IPL 2024: సన్రైజర్స్ ఆ నిర్ణయం తీసుకోవడంతో షాక్ అయ్యా: అశ్విన్
ఐపీఎల్ 2024 సీజన్ మరో రెండ్రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ ఏడాది సన్రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) పాట్ కమిన్స్ సారథ్యంలో బరిలోకి దిగుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: గత ఐపీఎల్ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఈసారి ఎలాగైనా మంచి ప్రదర్శన చేయాలనే లక్ష్యంతో జట్టులో భారీ మార్పులు చేసింది. ఈక్రమంలోనే ఆస్ట్రేలియాను వన్డే ప్రపంచకప్, డబ్ల్యూటీసీ ఛాంపియన్గా నిలిపిన పాట్ కమిన్స్ను వేలంలో రూ.20.50 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది. అంతేకాదు ఐదెన్ మార్క్రమ్ స్థానంలో కమిన్స్ (Pat Cummins)ను కెప్టెన్గా నియమించింది. సన్రైజర్స్ మార్క్రమ్ను కెప్టెన్సీ నుంచి తప్పించడం గురించి భారత ఆటగాడు, రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడాడు. సౌతాఫ్రికా టీ20లీగ్ (SA20)లో సన్రైజర్స్కు వరుసగా రెండు టైటిళ్లు అందించిన మార్క్రమ్ను ఐపీఎల్లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడంతో షాక్కు గురయ్యానని అశ్విన్ పేర్కొన్నాడు.
‘‘సౌతాఫ్రికా టీ20 లీగ్లో మార్క్రమ్ సారథ్యంలో సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ వరుసగా రెండు టైటిళ్లు సాధించింది. అత్యద్భుతమైన జట్లతో ట్రోఫీలు అందుకుంది. కానీ, ఐపీఎల్లో మార్క్రమ్ను కాదని కమిన్స్ను కెప్టెన్గా నియమించారు. నిజంగా ఇది నాకు షాకింగ్గా అనిపించింది. వారు (సన్రైజర్స్) మార్క్రమ్నే సారథిగా కొనసాగిస్తారని భావించా. కమిన్స్ను కెప్టెన్గా చేయడం వల్ల తుది జట్టు కూర్పులో సన్రైజర్స్కు ఇబ్బందులు ఎదురవుతాయి. ట్రావిస్ హెడ్ బ్యాకప్గా ఉపయోగించుకున్నా. మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, వానిందు హసరంగలను తుది జట్టులోకి తీసుకోవాల్సి ఉంటుంది. హసరంగ అవసరం లేదని భావిస్తే కొన్ని మ్యాచ్ల్లో అతనికి బదులుగా ఫజల్హాక్ ఫారూకీ లేదా మార్కో జాన్సెన్ను ఆడించే ఛాన్స్ ఉంది. ఏది ఏమైనా విదేశీ ఆటగాళ్లను ఆడించడంలో సన్రైజర్స్కు ఇబ్బందులు తప్పవు’’ అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో అన్నాడు. ఈ సీజన్లో ఆరెంజ్ ఆర్మీ తొలి మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ను ఢీకొట్టనుంది. మార్చి 23న ఈడెన్ గార్డెన్స్లో ఈ మ్యాచ్ జరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లఖ్నవూ సూపర్ జెయింట్స్కు గుడ్న్యూస్.. ముంబయికి చావోరేవో
లఖ్నవూకు శుభవార్త. గాయం కారణంగా పలు మ్యాచ్లకు దూరమైన మయాంక్ యాదవ్ (mayank yadav) ఫిట్నెస్ సాధించాడు. -
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్
కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తమ జట్టు ఓపెనర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్ బ్యాటింగ్ తీరు, టీమ్ మీటింగ్ల పట్ల వీరు ఎలా వ్యవహరిస్తారనే ఆసక్తికర విషయాలు వివరించాడు. -
ఎవరా 15!.. నేడు సెలక్షన్ కమిటీ సమావేశం
టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్నా భారత జట్టుపై ఇంకా స్పష్టత లేదు. చాలా స్థానాలకు ఆటగాళ్ల మధ్య పోటీ ఉండడంతో ఎన్నో ఊహాగానాలు. ఈ అనిశ్చితికి తెరపడడానికి ఎంతో సమయం లేదు. -
కోల్కతా కుమ్మేసింది
కోల్కతా అదరగొట్టింది. ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ దిల్లీ క్యాపిటల్స్ను చిత్తుగా ఓడించింది. వరుణ్, అరోరా, హర్షిత్ సూపర్ బౌలింగ్తో దిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన నైట్రైడర్స్.. సాల్ట్ జోరుతో స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. -
క్వార్టర్స్లో భారత్
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఇప్పటికే భారత అమ్మాయిలు క్వార్టర్స్ఫైనల్స్లో ప్రవేశించగా.. తాజాగా థామస్ కప్లో పురుషుల జట్టు కూడా తుది ఎనిమిదిలో చోటు దక్కించుకుంది. -
పారిస్కు ఏడుగురు షట్లర్లు
పారిస్ ఒలింపిక్స్లో భారత్ నుంచి ఏడుగురు షట్లర్లు పోటీపడబోతున్నారు. ఒలింపిక్ క్రీడల అర్హత ర్యాంకింగ్ ప్రకారం పి.వి.సింధు (మహిళల సింగిల్స్), హెచ్ఎస్.ప్రణయ్, లక్ష్యసేన్ (పురుషుల సింగిల్స్), సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి (పురుషుల డబుల్స్), అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో (మహిళల డబుల్స్) ఈ మెగా ఈవెంట్ బరిలో నిలిచారు. -
జ్యోతి @ 2
ఆర్చరీ ప్రపంచకప్లో మూడు పసిడి పతకాలతో సత్తా చాటిన తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ.. కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు సాధించింది. -
టీ20 ప్రపంచకప్కు కివీస్ జట్టిదే
కేన్ విలియమ్సన్ నాలుగోసారి టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్కు నాయకత్వం వహించనున్నాడు. వేలి గాయం నుంచి కోలుకుంటున్న ఓపెనర్ డెవోన్ కాన్వేకు కూడా 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కింది. -
ఛాంపియన్స్ ట్రోఫీకి మూడు వేదికలు
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ఇండియా పాకిస్థాన్కు వెళ్తుందో లేదో తెలియదు.. అసలు ఆ టోర్నీ పాకిస్థాన్లోనే జరుగుతుందో లేదో తెలియదు కానీ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం ఆ టోర్నీ కోసం ఏర్పాట్లు చేసుకుంటుంది.
తాజా వార్తలు (Latest News)
-
యువ రోహిత్ను చూశారా.. బర్త్డే గిఫ్ట్గా టీనేజ్ ఫొటో షేర్ చేసిన తల్లి పుర్ణిమ
-
షారుక్ విమానం కోరిక.. కమల్ హాసన్ ఫన్నీ కామెంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అభ్యంతరకర వీడియోల ఘటన.. ఎంపీ ప్రజ్వల్పై సస్పెన్షన్ వేటు
-
సోనీ రియాన్ పాకెట్ ఏసీ.. ఎక్కడికైనా వెంట తీసుకెళ్లొచ్చు!
-
విజయవాడలో విషాదం.. ప్రముఖ వైద్యుడు సహా ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి