లను ఆడించడంలో సన్రైజర్స్కు ఇబ్బందులు తప్పవు’’ అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో అన్నాడు. ఈ సీజన్లో ఆరెంజ్ ఆర్మీ తొలి మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ను ఢీకొట్టనుంది. మార్చి 23న ఈడెన్ గార్డెన్స్లో ఈ మ్యాచ్ జరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం