T20 World Cup 2024: మైదానంలోకి కోచ్ - చీఫ్ సెలక్టర్.. వార్మప్ మ్యాచ్లో ఆసీస్దే విజయం
అనూహ్య పరిణామాలతో ఆసీస్ తన తొలి వార్మప్ మ్యాచ్లో కేవలం 9 మంది ప్రధాన ఆటగాళ్లతోనే బరిలోకి దిగాల్సి వచ్చింది. దీంతో ఆ జట్టు కోచింగ్ సిబ్బంది మైదానంలోకి దిగడం విశేషం.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్లో ఆడటం వల్ల ఆస్ట్రేలియా క్రికెటర్లు కొందరు ఇంకా విండీస్ చేరలేదు. కొందరికి గాయాలు కావడంతో వార్మప్ మ్యాచ్లో ఆడేందుకు కనీసం 11 మంది కూడా అందుబాటులో లేకుండాపోయారు. దీంతో నమీబియాతో జరిగిన వార్మప్ మ్యాచ్లో ఆసీస్ చీఫ్ సెలక్టర్ జార్జ్ బెయిలీ, ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్డొనాల్డ్ మైదానంలోకి దిగారు. వారితోపాటు ఇతర సహాయక సిబ్బంది కూడా ఫీల్డింగ్ చేశారు. జూన్ 5లోగానే కమిన్స్తోపాటు ఇతర క్రికెటర్లు విండీస్కు చేరుకుంటారు. ఆ రోజే వరల్డ్ కప్లో ఒమన్తో ఆసీస్ తొలి మ్యాచ్ ఆడనుంది.
ఫామ్లోకి వచ్చిన వార్నర్
ఐపీఎల్లో పెద్దగా ఆకట్టుకోని డేవిడ్ వార్నర్ మళ్లీ తన మునుపటి ఫామ్లోకి వచ్చాడు. నమీబియాను 119/9 స్కోరుకే కట్టడి చేసిన ఆసీస్.. లక్ష్య ఛేదనలో కేవలం 10 ఓవర్లలోనే పూర్తి చేసింది. డేవిడ్ వార్నర్ 21 బంతుల్లో 54 పరుగులు చేశాడు. టిమ్ డేవిడ్ (23), మ్యాథ్యూ వేడ్ (12*) దంచేశారు. ఈ మ్యాచ్ ఫీల్డింగ్ సమయంలో కెప్టెన్ మిచెల్ మార్ష్ గాయం కారణంగా మధ్యలోనే డగౌట్కు వెళ్లాడు. అయితే, తన ఇంజూరీ పెద్ద సమస్య కాదని ఆ తర్వాత మార్ష్ వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం